-
నిలవాలంటే గెలవాలి !
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, రెండు వన్డే మ్యాచ్లు ఆడింది. కానీ ఒక్క విజయం కూడా రుచి చూడ లేదు. ముందున్నది ప్రపంచకప్ కాలం. అందుకు సన్నాహకంగా సాగుతున్న టోర్నీలో కొత్త లోపాలు బయట పడ్డాయి. ఇక మిగిలింది రెండు మ్యాచ్లే. కాంబి నేషన్లు, బ్యాటింగ్ ఆర్డర్లు అన్నీ ఇక్కడే తేలిపోవాలి. వాటితో పాటు ముక్కోణపు టోర్నీలో ఇప్పుడు జట్టుకు ఒక్క విజయం కూడా కావాలి. సిడ్నీ: భారత రిపబ్లిక్ డే, ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం రోజున ఇరు జట్లు క్రికెట్ మైదానంలో బరిలోకి దిగుతున్నాయి. ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా సోమవారం జరిగే ఐదో లీగ్ మ్యాచ్లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఆసీస్తో గెలిస్తే ఇంగ్లండ్పై సాధారణ విజయం చాలు. ఇక్కడ ఓడినా స్వల్ప అవకాశాలు ఉంటాయి. అయితే చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ను భారీ తేడాతో ఓడించడం, రన్రేట్ కాపాడుకోవడంవంటి చాలా అంశాలు ముడిపడి ఉం టాయి. కాబట్టి నేటి మ్యాచ్లో విజయం కోసం ధోని సేన సర్వ శక్తులు ఒడ్డాల్సి ఉంది. బరిలోకి ఇషాంత్ ఆసీస్పై తొలి మ్యాచ్లో పోరాట పటిమ కనబర్చిన భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో మాత్రం ఘోరంగా ఓటమిపాలైంది. అప్పటి వరకు బౌలింగే సమస్య అనుకుంటే, గత మ్యాచ్లో భారత బ్యాటింగ్ మరీ బలహీనంగా కనిపించింది. ఈ మ్యాచ్లో టీమిండియా తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలి. రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో వరుసగా విఫలమవుతున్నా... ధావన్కు తుది జట్టులో చోటు ఖాయం. భారత బ్యాటింగ్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కోహ్లి ఏ స్థానంలో ఆడతాడనేది మాత్రం ఆసక్తికరం. రవీంద్ర జడేజా కొంత వరకు కోలుకున్నా, అతని మ్యాచ్ ఫిట్నెస్పై సందేహాలు ఉన్నాయి. కాబట్టి వరుసగా రెండు మ్యాచ్లలో డకౌట్ అయినా అక్షర్ పటేల్కు మరో అవకాశం దక్కవచ్చు. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన ఇషాంత్ శర్మ ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ఖాయమైంది. పేసర్లు ఉమేశ్, షమీలలో ఒకరిని తప్పించి అతనికి అవకాశం కల్పిస్తారు. పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండటంతో రెండో స్పిన్నర్గా అశ్విన్ను ఎంపిక చేసి... గత మ్యాచ్లో జట్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన స్టువర్ట్ బిన్నీని పక్కన పెడతారా చూడాలి. కెప్టెన్గా బెయిలీ మరోవైపు ఇప్పటికే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. అయినా సరే ఈ మ్యాచ్లో ఉదాసీనత ప్రదర్శించవద్దని జట్టు భావిస్తోంది. ఆ జట్టు కూడా ప్రపంచ కప్కు ముందు వేర్వేరు కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. జార్జ్ బెయిలీ మరోసారి కెప్టెన్గా బరిలోకి దిగుతున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా బ్యాటింగ్లో విఫలమవుతున్న అతను ఈ మ్యాచ్లోనైనా రాణించాల్సి ఉంది. వైట్ స్థానంలో అతను జట్టులోకి వస్తుండగా, షాన్ మార్ష్ స్థానంలో డేవిడ్ వార్నర్ బరిలోకి దిగుతున్నాడు. వైట్, మార్ష్ ప్రపంచ కప్ జట్టులో లేరు. బౌలింగ్ విభాగంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ డోహర్తి రావడం ఖాయమైంది. అదే విధంగా రొటేషన్ పాలసీ ప్రకారం హాజల్వుడ్, మిషెల్ మార్ష్లకు కూడా అవకాశం దక్కవచ్చు. స్టీవెన్ స్మిత్ అద్భుత ఫామ్లో ఉండటంతో పాటు వార్నర్, ఫించ్ కూడా రాణిస్తుండటం ఆసీస్ బలంగా చెప్పవచ్చు. మ్యాక్స్వెల్ కూడా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడితే ఆసీస్కు తిరుగుండదు. ఆ జట్టు రెండో స్పిన్నర్ కోటాను అతను పూర్తి చేయగలడు. జట్ల వివరాలు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, అక్షర్, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ, బిన్నీ/అశ్విన్, ఉమేశ్/షమీ. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, వార్నర్, స్మిత్, మ్యాక్స్వెల్, హాడిన్, ఫాల్క్నర్, స్టార్క్, హాజల్వుడ్, డోహర్తి, మిషెల్ మార్ష్/సంధు. ఉ. గం.8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం పరిస్థితులకు తగిన విధంగా ఉపయోగించుకోగల ఆట గాళ్లు జట్టులో ఉండటమే మాకు పెద్ద బలం. అది గతంలోనూ చూశాము. ఇకపై కూడా అలా చేయగలం. అవసరమున్న సమయంలో డోహర్తిని ఆడించగలగడం, పేస్ బౌలర్లను ఉపయోగిం చుకోగలగడం కూడా ఇందులో భాగమే. కాబట్టి 15 మంది సభ్యులకూ తగిన పాత్ర ఉంటుంది. -బెయిలీ, ఆసీస్ కెప్టెన్ ప్రయోగం అనే పదాన్ని మేం నిషేధించాం. మేం అలాంటివి ఏమీ చేయడం లేదు. మా అత్యుత్తమ 11 మంది ఆటగాళ్లనే బరిలోకి దించుతున్నాం. దీనికి ఎవరు ఎలాంటి పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. గాయాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. ప్రపంచ కప్లో రోహిత్ ఫిట్నెస్పై గురించి అప్పుడే ఆందోళన అనవసరం. -ధోని, భారత కెప్టెన్ పిచ్, వాతావరణం వికెట్ పొడిగా ఉంది. స్పిన్కు అనుకూలం. రెండో ఇన్నింగ్స్లో ఇది మరింత సహకరించే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య 13 మ్యాచ్లు జరిగాయి. ఆస్ట్రేలియా 12 మ్యాచ్ల్లో నెగ్గగా... భారత్ ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచింది. -
సంబంధాల బలోపేతానికి ‘యాక్ట్ ఈస్ట్’
ఫిజీ జనాభాలో 37 శాతం మంది భారత సంతతికి చెందినవారే. రాజీవ్గాంధీ అనంతరం 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సులో మోదీ నల్లధనం వెలికితీత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మోదీ విదేశీ పర్యటనలు మయన్మార్: భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11-20 తేదీల మధ్య మూడు దేశాల్లో పది రోజులపాటు పర్యటించారు. 40 మంది ప్రపంచ దేశాల నేతలను కలుసుకున్నారు. మొదటగా మయన్మార్ (బర్మా) వెళ్లారు. ఆ దేశ రాజధాని నేపిటాలో అధ్యక్షుడు థీన్సేన్తో సమావేశమయ్యారు. నవంబర్ 12న నేపిటాలో జరిగిన 12వ ఆసియాన్-భారత్ సదస్సులో మోదీ ప్రసంగించారు. ఇందులో ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సభ్యులైన పది దేశాల నేతలు పాల్గొన్నారు. బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స దేశాలకు ఆసియాన్లో సభ్యత్వం ఉంది. ఈ సదస్సులో మోదీ ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించారు. ఈ విధానంలో భారత్కు ఆసియాన్ దేశాలతో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవిగా మోదీ స్పష్టం చేశారు. 2015 చివరికల్లా ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నాయకులు లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ 13న నేపిటాలో నిర్వహించిన తొమ్మిదో తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్)లో భారత ప్రధాని పాల్గొన్నారు. ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు వ్యతిరేకంగా తూర్పు ఆసియా సదస్సు చేసిన ప్రకటనను మోదీ సమర్థించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సులో పది ఆగ్నేయాసియా దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా (మొత్తం 18) దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, ప్రతిపక్ష నేత ఆంగ్సాన్ సూకీతోనూ మోదీ సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా: మయన్మార్ నుంచి నరేంద్రమోదీ ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ముందుగా ఆయన బ్రిస్బేన్లో నిర్వహించిన జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు నవంబర్ 15, 16 తేదీల్లో జరిగింది. జి-20 సదస్సు అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్తో కాన్బెర్రాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అస్ట్రేలియా పార్లమెంట్లో ప్రసంగించారు. సిడ్నీలోని ఆల్ఫోన్స ఎరినాలో 20 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి నవంబర్ 17న మాట్లాడారు. ఈ సందర్భంగా జన్ధన్ యోజన పథకం గురించి వివరించారు. కేవలం పది వారాల్లోనే ఏడు కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు చెప్పారు. నవంబర్ 18న మెల్బోర్న నగరానికి వెళ్లారు. 161 ఏళ్ల చరిత్ర ఉన్న మెల్బోర్న క్రికెట్ మైదానాన్ని సందర్శించారు. మోదీ గౌరవార్థం ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన విందులో క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, వీవీఎస్.లక్ష్మణ్, అలన్ బోర్డర్ పాల్గొన్నారు. ఫిజీ: మూడు దేశాల పర్యటనలో చివరగా నవంబర్ 19న పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజీ దేశాన్ని సందర్శించారు. 33 ఏళ్ల అనంతరం భారత ప్రధాని ఫిజీలో పర్యటించడం ఇదే ప్రథమం. 1981లో ఫిజీలో పర్యటించిన చివరి భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమరామాతో సమావేశమయ్యారు. ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఫిజీ దేశంలోని చక్కెర పరిశ్రమకు భారత్ 75 మిలియన్ డాలర్ల రుణ సహాయం అందిస్తుందని ప్రకటించారు. నేపాల్లో సార్క సదస్సు: 2014 నవంబర్ 25న 18వ సార్క శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు నేపాల్ రాజధాని ఖాట్మాండు చేరుకున్నారు. సార్క సదస్సు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది. సార్కలో భారత్తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ఖాట్మండు సదస్సు సందర్భంగా మోదీ పాకిస్థాన్ మినహా మిగతా దేశాల నాయకులతో విడిగా చర్చలు జరిపారు. మాదిరి ప్రశ్నలు 1. 12వ ఆసియాన్ - భారత సదస్సు 2014 నవంబర్ 12న ఏ నగరంలో నిర్వహించారు? ఎ) సింగపూర్ బి) మనీలా సి) హనోయ్ డి) నేపిటా 2. ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సభ్యత్వం లేనిది? ఎ) లావోస్ బి) వియత్నాం సి) జపాన్ డి) మలేషియా 3. ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఎ) థాయిలాండ్ బి) ఫిలిప్పీన్స సి) ఇండోనేషియా డి) మలేషియా 4. థీన్సేన్ ఏ దేశాధ్యక్షులు? ఎ) బ్రూనై బి) కాంబోడియా సి) వియత్నాం డి) మయన్మార్ 5. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సదస్సులో ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించారు? ఎ) బ్రిక్స్ బి) ఆసియాన్- భారత్ సి) జి-20 డి) సార్క 6. 2015 నాటికి ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని ఎన్ని బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎ) 100 బి) 200 సి) 150 డి) 250 7. తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)లో ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి? ఎ) 10 బి) 18 సి) 16 డి) 20 8. భారత్కు సభ్యత్వంలేని కూటమి? ఎ) జి-20 బి) తూర్పు ఆసియా సదస్సు సి) బ్రిక్స్ డి) ఆసియాన్ 9. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంగ్సాన్ సూకీతో సమావేశమయ్యారు. ఆమె ఏ దేశ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు? ఎ) వియత్నాం బి) చైనా సి) మయన్మార్ డి) థాయిలాండ్ 10. అమెరికా ఏ కూటమిలో సభ్యదేశంగా ఉంది? ఎ) ఆసియాన్ బి) ఎస్సీవో సి) సార్క డి) తూర్పు ఆసియా సదస్సు 11. 2014 నవంబర్ 15, 16 తేదీల్లో జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సును ఎక్కడ నిర్వహించారు? ఎ) దక్షిణ కొరియా బి) కెనడా సి) మెక్సికో డి) ఆస్ట్రేలియా 12. నరేంద్ర మోదీ కంటే ముందు 28 ఏళ్ల కిందట 1986లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత ప్రధాని? ఎ) ఇందిరాగాంధీ బి) వి.పి. సింగ్ సి) రాజీవ్ గాంధీ డి) ఐ.కె. గుజ్రాల్ 13. జి-20 దేశాలు 2018 వరకు అంతర్జాతీయ ఆర్థికవృద్ధిని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి? ఎ) ఒక శాతం బి) రెండు శాతం సి) నాలుగు శాతం డి) అయిదు శాతం 14. జి-20 దేశాల సదస్సు పూర్తి కాకుండానే మధ్యలోనే నిష్ర్కమించిన నాయకుడు? ఎ) స్టీఫెన్ హార్పర్ బి) డేవిడ్ కామెరాన్ సి) షింజో అబే డి) వ్లాదిమిర్ పుతిన్ 15. జి-20లో సభ్యత్వం ఉన్న సంస్థ? ఎ) అంతర్జాతీయ ద్రవ్యనిధి బి) ప్రపంచ బ్యాంక్ సి) యూరోపియన్ యూనియన్ డి) అంతర్జాతీయ వాణిజ్య సంస్థ 16. ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంగా జి-20 ఎప్పుడు ఏర్పడింది? ఎ) 1999 బి) 2003 సి) 2008 డి) 2000 17. 2013లో 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సలు పొంది ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన దేశం? ఎ) అమెరికా బి) భారత్ సి) చైనా డి) జపాన్ 18. 2015 నవంబర్లో జి-20 సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఎ) బాలి, ఇండోనేషియా బి) రియాద్, సౌదీ అరేబియా సి) అంతల్యా, టర్కీ డి) టొరాంటో, కెనడా 19. 2016లో జి-20 శిఖరాగ్ర సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఎ) చైనా బి) భారత్ సి) అర్జెంటీనా డి) మెక్సికో 20. జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిందెవరు? ఎ) బరాక్ ఒబామా బి) డిల్మా రౌసెఫ్ సి) జాకోబ్ జుమా డి) టోనీ అబాట్ 21. ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని? ఎ) ఇందిరాగాంధీ బి) రాజీవ్ గాంధీ సి) లాల్బహదూర్ శాస్త్రి డి) నరేంద్ర మోదీ 22. ఆస్ట్రేలియాలోని ఏ నగరంలో ఆల్ఫోన్స ఎరీనాలో 20 వేలమంది ప్రవాస భారతీయులనుద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు? ఎ) బ్రిస్బేన్ బి) కెయిన్స సి) సిడ్నీ డి) అడిలైడ్ 23. భారత ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఆస్ట్రేలియా ప్రధాని ఏ నగరంలోని క్రికెట్ మైదానంలో విందునిచ్చారు? ఎ) మెల్బోర్న బి) సిడ్నీ సి) పెర్త డి) బ్రిస్బేన్ 24. బ్రిస్బేన్ నగరంలో ఏ జాతీయ నాయకుని కంచు విగ్రహాన్ని భారత ప్రధాని ఆవిష్కరించారు? ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్ బి) మహాత్మాగాంధీ సి) శ్యామప్రసాద్ ముఖర్జీ డి) బాలగంగాధర్ తిలక్ సమాధానాలు: 1) డి; 2) సి; 3) సి; 4) డి; 5) బి; 6) ఎ; 7) బి; 8) డి; 9) సి; 10) డి; 11) డి; 12) సి; 13) బి; 14) డి; 15) సి; 16) ఎ; 17) బి; 18) సి; 19) ఎ; 20) డి; 21) డి; 22) సి; 23) ఎ; 24) బి. ఎన్. విజయేందర్రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ ఉద్యోగాలు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ హైదరాబాద్లోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వేర్హౌస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల సంఖ్య: 25 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ టైప్రైటింగ్లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జనవరి 19 వెబ్సైట్: http://cewacor.nic.in/ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా(ఎస్ఓఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - టోపో ట్రెయినీ: 118 అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్). వయసు: 18 - 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, స్టీరియోస్కోపిక్ ఫ్యుజన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 21 వెబ్సైట్: www.surveyofindia.gov.in జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్ -1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల సంఖ్య: 65 విభాగాలు: ఇన్సూరెన్స్, హెచ్ఆర్, జనరల్, ఫైనాన్స్/ అకౌంట్స్, ఇంజనీరింగ్ (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏరోనాటికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), లీగల్, స్టాటిస్టిక్స్, మెడికల్. అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: జనవరి 24 వెబ్సైట్: www.gicofindia.in
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...70 ఏళ్ల వయసులోనూ గర్భధారణ
మీ ఓటు దేనికి?
డిసైడ్ చేసేది.. ఆమే!
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
KKR vs MI: కేకేఆర్తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
తప్పక చదవండి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
- డిసైడ్ చేసేది.. ఆమే!
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement