-
వీడని వివక్ష.. తప్పని కష్టం
ద్వారకాతిరుమల: ఆడపిల్లను కన్నందుకు అత్తింటి వివక్షతతో బతుకీడుస్తున్న గురజాల పద్మ కథ మళ్లీ మొదటికొచ్చింది. అత్తింటి ఆదరణ నోచుకోక పలుమార్లు తిరస్కారానికి గురై బిడ్డతో సహా రోడ్డున పడ్డ పద్మ మరోసారి అత్తింటి నుంచి గెంటివేయబడింది. శనివారం ఉదయం పద్మను ఆమె అత్త ఆదిలక్ష్మి కొట్టి, బిడ్డతో సహా ఇంటి నుంచి నెట్టేసింది. విషయం తెలి సిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గోపాలపురం ని యోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు తదితరులు బాధితురాలు పద్మకు వెన్నుదన్నుగా నిలిచారు. పద్మ ఉంటున్న మలసానికుంట గ్రామంలో ఆమె అత్తింటికి వెళ్లి అత్త ఆదిలక్ష్మికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి పద్మను, ఆమె బిడ్డను ఇంటిలోకి పంపిం చారు. అనంతరం బాధితురాలు పద్మ వైఎస్సార్ సీపీ నేతల అండతో ద్వారకాతిరుమల పోలీస్టేషన్కు చేరుకుని అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. నచ్చజెప్పినా వినలేదు వైఎస్సార్ సీపీ నేతలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తలారి వెంకట్రావు, పార్టీ మండల కన్వీ నర్ ప్రతాపనేని వాసు, నేతలు బుసనబోయిన సత్యనారాయణ, సర్పంచ్ బత్తు ల విజయ్శేఖర్, అఖిలభారత యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు సాయిల స్వాతి, జిల్లా యాదవ సంఘ ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పద్మ అత్త ఆదిలక్ష్మితో మాట్లాడారు. అయినా ఆదిలక్ష్మి వినకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచారు. వెంటనే చర్యలు తీసుకోవాలి పసిబిడ్డతో సహా పద్మను చిత్రహింసలకు గురిచేస్తున్న అత్తమామలు, పట్టించుకోని భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తలారి వెంకట్రావు డిమాం డ్ చేశారు. తమ పార్టీ తరఫున పద్మకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. చంటి బిడ్డతో ఒంటరిగా ఇంట్లో ఉంటున్న తనను అత్తింటి వారు తన్ని తరిమేస్తున్నారని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త, అత్తమామలు తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతోంది. కేసులు పెడితే ఎలా ఉండనిస్తాం కేసులు పెట్టిన అమ్మాయి మా ఇంట్లో ఉండటానికి కుదరదని పద్మ అత్త ఆదిలక్ష్మి అంటోంది. తమను ఇష్టానుసారంగా తిడుతూ, మీ అంతు చూస్తానని బెదిరి స్తోందని ఆదిలక్ష్మి ఆరోపించింది. పెట్టిన కేసులు తేలకుండా ఇంట్లో ఎలా ఉం టుందని ఆదిలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అత్త వేధింపులు తాళలేక..తోడికోడళ్ల ఆత్మహత్య
గన్నవరం(కృష్ణా): కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో అత్తింట్లో వేధింపులు భరించలేక ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలివీ...గ్రామంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన నక్కా భూలక్ష్మి కుమారులు రాంబాబు, శివ. వ్యవసాయ పనులు చేసుకునే వీరిద్దరికీ గ్రామానికే చెందిన రమణమ్మ(20), ఝాన్సీరాణి(19)లతో ఏడు నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం గర్భవతులైన కోడళ్లిద్దరినీ అత్త భూలక్ష్మి కొన్ని రోజులుగా తీవ్రంగా వేధిస్తోంది. వీటిని తట్టుకోలేక యువతులిద్దరూ కుటుంబసభ్యులకు మొరపెట్టుకున్నారు. రెండు రోజుల క్రితమే పెద్దలు కలుగజేసుకుని..వారిని ఇబ్బంది పెట్టవద్దని భూలక్ష్మికి చెప్పారు. అయితే, బుధవారం భర్తలు, అత్త పొలం పనులకు వెళ్లిన సమయంలో రమణమ్మ, ఝాన్సీరాణి ఇంట్లోనే చీరతో ఉరి వేసుకున్నారు. మధ్యాహ్నం భర్తలు వచ్చి చూసేసరికి విగత జీవులై కనిపించారు. కాగా, వారిని అత్తింటి వారే చంపారని మృతుల పుట్టింటి వారు వాదిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పూజలు
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024
నిండు వేసవిలో..
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
అకాలవర్షం.. అమ్ముకోకుండా చేస్తోంది
ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది..
అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక పూజలు
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
అలర్ట్గా ఉన్నాం..
ఆరోగ్యశ్రీతో ఆసుపత్రి మరింత అభివృద్ధి
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement