-
ప్రొఫెసర్ దురుసు ప్రవర్తన
విశాఖపట్నం: తనకు సంబంధించిన బిల్లు తయారు చేయలేదనే కారణంతో ఓ ప్రొఫెసర్... నాన్ టీచింగ్ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో నాన్ టీచింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని ఆంధ్రా యునివర్శిటీ (ఏయూ) దూర విద్యా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...యూనివర్శిటీలో పని చేస్తున్న ప్రొ.రాజకుమార్ వ్యక్తిగత బిల్లు తయారు చేయాలని నాన్ టీచింగ్ ఉద్యోగి నర్సింహరావును కోరారు. బిల్లు తయారు చేయడంలో నర్సింహరావు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ విషయంపై మంగళవారం నర్సింహరావును ప్రొ.రాజకుమార్ నిలదీశారు. అయితే అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ప్రొ.రాజ్కుమార్... నర్సింహరావు పట్ల దురుసుగా ప్రవర్తించి, కొట్టినంత పని చేశారు. దీంతో ఆగ్రహించిన నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలిసి యూనివర్శిటీ టీచింగ్ స్టాఫ్ కూడా ఆందోళనకు దిగారు. దీంతో ఓ వర్గంపై మరో వర్గం వారు పోటాపోటీగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దూర విద్యాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ప్రొ. రాజ్కుమార్ వెంటనే సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం. -
ఏయూ దూరవిద్య నేటి పరీక్ష వాయిదా
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), న్యూస్లైన్ : ఏయూ దూరవిద్యా కేంద్రం శుక్రవారం నిర్వహించాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షలు వాయిదా వేసినట్టు కేంద్రం సంచాలకుడు ఆచార్య ఎల్డీ సుధాకర్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగే మొదటి సంవత్సరం, మధ్యాహ్నం జరిగే మూడో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష కారణంగా ఈ పరీక్షను వాయిదా వేసినట్టు ఆయన వివరించారు. ఈ పరీక్షను జూన్ ఒకటో తేదీ ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఆ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మిగిలిన పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రం మార్పు బీఎస్సీ విభాగంలో కాకినాడ పి.ఆర్.ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేసుకున్నవారు ఎంఎస్ఎన్ కళాశాలో పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. విద్యార్థులు మారిన పరీక్షా కేంద్రాల నుంచి తమ హాల్ టికెట్లు పొంది పరీక్షకు హాజరుకావాలని సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement