-
ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్
సరోజ్ బెన్, జరీనా, ముంతాజ్లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు... దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటర్తో 39 సంవత్సరాల సరోజ్ బెన్ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్. ‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది. ‘మీరు గవర్నమెంట్ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్. సరోజ్ బెన్ మాత్రమే కాదు గ్రాస్రూట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘మహిళా హౌజింగ్ ట్రస్ట్’ కమ్యూనిటీ మూమెంట్ ‘హెల్ప్ దిల్లీ బ్రీత్’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్ ట్రస్ట్, హెల్ప్ దిల్లీ బ్రీత్ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్ ఏక్యూఐ మానిటర్లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్’లుగా గుర్తింపు పొందారు. ఏక్యూఐ అంబాసిడర్లు హెల్ప్ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్ ట్రస్ట్ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు. ‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్. ‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్ ముంతాజ్. ఏక్యూఐ అంబాసిడర్ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్ల విజయానికి ఇది ఒక ఉదాహరణ. మార్పు మొదలైంది... జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్ లెవెల్స్ను చెక్ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇలా కూడా... వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్లు. స్కీమ్కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు. -
ఏపీలో అభివృద్ధి, సంక్షేమం.. మీడియాకు సమగ్ర సమాచారం: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, వంటి వివిధ వర్గాల ప్రజలు పొందిన ప్రయోజనాలపై ఆయా వర్గాల ప్రజలకు, మీడియాకు సమగ్ర సమాచారం ఇవ్వడం కోసం రాష్ట్రవ్యాప్తంగా తాము పర్యటించనున్నామని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమలు వంటి అంశాలపై పూర్తి సమాచారం కూడా అందచేస్తామని ఆయన వెల్లడించారు. "మళ్ళీ జగనే ఎందుకు రావాలి" అనే అంశంపై ప్రజలకు, మీడియాకు పూర్తి వివరాలు అందుబాటులోకి తెచ్చేందుకు తమ పర్యటన దోహద పడుతుందని ఆయన తెలిపారు. దీని గురించి వీలైనంత వరకు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 16 నుంచి రాయల సీమ జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు. తొలి దశలో కర్నూలు, పుట్టపర్తి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో పర్యటించి పాత్రికేయులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ఏడాది నవంబర్ 10న తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రెస్ అకాడమీ పేరును "మీడియా" అకాడమీగా మార్పు చేయాలన్న తమ సూచనను పరిగణన లోకి తీసుకుని సంస్థ పేరును " ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ" గా మార్చినందుకు సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. అన్ని వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లతోనూ సత్సంబంధాలు నిర్వహిస్తూ, అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేస్తూ గత ఏడాది కాలంలో సుమారు 100 కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించుకోగలిగామని చైర్మన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అన్నిటిలోనూ తమకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. వివిధ జర్నలిస్టుల యూనియన్లు తమ దృష్టి కి తెచ్చిన పలు సమస్యల పై సంబంధిత శాఖల అధికార్లతో ఎప్పటికప్పుడు చర్చించి తగు పరిష్కారాలు సాధించడం జరిగిందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కేర్ స్కీం అమలులో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారితో చర్చించడం జరిగిందన్నారు. ఈ సమస్యలు త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా 104 హెల్ఫ్లైన్లో ఒక ప్రత్యేక లైన్ (నెంబర్.4)ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి లిఖిత పూర్వకంగా తమకు తెలిపారని ఆయన వివరించారు. వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా 6 నెలల జర్నలిజంలో డిప్లమో కోర్సును రూపొందించి, అతి సాధారణ ఫీజుతో నాగార్జున యూనివర్సిటీ తో కలిసి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కోర్సు పూర్తయి విద్యార్థులంతా పరీక్షలు కూడా పూర్తి చేశారన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచడంలో భాగంగా ప్రతి శనివారం ప్రత్యేక అంశాలపై ప్రముఖులతో "ఆన్ లైన్ క్లాసులు" నిర్వహించడం జరిగిందన్నారు. 28 వారాల పాటు వివిధ అంశాల పై ప్రముఖ రచయితలు, ప్రొఫెసర్లు, ఉన్నత అధికారులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ పాత్రికేయులు ఆన్ లైన్ క్లాసుల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారని ఆయన వెల్లడించారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఉపయోగపడే అంశాలైన, పర్యావరణం, వృత్తి నైపుణ్యం, ఒత్తిడిని అధిగమించడంపై జిల్లాల్లో శిక్షణా తరగతులు, సెమినార్లు నిర్వహించడం జరిగిందన్నారు. జర్నలిస్టులుగా పనిచేసి రిటైర్ అయి కాలం గడుపుతున్న సీనియర్ జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం తరపున వారిని సన్మానిస్తూ వారిని గౌరవించడం జరుగుతోందని ఆయన వివరించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ద్వారా జర్నలిస్టు మిత్రులు రచించిన పుస్తకాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు సరఫరా చేసే ఉత్తర్వులు వెలువడేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వివిధ జిల్లాల్లో తాము పర్యటించిన సందర్భాల్లో జర్నలిస్టు యూనియన్లు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు కోరుతూ ఇచ్చిన విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందించామని, ఆయా అంశాల పై ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించడం జర్నలిస్టులందరికీ మేలు చేస్తుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. చదవండి: ఈనాడు కథనంపై ఏపీ గనుల శాఖ ఆగ్రహం -
ఫ్లాష్ లూటీ...
ఫిలడెల్ఫీయా: నిత్యం నిఘా నీడన ఉండే అమెరికాలో దొంగల ముఠా పేట్రేగిపోయింది. చూడ్డానికి.. షాపింగ్మాల్స్లో ఫ్లాష్మాబ్ పేరిట డ్యాన్స్లు, అవగాహన కార్యక్రమాలు చేసే బృందంలా కనిపిస్తూ ఒక్కసారిగా దుకాణాలపై తెగబడి అందిన కాడికి దోచేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫీయా నగరం ఈ చోరీల ఘటనకు వేదికైంది. ఒక్కటి కాదు చాలా స్టోర్స్లో టీనేజర్లు ఇలా ఒకే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మంగళవారం రోజు జరిగిన ఈ చోరీల తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్లుసహా యాపిల్ కంపెనీకి చెందిన పలు ఎల్రక్టానిక్ ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మాస్్కలు, హూడీలు ధరించిన దాదాపు 100కుపైగా టీనేజర్లు యాపిల్ స్టోర్, ఫూట్లాకర్, లూలూలెమెన్ స్టోర్లలో చొరబడి బ్యాగుల నిండా వస్తువులను తీసుకెళ్లారు. విషయం తెల్సుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేíÙంచి 20 మందికిపైగా టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలనూ స్వాదీనం చేసుకున్నారు. అయితే, వస్తువును దొంగిలించినా వాడుకోలేని(యాంటీ–థెఫ్ట్) ఫీచర్ ఉన్న కొన్ని యాపిల్ సంస్థ వస్తువులను దొంగలు అక్కడే వదిలేసివెళ్లారని ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గత నెలలో డ్రైవర్ ఎడ్డీ ఐరీజెర్రీని ఫిలడెల్ఫీయా పోలీస్ అధికారి కాల్చిచంపిన కేసులో రిటెన్హౌజ్ స్క్వేర్ వద్ద శాంతియుత ర్యాలీ జరిగిన కొద్దిసేపటికే అక్కడా ఇలా రిటైల్స్టోర్పై దాడి జరిగింది. అయితే ఆ నిరసనకారులతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఫిలడెల్ఫీయా పోలీసులు స్పష్టంచేశారు. -
అవగాహనే అస్త్రంగా..!
సాక్షి, హైదరాబాద్: వరుసగా జరుగుతున్న భారీ అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అగ్ని మాపక శాఖ అప్రమత్తమైంది. బహుళ అంతస్తుల భవనాలు, చాలా ఏళ్ల క్రితం నిర్మించిన వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణపై అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రమాదం జరిగితే ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లే అవకాశాలు ఇలాంటి చోట్లలోనే ఎక్కువగా ఉండటంతో ఈ తరహా భవన సముదాయాల్లో ఉండే వారికి అవగాహన పెంచడమే లక్ష్యంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు అగ్ని మాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే ఎలా జాగ్రత్తపడాలన్న అంశాలపై ఈ శిబిరాల్లో వివరిస్తున్నట్టు వివరించారు. అలాగే అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయకూడదన్న విషయాలు కూడా వివరిస్తున్నారు. వాణిజ్య సముదాయాలతోపాటు పెట్రోల్ బంక్లు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని పాత బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల్లోని దుకాణ యజమానులకు, ఆయా దుకాణాల్లో పనిచేసే వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాజాగా స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన ప్రమాదంలో తీవ్రమైన పొగ కారణంగా లోపల చిక్కుకుపోవడం, ఆ సమయంలో ఎలా తప్పించుకోవాలో అవగాహన లేకపోవడంతోనూ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా వాణిజ్య సముదాయాల్లో పనిచేసే వారికి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవలే అన్ని జిల్లాలతోపాటు రీజియన్ల ముఖ్య అగ్ని మాపక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఫైర్స్టేషన్ అధికారులు తమ పరిధిలోని భవనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశంపై ఆడిటింగ్ చేయడంతోపాటు, ప్రమాదాల నియంత్రణకు జాగ్రత్తలు వివరించాలని ఆదేశించారు. -
ప్లాస్టిక్ నిజాలు
ప్రపంచంలో తొలిసారిగా 1907లో ప్లాస్టిక్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం మొదలైంది. అయితే, భారీ స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి 1952 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, పర్యావరణానికి బెడదగా మారింది. ఇటీవలి కాలంలో ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 80 లక్షల టన్నులు. ఇవే పరిస్థితులు కొనసాగితే, 2040 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాలు 2.90 కోట్ల టన్నులకు చేరుకోగలవని శాస్త్రవేత్తల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. 1952 నాటితో పోల్చుకుంటే, ప్లాస్టిక్ వినియోగం రెండువందల రెట్లు పెరిగింది. సముద్రంలోకి చేరే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఏటా దాదాపు లక్షకు పైగా భారీ జలచరాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ఉత్పత్తిదారు. అమెరికా ఏటా 4,2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తోంది. చైనా, యూరోపియన్ దేశాల్లో ఏటా జరిగే ప్లాస్టిక్ ఉత్పత్తి కంటే, అమెరికా చేసే ప్లాస్టిక్ ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువవ. అమెరికాలో ఏటా పోగుపడే తలసరి ప్లాస్టిక్ చెత్త 130 కిలోలు. ప్లాస్టిక్ నేలలోను, నీటిలోను ఎక్కడ పడితే అక్కడ పోగుపడి కాలుష్యానికి కారణమవుతోంది. ప్లాస్టిక్ నేరుగా మన పొట్టల్లోకే చేరేటంత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి మనిషి పొట్టలోకి వారానికి సగటున ఐదు గ్రాముల ప్లాస్టిక్ చేరుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తి కారణంగా వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2030 నాటికి బొగ్గు కంటే ప్లాస్టిక్ కారణంగానే ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రీసైకిల్డ్ ఫోమ్ ఫర్నిచర్ ఎక్స్పాండెడ్ పాలీస్టైరీన్ (ఈపీఎస్)– సాధారణ వ్యవహారంలో ఫోమ్గా పిలుచుకునే పదార్థం. దీనిని వస్తువుల ప్యాకేజింగ్ తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని ‘స్టరోఫోమ్’ సంస్థ ట్రేడ్మార్క్ పేరైన ‘డ్యూపాంట్’ పేరుతో కూడా పిలుస్తారు. ప్యాకేజీ పైనున్న ర్యాపర్లు, అట్టపెట్టెలతో పాటు దీనిని కూడా చెత్తలో పారేస్తుంటారు. దీనిని చెత్తలో పారేయకుండా, రీసైక్లింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ఫర్నిచర్ను తయారు చేయవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. జపాన్ ‘వీయ్ ప్లస్’ కంపెనీకి చెందిన నిపుణుల బృందం రీసైకిల్డ్ ఈపీఎస్ను ఉపయోగించి, సుదీర్ఘకాలం మన్నగలిగే అద్భుతమైన ఫర్నిచర్ను రూపొందించింది. ఇవి ఎక్కువకాలం మన్నడమే కాకుండా కలపతోను, లోహంతోను తయారుచేసిన ఫర్నిచర్ కంటే చాలా తేలికగా కూడా ఉంటాయి. ప్యాకేజీ అవసరాలకు ఉపయోగించే ఫోమ్ను చెత్తలో పారేసి కాలుష్యాన్ని పెంచకుండా, ఇలా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగంలోకి తేవడం భలేగా ఉంది కదూ!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement