-
పరిశీలన పేరిట హైడ్రామా
సాక్షి, విశాఖపట్నం: ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల భద్రతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను తీసుకెళ్లారు. సీల్ వేసిన మూడు నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్లను చూపించారు. ‘‘ఈవీఎం ఆ..భయం’’అనే శీర్షికన భద్రత డొల్లతనంపై ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ఎన్నికల కమిషన్ కూడా తీవ్రంగాస్పందించింది. భద్రత విషయంలో తీసుకుంటు న్న చర్యలపై ఈసీ కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆరా తీసినట్టుగా తెలియవచ్చింది. రౌండ్ ది క్లాక్ భద్రతను పర్యవేక్షించేందుకు తహసీల్దార్లను బదులు డిప్యూటీ తహసీల్దార్లను నియమించడంపై కూడా వివరణ కోరినట్టు సమాచారం. కాగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో స్ట్రాంగ్ రూమ్లను జేసీ–2 వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.గున్నయ్యల నేతృత్వంలో ఆదివారం సాయంత్రం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలనకు తీసుకెళ్లారు. కానీ అక్కడ విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్, సివిల్ పోలీసులు స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు అనుమతించలేదు. స్ట్రాంగ్రూమ్లో భద్రత విషయంలో పలు అపోహలు తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఆదేశించారని, పరిశీలనకు అనుమతించాలని కోరారు. తమ పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. లోపలకు అనుమతించే ప్రసక్తే లేదని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్, సివిల్ పోలీస్ అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు రెండు గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక అనుమతులు రావన్న భావనతో చాలా మంది మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు వెనుదిరిగి వెళ్లిపోయారు కూడా. చివరకు ఉన్నతాధికారుల ద్వారా ఆదేశాలు వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు భద్రతా బలగాలు అనుమతిచ్చాయి. సీల్ వేసిన నర్సీపట్నం, యలమంచలి, అనకాపల్లి నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్లను చూపించి.. మిగిలిన నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లపై సీసీ కెమెరాల ద్వారా ఏ విధంగా పర్యవేక్షిస్తున్నదీ జేసీ–2, డీఆర్వోలు వివరించారు. చివరగా ఈవీఎంల భద్రత విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులే ప్రకటించారు. కానీ ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా తహసీల్దార్ల స్థానంలో డీటీల నియామకంపై మాత్రం పెదవి విప్ప లేదు. స్ట్రాంగ్రూమ్లను పరిశీలించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, సీపీఐ నగర కార్యదర్శి డి.లోకనా«థం, టీడీపీ, బీజేపీ నాయకులు పళ్ల రమణ, విజయానందరెడ్డి, డీవైఎఫ్ఐ నాయకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పటిష్టమైన భద్రత కల్పించాం సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించినట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.గున్నయ్య తెలిపారు. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది రౌండ్ ది క్లాక్ భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు. భద్రత విషయంలో అనుమానాలున్నాయి... వైఎస్సార్సీపీ నేతలు పక్కి, తుళ్లిఎన్నికల కౌంటింగ్ వరకు భద్రతా ఏర్పాట్లపై పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ అన్నారు. ఈవీఎంలు ఉన్న బాక్స్లు ఆరు బయట ఉండడంపై ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించిన జిల్లా ఎన్నికల అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల్సింది పోయి.. అన్ని సర్దుకున్న తర్వాత సాయంత్రం రాజకీయపార్టీలు, మీడియా ప్రతినిధులను పిలి పించి పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్టుగా చూపిం చడం సరికాదన్నారు. అధికారుల తీరును సమర్ధించడం లేదని, ఖండిస్తున్నామని చెప్పుకొచ్చా రు. భద్రత విషయంలో తమకు కూడా పలు అనుమానాలున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల అధికారులు అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించా ల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ నగర కార్యదర్శి లోకనాథం అన్నారు. రౌండ్ ది క్లాక్ భద్రతను జిల్లా అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
ఇదీ వుడా దారి!
మంత్రి కుమారుని రిసెప్షన్ కోసం ఏయూలో రోడ్డు నిర్మాణం కి.మీ మరమ్మతులకు రూ. 1.6 కోట్లు ఖర్చు ఆ మొత్తం ‘ఫ్లీట్’ లెక్కల్లో జమ మంత్రుల అనుచరులకే కాంట్రాక్ట్ హడావుడిగా పనులు, నాణ్యతాలోపం విశాఖపట్నం సిటీ: ఇద్దరు మంత్రుల మెప్పు కోసం వుడా అధికారులు నిబంధనలకు పాతరేశారు. తమ కు ఎలాంటి సంబంధం లేని నగరంలో ఏ కంగా రోడ్డు నిర్మించేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించాల్సిన వుడా అధికారులు మంత్రుల ప్రాపకం కోసం ప్రజాధనాన్ని రోడ్డు పాల్జేశారు. ఆ రోడ్డు నిర్మాణమైనా నాణ్యతతో కూడికున్నదా అంటే అదీ లేదు. టెండర్లు పిలిచిన దగ్గర్నుంచీ మంత్రుల కనుసన్నల్లోని వ్యక్తులకే ఆ పనులను కట్టబెట్టి హడావుడిగా పని కానిచ్చేశారు. ఏ మాత్రం నాణ్యత లేకుండా గతంలో ఉన్న రోడ్డుపైనే ఓ రెండు అంగుళాలు పెంచి తూతూమంత్రంగా అయ్యిందనిపించారు. రాత్రీ పగలూ తేడా లేకుండా రోడ్డు, కల్వర్టులు, మార్జిన్లు నిర్మిస్తున్నారు. ఒక పక్క కల్వర్టులు నిర్మిస్తుంటే మరో పక్క సున్నాలు వేసుకుంటూ పని అయ్యిందనిపించేస్తున్నారు. ఇంత అర్జంటుగా పని చేసేస్తున్నారేంటా అని ఆరా తీస్తే ఈ నెల 4వ తేదీన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ మైదానంలో ఇద్దరు రాష్ట్ర మంత్రుల పిల్లల వివాహ రిసెప్షన్ ఉంది. దీని కోసం ఇంత ఆదరబాదరాగా చేస్తున్నామని అధికారులు సెలవిస్తున్నారు. ఏయూ పరిధిలో వుడా రోడ్డా! నగరంలోని మద్దిలపాలెం జంక్షన్ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లే ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రోడ్డులో నాలుగు రోజుల క్రితం రోడ్డు నిర్మించారు. రూ. 1.6 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రెండేళ్ల కిందట ఇక్కడే నిర్వహించిన జిల్లా మంత్రి కుమార్తె వివాహం కోసం కూడా అప్పట్లో జీవీఎంసీ చేత రోడ్డు నిర్మించేసినట్టుగానే ఈ సారి వుడాతో ఈ పని చేయించారు. ఎలాగూ వచ్చే రెండు మాసాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉన్నందున ఆ లెక్కల్లో ఈ లెక్కనూ జత చేసేయమంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన సలహాకు వుడా అధికారులు సై అన్నారు. మంత్రులు తలచుకుంటే కాదనేది ఉంటుందా అంటూ ప్రతిపాదనలు సిద్ధమైన రెండు వారాల్లోనే అన్ని పనులు కానిచ్చేశారు. వాస్తవానికి ఈ రోడ్డు ఆంధ్రా యూనివర్సిటీది. ఏయూ అధికారులు సమావేశమై ఈ రోడును తాము నిర్మించుకోలేమని జీవీఎంసీకి లేఖ రాస్తే అందుకు జీవీఎంసీ రోడ్డు నిర్మించాల్సి ఉంది. కానీ వుడా రంగ ప్రవేశం చేసి కేవలం ఒక కిలోమీటర్ రోడ్డును వేయడానికి రూ. 1.6 కోట్లు వెచ్చించడం వెనుక మతలబు ఏంటో వారికే తెలియాలి. అక్రమాలకు తెరతీసిన అధికారులు వుడాను సమూలంగా మార్పు చేసేశామని ప్రకటినలిస్తున్న అధికారులే ప్రస్తుత అక్రమ దందాలకు తావిస్తున్నారనే అరోపణలున్నాయి. కేవలం రోడ్డు పని పేరిట ఆ కాలేజీ మైదానంలో చేపట్టే అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలని కాంట్రాక్టర్కు అప్పగించినట్టు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులకు సంబంధించిన రిసెప్షన్ కావడంతో ఆర్భాటంగా కనిపించేలా ఇంజనీరింగ్ కాలేజీ మైదానాన్ని తీర్చిదిద్దే బాధ్యతను లోపాయికారిగా కాంట్రాక్టర్కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇతరులకు ఈ కాంట్రాక్టు ఇస్తే బయటకు పొక్కుతుందని గ్రహించిన వుడా అధికారులు మంత్రులు సూచించిన వ్యక్తులకే ఈ కాంట్రాక్టును అప్పగించి వారి సేవలో తరిస్తున్నారని అధికార పార్టీ నేతలే అంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement