-
సాహసానికి ‘స్పాట్’ అవార్డు
తెనాలి : నది వంతెనపై ఆగిన రైలు.. సాంకేతిక సమస్య తో ముందుకు కదలనంటోంది.. సమయం గడుస్తోంది.. వెనక వచ్చే మెమో రైళ్లు ఆగిపోతున్నాయి.. మరికొన్ని నిముషాల్లో వచ్చే సూపర్ఫాస్ట్ రైళ్లకూ బ్రేకులు అని వార్యమైన వేళ.. అసిస్టెంట్ లోకో పైలట్ డ్రైవర్ చేసిన సాహసం.. ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంది. దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ స్పాట్ అవార్డును గెలుచుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సీహెచ్వీపీ ఫణిబాబు రైల్వే శాఖలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్గా బెజవాడ డిపోలో చేస్తున్నారు. ఈ నెల 22న చెన్నై– న్యూఢిల్లీ (నం.12615) సూపర్ఫాస్ట్ రైల్లో డ్యూటీలో ఉన్నారు. చెన్నై నుంచి బయలుదేరిన ఆ రైలు, ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో ఆ రాత్రి 8.14 గంటలకు తడ–సూళ్లూరుపేట మధ్యలో నిలిచిపోయింది. అది కూడా సరిగ్గా కళింగి నది వంతెనపై. లోపాన్ని సరిదిద్ద డం సాధ్యపడలేదు. వాక్యూమ్ పోతోంది.. సంబంధిత బోగీ దిగువ నుండే ఐసోలేషన్ కాక్ను లాక్ చేయాలి.. కిందకు దిగడానికి అక్కడ ఎలాంటి సైడ్ పాత్ వే లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక గార్డు, సిబ్బంది నిస్సహాయంగా ఉండిపోయారు. పరిస్థితి గమనించిన రైలు డ్రైవర్(అసిస్టెంట్ లోకో పైలట్) సీహెచ్వీపీ ఫణిబా బు.. రైలు ఇంజన్లోంచి ఆ కోచ్కు వెళ్లి ఐసోలేషన్ కాక్ను లాక్ చేయడానికి సిద్ధపడ్డారు. బోగీ హ్యాండిల్స్, ఫుట్బోర్డు మెట్లను హత్తుకుని కిందకు వేలాడారు. ఏమాత్రం చేయి జారినా నదిలో పడిపోవడం ఖాయమని తెలిసినా.. భయప డలేదు. రైళ్లు ఆగిపోయి వేలాది ప్రయాణికులకు అసౌకర్యం కలగరాదన్న భావనతో తన విధి కాకున్నా ధైర్యం చేశారు. 15 నిమిషాల్లో ఐసోలేషన్ కాక్ను లాక్చేసి వ్యాక్యూమ్ను నిరోధించారు. దీంతో 9.05 గంటలకు జీటీ ఎక్స్ప్రెస్ ప్రయాణాన్ని ఆరంభించింది. తర్వాత వచ్చే సూపర్ఫాస్ట్ రైళ్లకు ఎలాంటి అవరోధం లేకుండా చేయగలిగారు. ఫణిబాబు సాహసం తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం శివేంద్రమోహన్, సీనియర్ డీసీఈ కొండా శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. ‘డీఆర్ఎం స్పాట్ అవార్డు’ను బుధవారం ప్రకటించారు. -
రైల్వేలో ఉద్యోగాల జాతర
న్యూఢిల్లీ: రైల్వేల్లో అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్పీ), టెక్నీషియన్స్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకూ ఉన్న 26,502 ఖాళీలను 60 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై రైల్వేశాఖ మంత్రి గోయల్ మాట్లాడుతూ.. యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతోనే తాజా పెంపు చేపట్టినట్లు తెలిపారు. ఏఎల్పీ, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఈ నెల 9న తొలిదశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేందుకు అనుమతిస్తారు. ఆగస్టు 9న నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయన్నారు. పరీక్ష రాసేందుకు జనరల్ అభ్యర్థులకు గంట, దివ్యాంగులకు మరో 20 నిమిషాలు అదనంగా కేటాయిస్తామన్నారు. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు ట్రావెల్ అథారిటీ కూడా తీసుకోవాలని సూచించారు. -
9న రైల్వే లోకోపైలట్, టెక్నీషియన్ పరీక్ష
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 26,502 అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ పోస్టులకు ఆగస్టు 9న మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. ఈ పరీక్షకు నాలుగురోజుల ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చంది. సాధారణ అభ్యర్థులకు 60 నిమిషాలు, దివ్యాంగులకు అదనంగా 20 నిమిషాల సమయాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: అసిస్టెంట్ లోకోపైలట్ పరీక్షల్లో నాన్ టెక్నికల్ విభాగం
అసిస్టెంట్ లోకోపైలట్ పరీక్షల్లో నాన్ టెక్నికల్ విభాగంలో ఏయే అంశాలు ఉంటాయి? ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? రిఫరెన్స బుక్స్ను సూచించండి? - బి.రాజేంద్ర కుమార్, ఖైరతాబాద్ అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్స ఉద్యోగాల పరీక్షల్లో టెక్నికల్ విభాగాల (మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ)తోపాటు నాన్ టెక్నికల్ విభాగాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. నాన్ టెక్నికల్ విభాగంలో భాగంగా జనరల్ అవేర్నెస్ (25 మార్కులు), అర్థమెటిక్ (20 మార్కులు), రీజనింగ్ (10 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స (5 మార్కులు), జనరల్ సైన్స (30 మార్కులు)ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ అన్ని అంశాల నుంచి 90 ప్రశ్నల వరకు వస్తాయి. జనరల్ అవేర్నెస్లో భాగంగా కరెంట్ అఫైర్స, వ్యక్తులు-నియామకాలు-అవార్డులు, క్రీడలు, భారత స్వాతంత్య్రోద్యమం మొదలైన అంశాలను బాగా చదవాలి. అర్థమెటిక్లో భాగంగా సంఖ్యలు, గసాభా, కసాగు, సమీకరణాలు, వయస్సు, నిష్పత్తి, అనుపాతం, భాగస్వామ్యం, శాతాలు, లాభ-నష్టాలు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యం, ఘనపరిమాణాలు వంటివాటిపై ప్రశ్నలడుగుతారు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి మ్యాథ్స పాఠ్యపుస్తకాలను సాధన చేస్తే ఈ విభాగంలో అధిక మార్కులు సాధించొచ్చు. రీజనింగ్లో భాగంగా కేలండర్స్, క్లాక్స్, కోడింగ్-డీకోడింగ్, అనాలజీ, ఆల్ఫాబెట్ లెటర్ సిరీస్, డెరైక్షన్స్, రక్త సంబంధాలు, సిరీస్, ఎనలిటికల్ రీజనింగ్, లాజికల్ వెన్ చిత్రాలు, వెర్బల్ - నాన్ వెర్బల్ రీజనింగ్ వంటివాటిపై ప్రశ్నలు ఇస్తారు. జనరల్ సైన్సలో భాగంగా మానవుడు-రక్తవర్గాలు, మానవుడు - వివిధ వ్యాధులు, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, పరిశోధనలు - బహుమతులు, కాంతి మొదలైనవాటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రిఫరెన్స బుక్స్ 1. అర్థమెటిక్: ఆర్.ఎస్. అగర్వాల్, గులాటి 2. రీజనింగ్: ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్ - నాన్ వెర్బల్) 3. ఆరు నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స, సైన్స పాఠ్యపుస్తకాలు మాదిరి ప్రశ్నలు: 1. అ, ఆ లు ఇరువురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే, అ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 1) 30 రోజులు 2) 25 రోజులు 3) 20 రోజులు 4) 18 రోజులు సమాధానం: 1 2. ఒక సమబాహు త్రిభుజం భుజం 12 సెం.మీ. అయితే దాని వైశాల్యం ఎంత? 1) 72cm2 2) 36Ö3 cm2 3) 72Ö2 cm 2 4) 72Ö3 cm2 సమాధానం: 2 3. ఒక పరిభాషలో POWDERను ONVCDQ గా రాశారు. BELONG ను అదే పరిభాషలో ఏ విధంగా రాస్తారు? 1) ADKNMF 2) CFMPOH 3) AFKPNH 4) CDMNOF సమాధానం: 1 నేను 2014 సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాను. గతేడాది సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2 ఎలా వచ్చిందో విశ్లేషణ ఇవ్వండి? -పి.స్వాతి, దిల్సుఖ్నగర్ గతేడాది మే 26న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 21,600 మందికిపైగా ఈ పరీక్షకు హాజరయ్యారు. పేపర్-2(ఆప్టిట్యూడ్ టెస్ట్) విషయానికి వస్తే.. మొత్తం 80 ప్రశ్నలు, 200 మార్కులకు అడిగారు. రీడింగ్ కాంప్రహెన్షన్ పరిధిని తగ్గించారు. బేసిక్ న్యూమరసీ విభాగం నుంచి ప్రశ్నలు పెంచారు. మూడు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేరాగ్రాఫ్లు అడిగారు. వీటికింద 8 ప్రశ్నలు వచ్చాయి. ఒకసారి క్షుణ్నంగా చదివితే చాలు సమాధానాలు గుర్తించగలిగేలా ఈ ప్రశ్నలు ఉన్నాయి. డె సిషన్ మేకింగ్ విభాగం నుంచి ఆరు ప్రశ్నలు వచ్చాయి. 2012లో ఈ విభాగం నుంచి 7 ప్రశ్నలు వచ్చాయి. 2012లో నాన్ వెర్బల్ రీజనింగ్పై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. 2013లో ఈ విభాగం నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. గతేడాది రీడింగ్ కాంప్రహెన్షన్పై 23 ప్రశ్నలు ఇచ్చారు. 2012లో ఈ విభాగం నుంచి 30కిపైగా ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా చూస్తే గతేడాది పేపర్-2లో రీడింగ్ కాంప్రహెన్షన్ పరిధిని తగ్గించి బేసిక్ న్యూమరసీ విభాగం ప్రశ్నలు పెంచారు. ఇన్పుట్స్: బండ రవిపాల్రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ ఇన్పుట్స్: బి.ఉపేంద్ర, డెరైక్టర్, క్యాంపస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement