-
సాగునీటి ప్రాజెక్టులకు గతం మాదిరే కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు గత ఏడాది కేటాయించిన స్థాయిలోనే ప్రస్తుత బడ్జెట్లో కూడా నిధులను కేటాయించారు. ఆయా ప్రాజెక్టులకు 2013-14లో కేటాయించిన నిధులకు సమానంగా తాజా బడ్జెట్లో కూడా చూపించారు. ఈ విషయంలో ప్రాజెక్టుల నిర్మాణ దశలను పట్టించుకోలేదు. ఏ ప్రాజెక్టుకు ఎంత మేర నిధులు అవసరమనే విషయాన్ని అంచనా వేయలేదు. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పోయిన ఏడాది మాదిరిగానే అంచనా వేసి బడ్జెట్లో పొందుపరిచారు. కాగా, నిర్మాణ పనుల్ని పక్కన పెట్టిన దుమ్ముగూడెం-సాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టుకు రూ. 97 కోట్లను కేటాయించడం విశేషం. అలాగే కేంద్రం నుంచి ఏఐబీపీ కింద రూ. 1394.27 కోట్లు రానున్నాయని అంచనా వేశారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎక్కువ నిధులను కేటాయించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ. 1,051 కోట్లను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ. 87.50 కోట్ల వస్తాయని, రాష్ట్రం నుంచి రూ. 370.50 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించారు. పునరావాస పనులకోసం రూ. 185 కోట్లను కేటాయించారు. -
సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం: వైఎస్ విజయమ్మ
సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చేతగాని పాలన వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి: విజయమ్మ పాత అంచనాలనే తిరగేసి తెచ్చారని విమర్శ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించుకోవాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం నాయకురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. నీటి పారుదల, గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజుల చెల్లింపు వంటి పథకాలకు ఈ బడ్జెట్లో భారీగా కోతలు వేశారని ఆమె వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం ఆమె సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2013-14 ఏడాదికి సంబంధించిన సవరించిన అంచనాలే ఇవ్వలేదని... పాత అంచనాలనే మళ్లీ తిరగేసి 2014-15 బడ్జెట్పై మాట్లాడ్డానికేమీ లేకుండా చేశారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను తుర్పారబట్టారు. అవి ఆమె మాటల్లోనే.. 2012-13లో రూ. లక్షా 16 వేల కోట్ల మేరకు రాబడిని అంచనా వేయగా.. రూ. లక్షా 3 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 13 వేల కోట్ల లోటు ఏర్పడింది. దాంతోపాటు రూ. 22,850 కోట్ల రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండగా.. రూ. 17,850 కోట్లే సేకరించారు. మొత్తంగా రుణాలు తీసుకోవడంలో 5,300 కోట్లు, రాబడిలో రూ. 13,000 కోట్ల తగ్గుదల కలుపుకొని రూ. 18,000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం కోల్పోయాం. ఇక కేంద్రం నుంచి మనకు రూ. 14,940 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ రావాల్సి ఉండగా.. 7,687 కోట్లు మాత్రమే వచ్చాయి. 2012-13 సంవత్సరానికి రూ. 54 వేల కోట్ల ప్రణాళికా వ్యయం అంచనాలుండగా... సవరించిన ప్రకారం ఆ మొత్తం రూ. 48 వేల కోట్లకు వచ్చింది. అందులోనూ ఖర్చు చేసింది రూ. 43 వేల కోట్లే. ఇక పెట్టుబడి వ్యయం రూ. 19,972 కోట్లయితే.. ఖర్చు చేసింది మాత్రం రూ. 15,137 కోట్లే. 2004-09 మధ్య కాలంలో 11 నుంచి 12 శాతంగా ఉండిన రాష్ట్ర అభివృద్ధి రేటు.. ఇప్పుడు 5.29 శాతానికి పడిపోయింది. వీటన్నింటి కారణంగా... సంక్షేమ, ప్రజోపయోగ పథకాలకు తక్కువ నిధులు కేటాయించే పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణం. రాష్ట్రంలో 1994 వరకూ ఆస్తులు, అప్పుల నిష్పత్తి 101 ః 100గా ఉంటే 1994-2004 మధ్య కాలంలో (చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా) ఆస్తులు, అప్పుల నిష్పత్తి 50 ః 100గా ఉండేది. అలాంటిది వైఎస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఆస్తులు గణనీయంగా పెరిగాయి. 2004-09 మధ్యలో ఆస్తులు, అప్పుల నిష్పత్తి 130 ః 100 గా ఉండింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అన్నీ ఉండి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ తక్కువగా తెచ్చుకుంది. ప్రణాళికా వ్యయాన్ని కూడా సరిగా ఖర్చు పెట్టలేకపోయింది. ఇద ంతా ప్రభుత్వ ైవె ఫల్యం. చేతగానితనమే.. ఇది చేతగాని ప్రభుత్వం, చేతగాని పాలన. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని కూడా పూర్తిగా చదవలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు దగ్గరలో ఉంది. ప్రజా విద్రోహకం... అంపశయ్యపై ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజావిద్రోహక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అంకెల గారడీతో ప్రజలను మోసపుచ్చిందని దుయ్యబట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ గురించి గొప్పలు చెప్పుకొన్నప్పటికీ అందులో తాజా గణాంకాలు లేనేలేవని పేర్కొంది. పార్టీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బి.గుర్నాథరెడ్డి తదితరులు సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎప్పుడెప్పుడు టీడీపీలో చేరాలనే ఆత్రుతతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కూడా పూర్తిగా చదవకుండా సాంప్రదాయానికి తూట్లు పొడిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్నట్టల్లా ఆడుతున్న సీఎం కిరణ్ బండారం త్వరలో బట్టబయలు కానుందని రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన రోజే కిరణ్ రాజీనామా చేసుంటే విభజన జరిగేదే కాదన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణలో తన కుమారుడు లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించడం కోసం చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు. -
రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్
బడ్జెట్ సమర్పయామీ అసెంబ్లీలో ఆనం, మండలిలో రామచంద్రయ్య ప్రణాళిక వ్యయం 67,950 కోట్లు.. ప్రణాళికేతర వ్యయం రూ. 1,15,179 కోట్లు ఓటాన్ అకౌంట్ మొదటి 6 నెలల కాలానికి రూ. 79,460 కోట్లు వ్యయం వందశాతం వైకల్యం ఉంటే వెయ్యి రూపాయల పింఛన్ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మండలిలో సభా నాయకుడు సి.రామచంద్రయ్య సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.1,83,129 కోట్ల బడ్జెట్లో ప్రణాళిక వ్యయం కింద రూ.67,950 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.1,15,179 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళితం చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఓటాన్ అకౌంట్లో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి రూ.79,469 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, పేదల కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను గుర్తు చేశారు. ద్రవ్యలోటు రూ.25,402 కోట్లుగా అంచనా వేయగా, రెవెన్యూ మిగులు రూ.474 కోట్లుగా తేల్చారు. ఎస్సీ, ఎస్టీల సత్వర అభ్యున్నతి కోసం ‘ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాలు, తెగల ఉప ప్రణాళిక ఆర్థిక వనరుల చట్టం’ తీసుకు వచ్చినట్లు వివరించారు. బంగారు తల్లి పథకం కింద బాలికా ప్రోత్సాహాక సాధికారత చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. - 2012-13 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.78,564. ఇది దేశ తలసరి ఆదాయం కంటే అధికం. - రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు గతేడాది 5.78 మాత్రమే.. అయినా వ్యవసాయ (7.78%), సేవా (7.75%) రంగాలు గణనీయ ప్రగతి సాధించాయి. - పారిశ్రామిక ప్రగతి ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదు. - 2004-05 ఆర్థిక సంవత్సరంలో 29.9 శాతం ఉన్న పేదరికం.. 2011-12 సంవత్సరానికికల్లా 9.2 శాతానికి తగ్గింది. - తృణధాన్యాల అభివృద్ధిలో మంచి ప్రగతి సాధించినందుకు కేంద్రం రాష్ట్రానికి కృషి కర్మాన్ అవార్డు ఇచ్చింది. - 25.54 లక్షల మందికి రూ.1,507 కోట్ల సబ్సిడీని ఆన్లై న్లో పంపిణీ చేశాం. - 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 207.29 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా. - దేశంలోనే కోడి గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. - పావలా వడ్డీ రుణాన్ని వడ్డీలేని రుణాలుగా మార్చాం. ఈ రెండింటి కింద ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.2,659 కోట్లు పంపిణీ చేశాం. - వందశాతం వైకల్యం ఉంటే పింఛన్ రూ.500 నుంచి రూ.1000కి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. - అమ్మహస్తం కింద రూ.185కు నిత్యవసర వస్తువులు ఇస్తున్నాం. - జలయజ్ఞంలో 17 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కొత్తగా 19.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడింది. - త్వరగా పూర్తయ్యే పథకాలకు ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయిస్తున్నాం. - 18 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 40 రకాల సేవలను ఏకగవాక్ష వ్యవస్థలోకి తె చ్చినందుకు రాష్ట్రానికి ఇ-బిజ్ అవార్డు లభించింది. - కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 2013-14లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - దుగ్గరాజపట్నంలో భారీ నౌకాశ్రయం, మచిలీపట్నంలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం కింద మరో నౌకాశ్రయం, భావనపాడు, కళింగపట్నంలో చిన్న నౌకాశ్రయాలు ఏర్పాటు చేస్తాం. - చిత్తూరు జిల్లాలో మొదటి దశలో రూ.5,990 కోట్లు, రెండో దశలో రూ.1,400 కోట్లతో మంచినీటి పథకం చేపడుతున్నాం. - రాష్ట్రం నుంచి రూ.51,285 కోట్ల ఐటీ ఎగుమతుల టర్నోవర్ సాధించాం. ఐటీఐఆర్, గే మ్పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. - 2014 సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు 2,370 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభిస్తాయి. - పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్గాంధీ పంచాయతీ సశక్తికరణ్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.203 కోట్లు కేటాయించింది. - ఉద్యోగులకు ఆరోగ్య పథకం ప్రారంభించాం. - రూ.22,377 కోట్లతో ఇప్పటివరకు 66.11 లక్షల గృహాలు నిర్మించాం. కొత్తగా భాషా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. - ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రహ దారులను పీపీపీ కింద నాలుగు లేన్ల రోడ్లుగా మార్చాలని నిర్ణయించాం. - మహిళలకు ప్రత్యేకంగా హెల్ప్లైన్ ఏర్పాటు చేశాం. కొత్తగా 98,652 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. - 2012-13 సంవత్సరంలో తుది లెక్కలు ఆధారంగా రూ.1,128 కోట్ల రెవెన్యూ మిగులు తేలింది. 2013-14లో ఇది రూ.1,023 కోట్లుగా, 2014-15లో ఇది 474 కోట్లుగా ఉంటుందని అంచనా. మమ అనిపించారు.. అసెంబ్లీలో బడ్జెట్ తంతు మొక్కుబడిగా ముగిసింది. తెలంగాణ మంత్రులు, అధికార, విపక్ష సభ్యుల నిరసనలతో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా చదవలేక కేవలం పది నిమిషాల్లోనే మమ అనిపించారు. మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో.. టీ బిల్లు తిరస్కరించే తీర్మానాన్ని ఆమోదించే విషయుంలో సీఎం, స్పీకర్ ఒక ప్రాంతానికి అనుగుణంగా వ్యవహరించారని, అలాగే ఢిల్లీలో వుహిళా వుంత్రులను అవవూనించారని ఆరోపిస్తూ తెలంగాణకు చెందిన మంత్రులు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన మంత్రిమండలి ప్రత్యేక సమావేశానికి సైతం తెలంగాణ మంత్రులు హాజరు కాలేదు. సభలో టీఆర్ఎస్, టీ కాంగ్రెస్, టీ టీడీపీ సభ్యులు పెద్దపెట్టున తెలంగాణ నినాదాలు చేశారు. సభ సజావుగా లేనందున ప్రసంగాన్ని చదివినట్లుగానే భావించాలంటూ ప్రసంగ పాఠంలోని ముందు నాలుగు పేజీలు, చివర్లో బడ్జెట్ పరిమాణాన్ని వివరించి 13వ శాసనసభ చివరి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. పెద్దల సభ ఇంతకంటే మరీ అధ్వానంగా సాగింది. సభా నాయకుడు రామచంద్రయ్య బడ్జెట్ ప్రసంగం ప్రారంభించక ముందే తెలంగాణ ప్రాంత సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఏం జరుగుతుందో తెలియని గందరగోళం మధ్యే.. చైర్మన్ ఆదేశాల మేరకు మంత్రి ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ సభ్యులు సభా నాయకుడి మైక్కు అడ్డంగా చేతులు పెట్టి ప్రసంగించకుండా అడ్డుకున్నారు. దీంతో నిమిషానికే ప్రసంగం ముగించినట్లు పరిగణిస్తూ చైర్మన్ సభను వాయిదా వేశారు. మొత్తమ్మీద కొత్త పథకాలుగానీ, కొత్త కార్యక్రవూలుగానీ, ఉన్న పథకాలకు అధిక కేటారుుంపులుగానీ కనిపించకుండా.. కేవలం ఈ తంతు ముగిస్తే చాలన్న రీతిలో సభా వ్యవహారాలు కొనసాగాయి.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement