-
వికెట్లు... టపటపా
డేనైట్ టెస్టులో రెండో రోజు 13 వికెట్లు ఓవరాల్గా 94 పరుగుల ఆధిక్యంలో కివీస్ అడిలైడ్: తొలిసారి ప్రయోగాత్మకంగా ఆడుతున్న డేనైట్ టెస్టులో పింక్ బంతితో బౌలర్లు పండగ చేసుకుంటున్నారు. తొలిరోజు 12 వికెట్లు పడితే... రెండో రోజు శనివారం ఏకంగా 13 వికెట్లు నేలకూలాయి. తొలిరోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకు ఆలౌట్ కాగా... రెండో రోజు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (53), నెవిల్ (66) అర్ధ సెంచరీలు చేయగా... మిగిలిన బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. అయితే చివరి ఇద్దరు ఆటగాళ్లు లియోన్ (34), స్టార్క్ (24 నాటౌట్) రాణించడంతో ఆసీస్కు కీలకమైన 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో బ్రేస్వెల్ మూడు, బౌల్ట్, క్రెయిగ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో ఐదు వికెట్లకు 116 పరుగులు చేసింది. రాస్ టేలర్ (32) రాణించాడు. శాంట్నర్ (13), వాట్లింగ్ (7) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్వుడ్ మూడు, మిషెల్ మార్ష్ రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లోటును మినహాయిస్తే ప్రస్తుతం న్యూజిలాండ్ 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఈ మ్యాచ్ మూడోరోజు ఆదివారం ముగిసే అవకాశం ఉంది. అదే ఉత్సాహం ఇక ప్రేక్షకులు ఈ మ్యాచ్కు రెండో రోజు కూడా భారీగా వచ్చారు. 42,372 మంది అభిమానులు లైట్ల వెలుతురులో పింక్ బంతితో టెస్టు క్రికెట్ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందారు. -
కలర్ఫుల్ ఆరంభం
అడిలైడ్: భారీ షాట్లతో విరుచుకుపడే వన్డేలు, ధనాధన్ టి20లతో పోల్చితే టెస్టు మ్యాచ్లు బోర్.. ఇదీ ఇప్పటిదాకా సగటు అభిమాని ఆలోచన. అయితే ఈ ఫార్మాట్కు కూడా ఆదరణ పెంచే ఉద్దేశంతో తొలిసారిగా టెస్టు మ్యాచ్ కూడా ‘కలర్ఫుల్’గా ఆరంభమైంది. ఎరుపు బంతి స్థానంలో గులాబీ బంతి వాడగా సంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం ఆరంభమై రాత్రి కూడా కొనసాగిన డే అండ్ నైట్ మ్యాచ్ను వీక్షించిన ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 138 ఏళ్ల టెస్టు చరిత్రలో మొదటి సారిగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో తొలి రోజు ఆటను 47,441 మంది ప్రత్యక్షంగా వీక్షించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడే ఓ అభిప్రాయానికి రావడం తొందరపాటే అయినా ఈ ప్రయోగానికి అభిమానుల నుంచి ఆశించిన మద్దతు లభించిందనే చెప్పవచ్చు. బౌలర్ల హవా గులాబీ బంతితో బౌలర్లు పండుగ చేసుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు తొలి రోజే 12 వికెట్లు నేలకూలాయి. ముందుగా ఆసీస్ పేసర్లు మిషెల్ స్టార్క్ (3/24), హాజెల్వుడ్ (3/66), సిడిల్ (2/54)తో పాటు స్పిన్నర్ లియోన్ (2/42) కూడా ప్రభావం చూపడంతో కివీస్ 65.2 ఓవర్లలో 202 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌటయింది. ఓపెనర్ లాథమ్ (103 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఒక్కడే రాణించగలిగాడు. నాలుగో ఓవర్లోనే వికెట్ తీసిన హాజెల్వుడ్ పింక్ బంతితో తొలిసారిగా ఈ ఫీట్ సాధించిన బౌలర్గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో రెండు వికెట్లకు 54 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (48 బంతుల్లో 24 బ్యాటింగ్; 3 ఫోర్లు), వోజెస్ (9 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం సరికాదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement