-
అనుమానాలొద్దు.. సలహాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ఇంటింటి సర్వే చేస్తూనే బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఆ వర్గానికి సంబంధించిన కుల గణన చేయటానికి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంలో తమ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పాలితులను పాలకులను చేయడానికే తమ తపన అని వ్యాఖ్యానించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చేపట్టిన చర్యల తరహాలోనే రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడే గొప్ప నిర్ణయమైనందున దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన సందేహాలపై సీఎం వివరణ ఇచ్చారు. అండగా ఉండాలంటే లెక్కలు తెలియాలని సుప్రీం చెప్పింది ‘ఈ తీర్మానంపై సలహాలు సూచనలు ఇవ్వటం కంటే అనుమానాలు లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించటంతో పాటు ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారు. యూపీఏ–1 హయాంలో మైనారిటీల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వేశారు. దాని సిఫారసుల ఫలితంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడు బీసీల సమగ్ర అభ్యున్నతి కోసం, వారికి ప్రభుత్వం అండగా నిలవాలన్న రాహుల్గాంధీ ఆలోచన మేరకు మా ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు వెల్లడించలేదు. పదేళ్లయినా అది ఓ రహస్య నివేదికగానే ఉండిపోయింది. ఒకే ఒక కుటుంబం ఆ వివరాలను అవసరమైనప్పుడు చూసుకుని, ఎన్నికల సమయంలో దాన్ని వాడుకుంది. మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఈ తీర్మానం అత్యంత కీలకమైంది. బలహీనవర్గాలకు అండగా నిలబడాలంటే ఆ వర్గం లెక్కలేంటో తెలియాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉందనే అనుమానాలు ఏవైనా ప్రతిపక్షానికి ఉంటే వాటిని వెల్లడిస్తూ మంచి సూచనలు చేయాలి..’అని సీఎం కోరారు. అర శాతం ఉన్నోళ్లకు బాధగానే ఉంటుంది.. ‘అర శాతం ఉన్నోళ్లకు కచి్చతంగా బాధ ఉంటుంది. రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకున్నోళ్లకు.. ఇప్పుడు లెక్కలన్నీ బయటకు వచ్చి 50 శాతం ఉన్నోళ్లకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న బాధ ఉండొచ్చు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి అభిప్రాయం చెప్పాలి. లేదా వారు బాధ్యత అప్పగించిన వారైనా చెప్పాలి. నకలుæ చిట్టీలు అందించినట్టు కడియం శ్రీహరి పక్కన చేరి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు సందేహం లేదు. కానీ, పక్కన కూర్చున్నవారి సావాస దోషం ఆయనను తప్పుదోవ పట్టిస్తోంది. మేనిఫెస్టో, ఎన్నికల హామీలపై చర్చ కావాలంటే ప్రత్యేకంగా పెట్టుకుందాం. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష పార్టీ ఏం హామీ ఇచ్చింది, వాటిని ఎంతమేర అమలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన హామీలు, ఈ 70 రోజుల్లో అమలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దాం..’అని రేవంత్ అన్నారు. కేవలం బీసీల కులగణనతో వారికే నష్టం: గంగుల కమలాకర్ బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, అయితే దీనిపై కొన్ని సందేహాలున్నాయని అన్నారు. తీర్మానం కాకుండా బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం బీసీ కుల గణన చేస్తే చివరికి బీసీలే నష్టపోతారని పేర్కొన్నారు. సర్వే ఎప్పట్లోగా చేసి వివరాలు వెల్లడిస్తారో కూడా చెప్పాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారని, వచ్చే జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో దాన్ని అమలు చేయాలని కోరారు. బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్ప్లాన్ తెస్తామని చెప్పినా బడ్జెట్లో వాటి ఊసు లేదన్నారు. తీర్మానంలో స్పష్టత లేదు: కడియం శ్రీహరి తీర్మానంలో స్పష్టత లోపించిందని, సమగ్ర కుటుంబ సర్వే అని, బీసీ కుల గణన అని ఉందని, ఇందులో ఏది చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని తీర్మానంలో పూర్తి స్పష్టత ఉందని, అన్ని వర్గాలు, అన్ని కులాల ఆర్థిక, సామాజిక ఇతర అంశాల పూర్తి వివరాలను సర్వే ద్వారా సేకరించనున్నట్టు చెప్పారు. బీసీ కులగణన కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. విపక్షం ఒకవేళ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టైతే ఆ విషయం బహిరంగంగా చెప్పాలని అన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా కులగణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (కులగణన) పేరుతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిపేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులతోపాటు ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన ప్రణాళికలను రూపొందించేందుకు ఉద్దేశించిన ఈ తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సభ ముందుంచారు. సీఎం ఎ.రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, గంగుల కమలాకర్, కడియం శ్రీహరి, కాలేరు వెంకటేశ్, కాంగ్రెస్ సభ్యులు వాకాటి శ్రీహరి, శంకరయ్య, ఆది శ్రీనివాస్, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చర్చలో పాల్గొన్నారు. చట్టం అవసరం లేదు: పొన్నం ప్రభాకర్ జనాభా దామాషా పద్ధతిలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన ఎలా చేయాలనే దానిపై అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానా లు రూపొందిస్తామని చెప్పారు. కులగణన తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ఆయన బదులిచ్చారు. కులగణనకు ఎలాంటి చట్టం అవసరం లేదని, 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చట్టం లేకుండానే చేపట్టిందని తెలిపారు. అయితే తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టడంతో పదేళ్లుగా వెనక్కు పోయిందని అన్నారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పటికీ బయట పెట్టలేదని విమర్శించారు. తాజాగా చేపట్టనున్న సర్వే అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2014 నుంచి 2023 వరకు అప్పటి ప్రభుత్వం బీసీల కోసం రూ.23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. ఎంబీసీలకు వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. న్యాయపరమైన సలహాల మేరకే ముందుకు: భట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణనకు అంకురార్పణ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. ‘ఎవరెంత ఉంటారో వారికి అంత చెందాలి’అని రాహుల్గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగానే ఈ నెల 4న కేబినెట్లో చర్చించి కులగణన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. బీసీలకు సబ్ప్లాన్ కూడా తీసుకొస్తామని, సర్వే అనంతరం బీసీల శాతాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పిస్తేనే మంచిది: కేటీఆర్ రాష్ట్రంలో కులగణనను బీఆర్ఎస్ సంపూర్ణంగా స్వాగతిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చట్టబద్ధత కల్పిస్తేనే ఫలవంతమవుతుందని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ మొదటి నుంచి పనిచేస్తోందన్నారు. 2004లోనే కేసీఆర్.. ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్ రావుతో కలసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కలసి ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. 2014 తర్వాత శాసనసభలో రెండుసార్లు ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలి: అక్బరుద్దీన్ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు వీలుగా కులగణన చేపట్టేందుకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలతోపాటు మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధనలను తొలగించాలన్నారు. కూనంనేని మాట్లాడుతూ.. కులగణనకు సంబంధించిన విధివిధానాలు ఏమిటో తెలపాలని విజ్ఞప్తి చేశారు. బిల్లు రూపంలో తీసుకొస్తే చట్టబద్ధత ఉంటుందని సూచించారు. -
సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నేతలు చేపట్టిన రిలే దీక్షలు 100వ రోజుకు చేరుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ తీర్మానం ఉద్యమానికి కొండంత బలం ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని, విశాఖ ఉక్కు ఉద్యమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉందని రాజశేఖర్ అన్నారు. చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ ‘పరిషత్ ఎన్నికల తీర్పుపై డివిజన్ బెంచ్కు ప్రభుత్వం’ -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దం: విజయసాయిరెడ్డి
-
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోరని, త్వరలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేపడతామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో ఎలా నడిపించాలనే అంశంపై సీఎం జగన్ ప్రధాని మోదీకి రెండో సారి లేఖ రాశారని వివరించారు. సీఎం జగన్ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రజల ఆకాంక్షను, సెంటిమెంట్ను ప్రధానికి వివరిస్తారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాల పోరాటంతో సాధించుకున్నదని, గతంలో జరిగిన స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే 20 వేల మంది ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు. మొదట్లో స్టీల్ ప్లాంట్ అత్యుత్తమంగా నడిచిందని, చంద్రబాబు హయాం (2014-15) నుంచే నష్టాల బాట పట్టిందని ఆరోపించారు. సొంత గనులు లేకపోవడం ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి మరో కారణమని తెలిపారు. కేంద్రం సొంత గనులు కేటాయిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. రుణభారాన్ని మూలధనంగా మార్చాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం కేవలం నష్టాలను మాత్రమే చూపించడం సరికాదని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement