-
జలయజ్ఞం ఆయకట్టు పది లక్షలు
సాక్షి, హైదరాబాద్: జలయజ్ఞం ఫలితాలిస్తోంది. కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వస్తోంది. జలయజ్ఞంలో భాగంగా పదేళ్ల కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2013-14 ఏడాది నాటికే 6 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇప్పటి వరకు 4.75 లక్షల నూతన ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇందులో సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే సాగులోకి వచ్చినట్లు నీటి పారుదల శాఖ తాజా నివేదికలు చెబుతున్నాయి. ఫలిస్తున్న జలయజ్ఞం.. 2004-05లో జలయజ్ఞం కింద ఆప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 14 ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుల నుంచి 2013-14 నాటికి 6,14,897 ఎకరాలు కొత్తగా సాగులోకి రాగా, మరో 92,584 ఎకరాల స్థిరీకరణ జరిగింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాత ప్రాజెక్టులతోపాటు కొత్త ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ప్రాజెక్టు కోసం 2014-15లో రూ.5,285.03 కోట్లు, 2015-16లో రూ.7189.21 కోట్లును వెచ్చించగా, ఈ ఏడాది రూ.25 వేల కోట్లు కేటాయించింది. 2014-15 ఏడాది జూన్-జులై నాటికి లక్ష్యంగా నిర్ణయించుకున్న 6 లక్షల ఎకరాల్లో 66,399 ఎకరాలకు మాత్రమే నీరందించగలిగింది. తర్వాతి కాలంలో కొన్ని ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, సహాయ పునరావాస పనులు కొలిక్కి రావడంతో కొత్త ఆయకట్టును వృద్ధిలోకి తీసుకువచ్చింది. ఏడు లక్షల ఎకరాలు లక్ష్యం ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులు సంపూర్ణంగా, 11 ప్రాజెక్టుల పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రణాళిక వేసింది. వీటి ద్వారా మొత్తంగా 7,32,264 ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో ఎల్లంపల్లి కింద 60 వేలు, ఎస్సారెస్పీ-2 కింద 20 వేలు, నెట్టెంపాడు కింద 1.47 లక్షలు, భీమా కింద 1.25 లక్షల ఎకరాలకు నీరివ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు కింద నిర్ణీత ఆయకట్టుకు నీరందించడంతో సఫలీకృతమైంది. ప్రస్తుత నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారం కల్వకుర్తి కింద 1.47 లక్షలు, భీమా కింద 1.28 ల క్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, కోయిల్సాగర్ కింద 8 వేల ఎకరాల మేర కొత్త ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం సాగులోకి వచ్చిన ఆయకట్టు 4,75,856 ఎకరాలకు చేరింది. మొత్తంగా 2013-14 వరకు సాగులోకి వచ్చిన ఆయకట్టుతో కలిపి జలయజ్ఞం కింద ఇంతవరకు 10,90,753 ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వచ్చినట్లయింది. -
సాగని సాగర్ ఆధునికీకరణ
- నత్తన నడకన పనులు - ఈ ఏడాది 10 శాతం మేరకే.. - రెండు సార్లు గడువు ఇచ్చిన పూర్తి కాని వైనం ఖమ్మం అర్బన్: సాగర్ కాల్వ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాల్వ చివరి భూములకు, స్థిరీకరణ ఆయకట్టుకు వృథా లేకుండా సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పనులు ఏడేళ్లవుతున్నా పూర్తి కావడం లేదు. ప్రతి ఏటా ఎదో ఒక కారణంతో అనుకన్న లక్ష్యం మేరకు పనులు చేయలేక పోవడంతో మొదట చేసిన పనులు మళ్లీ మరమ్మతులకు వస్తున్నాయి. ఈ పనులు పూర్తయ్యేందుకు గడువు పెంచినా, కొన్ని ప్యాకేజిల్లో అసలు ఇంతవరకూ పనులే ప్రారంభం కాలేదు. ఈ ఏడాది లక్ష్యంలో పదిశాతం పనులే పూర్తికాగా వర్షాలు ప్రారంభం కావడంతో అన్ని చోట్లా నిలిచిపోయాయి. ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడంతో కాల్వలకు గండ్లు పడడం, ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరు పూర్తి స్థాయిలో పంట భూములకు చేరలేకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి సారించి సాగర్ కాల్వ ఆధునికీకరణ పనులను వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. భవిష్యత్తులోనైనా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఆశించిన ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు ఆర్థిక సాయం చేస్తున్న ప్రపంచ బ్యాంకు బృందం ఈనెల 9న జిల్లాలో పర్యటించనుంది. ఆధునికీకరణ 400 క్యూసెక్కులకే గండి గత రబీ సీజన్లో నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలో గండి పడి వారం రోజులు నీటి ప్రవాహానికి అంతరాయం కలిగింది. అప్పటిలో టెలిఫోన్లైన్ కోసం తవ్వకాలు చేయడంతో కాల్వ గండికి కారణమని అధికారులు అప్పటిలో తేల్చారు. గత సోమవారం తెల్లవారుజామున బోనకల్లు బ్రాంచి కాల్వకు నీరు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 10 అడుగుల మేరకు గండి పడటంతో మళ్లీ సరఫరాకు అంతరాయం కలిగింది. 1,400 క్యూసెక్కల నీరు ప్రవహించాల్సి కాల్వలో కేవలం 400 క్యూసెక్కల నీరు విడుదల చేస్తేనే గండిపడిందంటే కాల్వ అధునినీరణతో ఉపయోగమా.. నష్టమా అనేది అర్థం కావడం లేదని రైతులు, రైతు సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2008లో కోట్లాది రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో సాగర్ కాల్వల అధునినీకరణ పనులు చేపట్టారు. ఈఏడాది ఆ పనుల లక్ష్యంలో 10 శాతం మేరకే పనులు సాగాయి. ప్రధాన కాల్వ 2,3,4,5,7 ప్యాకేజీల పనులతోపాటు, మధిర, బోనకల్లు బ్రాంచి కాల్వల ఆధునికీకరణ గత ఏడాది అంచనాల్లో 65 శాతం పనులు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈఏడాది కేవలం 10 శాతం పనులు జరగడంతో ప్రధాన కాల్వ పనులు 75 శాతానికి చేరుకున్నాయి. డీసీల పరిధిలో 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 24 ప్యాకేజీల పరిధిలో గత ఏడాది 50 శాతం మేరకు పనులు జరిగితే ఈ ఏడాది మరో 10 శాతంతో కలిపి 65 శాతం మేరకు పనులు పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. ఈఏడాదిలో ఆధునికీకరణకు ప్యాకేజీ 20, 22ల పరిధిలో అసలు పనులే ప్రారంభం కాకపోవడంతో అక్కడ గత ఏడాది జరిగిన పనులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత ఏడాది 5నుంచి 10 శాతం పనులు జరిగిన ప్యాకేజీల్లో ఈఏడాది అత్యధికంగా పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో పనులు చేయడానికి గ్యాప్ పిరియడ్ లేకపోవడంతో పనులు చేయలేక పోయినట్లు అధికారులు అంటున్నారు. గత ఏప్రిల్ వరకు రబీసాగుకు నీరు విడుదల చేయడం, తర్వాత నీరు కాల్వలో ఎండి పనులు మొదలు పెట్టడం, ఏప్రిల్ మాసం గడిచి పోవడం, తర్వాత పనులు ప్రారంభించగానే అడపాదడపా వర్షాలు పడడంతో పనులు చేయడానికి అంతరాయం ఏర్పడింది. పనులు మొదలు పెట్టి చేసే సమయంలో తాగు నీటి కోసం నీరు విడుదల చేయడం, తర్వాత సాగర్ డ్యామ్లోకి నీరు చేరడం, సాగుకు, తాగు అవసరాలకు నీరు విడుదల చేయడంతో సాగర్ ఆధునికీకరణ పనులు అనుకున్న మేరకు ముందుకు సాగడం లేదు. 2008లో ప్రారంభమైనా... సాగర్ కాల్వల ఆధునికీకరణ పనుల కోసం ప్రపంచబ్యాంక్ రూ. 4వేల444 కోట్లు మంజూరు చేసింది. వాటిలో ప్రధాన కాల్వ, డీసీ పరిధిలోని కాల్వలతోపాటు, నీటి సంఘాల పరిధిలో ఉన్న కాల్వలన్నీ ఆధునీకరించి నీరు వృథాకాకుండా చివరి భూములకు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పనులు గడువు దాటినా పూర్తి కావడం లేదు. ప్రధాన కాల్వ పనులు 48 నెలలు, డీసీల, నీటి సంఘాల పరిధిలో పనులు అగిమెంట్ అయిన తర్వాత పూర్తి చేయాల్సి ఉంది. తొలుత ప్రారంభించిన ప్రధాన కాల్వ పనులు గడువు 2012 ఆగస్టుతో దాటింది. రకరకాల కారణాల వ ల్ల పనులు జాప్యం జరిగిందంటూ మరో రెండు సంవత్సరాలు గడువు పెంచాలని అధికారులు ప్రపంచ బ్యాంక్ను కోరడంతో అనుమతులు వచ్చాయి. ఆ గడువు కూడా గత నెల 29తో ముగిసింది. పనులు మాత్రం సగానికి కొద్దిగా ఎక్కువగా జరిగాయి. మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో ఏడాది అంటే 2015 ఏడాది ఆగస్టు వరకు ఇవ్వాలని కోరుతూ అధికారులు ప్రపంచ బ్యాంక్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. డీసీల పరిధిలో పనులు 2011-12 లో ప్రారంభమయ్యాయి. ఆ పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. నీటి సంఘాల పరిధిలో పనులు చేయడానికి ప్రపంచ బ్యాంక్నుండి ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. ఇందుకు కారణం నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం అంటూ ప్రపంచ బ్యాంక్ తెలిపింది. నీటి సంఘాలు ఉంటేనే వాటి పరిధిలో పనులు చేయాలని షరత్ విధించడంతో రెండు సంవత్సరాలుగా నీటి సంఘాలకు ఎన్నికలు జరపకపోవడంతో అసలు ఆ పనులు ప్రారంభమే కాలేదు. ఇటీవలే ఐదు సంఘాల పరిధిలో పనులు చేయడానికి ప్రపంచబ్యాంక్ ఎట్టికేలకు అనుమతి ఇవ్వడంతో వాటిని ప్రారంభించడానికి అధికారులు రూ. 5 కోట్ల అంచనాలతో టెండర్లు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. ఈనెలలో వాటికి టెండర్లు నిర్వహించనున్నట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. ప్రధాన కాల్వ పరిధిలో 67 శాతమే... తెలంగాణ రాష్ట్రం పరిధి టేకులపల్లి సర్కిల్ పరిధిలోని 8 ప్యాకేజీల ఆధునికీకరణకు రూ. 423.50 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతన్నా 67 శాతం మాత్రమే పనులు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే.. రూ. 287.43 కోట్లమేరే పనులు జరిగాయి. 8 ప్యాకేజీల్లో 6 నంబర్ ప్యాకేజీ పనులు మాత్రం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 7 ప్యాకేజీల పనులకు మరో ఏడాది గడువు పెంచాలని ప్రపంచబ్యాంక్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. అక్కడ నుంచి అనుమతులు వస్తే మళ్లీ ఎప్రిల్ తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డీసీల పరిధిలో 50 శాతం పనులే పూర్తి డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ)ల పరిధిలో గతంలో 19 ప్యాకేజిలు ఉండేవి. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టేకులపల్లి సర్కిల్ పరిధిలో 11 ప్యాకెజేలు ఉన్నాయి. ఆ పనులకు రూ.197.32 కోట్లు మంజూరు కాగా వాటిలో 50 శాతం మేరకే పనులు పూర్తయ్యాయి. రూ 98.62 కోట్ల పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పనులు ప్రారంభం నుంచి జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా నోటీసులు జారీ చేశారు. ఒక ప్యాకేజి పనుల్లో కొంత బాగం విడగొట్టి ఈఏడాది మరో కాంట్రాక్టర్కు కేటాయించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement