-
ఏటీఎం చోరికి యత్నించిన దుండగులు
సాక్షి, హైదరాబాద్ : నాచారం చౌరస్తాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎమ్ కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు చోరికి పాల్పడుతుండగా మిషన్ లో ఉన్న సెన్సార్ ఆధారంగా చోరీ జరుగుతుందని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే దొంగలు అక్కడినుంచి పరారయ్యారు. ఏటీఎమ్ లో ఉన్న డబ్బును దొంగిలించడానికి దుండగులు నానా విధాలుగా ప్రయత్నం చేశారు. చోరీ చేసే యత్నంలో ఏటీఎమ్ మిషన్ను పూర్తిగా ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. -
కరెన్సీ వాన కురిపించిన ఏటీఎం
షాంఘై : ఆకాశం నుంచి బంగారం, వజ్రాలు, ప్లాటీనం లాంటి విలువైన వస్తువుల జారీ విమానం రన్వే మీద పడడం ఈ మధ్యే చూశాం కదా. ఆ దృశ్యం మరవకముందే చైనాలో మరో విస్తుగొల్పే సంఘటన చోటు చేసుకుంది. చైనాలోని ఒక ఏటీఎం నుంచి నోట్లు ప్రవాహంలా బయటకు వస్తున్నాయి. ఆశ్చర్యం గొల్పే ఈ సంఘటన ఈ నెల 6న చైనాలోని నింగ్బో పట్టణంలో చోటుచేసుకుంది. జరిగిన ఈ సంఘటన అంతా ఏటీఎం బూత్ సర్వేలైన్ సీసీ టీవీ కెమరాలో రికార్డైంది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ రెండు సెకన్లపాటు ఏటీఎం నుంచి వందలాది నోట్లు బయటకు వచ్చాయి. వీటి విలువ సుమారు 3వేల యువాన్లు (500 వందల అమెరికన్ డాలర్లు). ఏటీఎం మిషన్లో ఓ చిన్న సమస్య తలెత్తడంతో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. ఆ సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఓ జంట ఈ జాక్పాట్ను కొట్టేశారు. నేలపై పడివున్న నోట్లను గమనించి, వాటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డయితే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశ్యంతో, వారు ఎక్కడ కూడా తల పైకెత్తలేదు. అందువల్ల సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు సరిగా రికార్డవ్వలేదు. అయితే వారి దగ్గర్నుంచి నగదును వెనక్కి రప్పించడం కోసం, ఆ ఇద్దరిన్నీ ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. -
రూ.5.40 లక్షలతో ఏటీఎంనే ఎత్తుకెళ్లారు
జమ్ముకశ్మీర్: సాధారణంగా ఏటీఎంను పగులగొట్టి అందులోని నగదును దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటారు దొంగలు. కానీ ఇక్కడ ఏకంగా నగదుతో ఉన్న ఆ యంత్రాన్నే ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన శ్రీనగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పాంపోర్కు 16 కి.మీ. దూరంలోని కాదల్బల్ ప్రాంతంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆ ఏటీఎంలో సుమారు రూ.5,40,200 నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. కేసునమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement