-
అసెంబ్లీ సీట్ల పెంపు: కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశం అంతటా అసెంబ్లీ సీట్ల పెంపు జరిగినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్ల పెంపు జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ చట్టం ప్రకారం.. ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ సీట్లను పెంచడానికి అవకాశం లేదని తెలిపారు. గత పాలకులు ఏపీ విభజన చట్టంలో ఇష్టం ఉన్నట్లు అనేక అంశాలు పెట్టారని.. అసెంబ్లీ సీట్ల పెంపు అంశం రాత్రికి రాత్రి తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. దేశంలో సీట్ల పెంపు పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆలోచన చేయలేదని, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై న్యాయ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాలపై పెంపుపై మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. కశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపు..! గురువారం ఢిల్లీలో జమ్మూకశ్మీర్ బ్లాక్ లెవల్ ప్రజాప్రతినిధులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ వేగవంతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని స్థానిక నేతలకు పిలుపు నిచ్చారు. ‘మార్చి, ఏప్రిల్ లో జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తా. కశ్మీర్లో అభివృద్ధిని వేగవంతం చేస్తాం. కశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ అంశపై మరింత లోతుగా ఆలోచిస్తున్నాం. దానికి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. మే నెలలో జమ్మూ కశ్మీర్ ఔట్ రీచ్ కార్యక్రమం పెడుతున్నాం. కేంద్ర మంత్రులంతా బ్లాక్ లెవల్కు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పన్నాగాలు పారలేదు. స్థానిక ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు. బాధ్యులపై కఠిన చర్యలు... ఢిల్లీలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆస్తుల విధ్వంసం, మరణాలకు కారకులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు. -
'చంద్రబాబు మొదటి పులకేశి'
హైదరాబాద్: అసెంబ్లీ సీట్లు పెంపు 2026 వరకు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీలో ప్రకంపనలు రేగాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీట్లు పెరుగుతాయంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్వీట్లు తినిపించారని గుర్తు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ఓటుకు రూ. 5 వేలు ఇచ్చి కొనగలనన్న చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను సుమోటుగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. చంద్రబాబు మొదటి పులకేశి, లోకేశ్ రెండో పులకేశి తయారయ్యారని.. ఏపీ కేబినెట్ జోకర్స్ డెన్గా మారిందని ఎద్దేవా చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement