-
దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!
దంతాలకు ఈ పేస్టు/టూత్ పౌడర్ మంచిదంటూ వివిధ కంపెనీలు పలు ఆకర్షణీయమైన అడ్వర్టైస్మెంట్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇంతకీ వాటిలో ఏది బెటర్ అనేది తెలియక జనాలు అవస్థలు మాములుగా ఉండవు. కొందరూ తమ బడ్జెట్కి అనుగుణంగా ఉన్నది ఎంపిక చేసుకుంటే ఇంకొందరూ మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్తరకం పేస్ట్ని ట్రై చేసేస్తుంటారు. నిజానికి వాటిలో ఏ పేస్ట్ మంచిది. ఇంతలా ఇన్ని రకాల పేస్టుల మార్కెట్లో ఉన్నా.. ప్రజలు దంత సమస్యలను ఇంకా ఫేస్ చేస్తూనే ఉంటున్నారు ఎందుకు? తదితరాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!. దంత సమస్యలకు కారణం.. ప్రధానంగా కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అలాగే నోటిలోని లాలజలంలో పీహెచ్ విలువ ఆహారం తీసుకోక మునుపు 7.4 తర్వాత 5.9 ఉండకపోయినా దంత సమస్య వస్తుంది. డీ, బీ, సీ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల వాపు వంటి సమస్యలు వచ్చి దంతాలు వదులుగా మారి సలుపు రావడం వంటి సమస్యలు వస్తాయి. దంతాలు పైన ఉండే ఎనామెల్ దెబ్బతినడం వల్ల దంతాల్లో బ్యాక్టీరియా చేరడం తదితరాల వల్ల ఈ దంత సమస్యలు తరుచుగా వస్తుంటాయి. అంతేగాక ఇవి కాస్త గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏ పేస్ట్ బెటర్! మార్కెట్లోకి వస్తున్నా రకరకాల పేస్ట్లు, పౌడర్లు కన్నా వేప పుల్లలు లేదా జామ ఆకులు చాల మంచివి. ముఖ్యంగా జామా ఆకులతో పళ్లు తోముకుంటే చిగుళ్ల నొప్పులు, పంటి నొప్పులు దంతాల వాపు తదితర పళ్ల సమస్యలు ఉండవు. ఫలితంగా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. ఆయా టూత్ పేస్ట్లోని రసాయనం కడుపులో వికారం వంటివి కలగజేసి ఆకలి లేకుండా చేస్తున్నాయని చెప్పారు. కొన్ని అయితే వాటిలో ఉండే గాఢత పళ్లకు మంచి చేసే బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినేలా చేస్తున్నాయని అన్నారు. మరొకొన్ని పేస్టులు దంతాలను తెల్లగా మార్చేస్తున్నాయి, కానీ ఇలా దంతాలు ఆకస్మికంగా తెల్లగా కనబడటం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కావోచ్చు లేదా ఇతరత్ర దంత సమస్యలకు సంకేతం కూడా అయి ఉండోచ్చని చెబుతున్నారు. దంత సమస్యలకు నివారణ.. ఇక నోటిలో పుండ్లు వంటి వాటికి ప్రధాన కారణం చవుకబారు నూనెలతో తయారు చేసిన చిరుతిండ్లు తినడం రావొచ్చు లేదా విటమిన్ బీ, సీ లోపం వల్ల కూడా రావచ్చని అన్నారు. అందుకోసం సి -విటమిన్, బి-కాంప్లెక్స్ మాత్రలు వాడుతూ తేనె కలిపిన నీటితో నోరు పుక్కిలిస్తే ఈ సమస్య త్వరితగతిన తగ్గిపోతుందన్నారు. దంతాల నొప్పి భరించలేని విధంగా ఉంటే Vantage అనే పేస్ట్ వాడమని సూచిస్తున్నారు. ఇది పేస్ట్గా పళ్లు తోముకోవడానికి వాడకూడదు. కేవలం నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చాలు. ఇది కడుపులోపలికి వెళ్లినా.. ఎలాంటి ప్రమాదం ఉండదు. నొప్పి మరీ తీవ్ర స్థాయిలో ఉంటే..Vantage పేస్ట్ తోపాటు కాట్రోల్ katorol dt అనే మాత్రను కూడా వాడితే చక్కటి ఫలితం ఉంటుదని చెబుతున్నారు. ---ఆయర్వేద వైద్యులు నవీన్ నడిమింటి (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించుకోవాలంటే..!
ఆయుర్వేదం ప్రకారం, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ రెండూ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పైగా అవి ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ట్రైగ్లిజరైడ్ పెరుగుదల చెడు కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్రధాన కారణాలలో ఒకటిగా ఊబకాయం, కదలిక లేకపోవడం, చెడు ఆహారాల వినియోగం, చెడు అలవాట్లు, ఇవన్నీ శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీస్తాయి (బాగా). ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి మొదటి అడుగు ఆయుర్వేదం. జీవనశైలి ఆహారంలో మార్పులతో ఈ సమస్యను సులభంగా బయటపడవచ్చు అటున్నారు నవీన్ నడిమింటి. ముందుగా సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించండి. డెజర్ట్లు, చక్కెర, శుద్ధి చేసిన లేదాప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగం ద్వారా ట్రైగ్లిజరైడ్ల పరిమాణం పెరుగుతుంది. ఈ ఆహారాలకు బదులుగా, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవడం పెంచాలని ఆయుర్వేదం సలహా ఇస్తుంది. వ్యాయామం రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, పరుగు, యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే రక్తప్రవాహంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గేందుకి దారితీస్తుంది. కేలరీలను తీసుకోవడం తగ్గించండి. మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాస్తా, సోడాలు, ఆల్కహాల్ ఇతర ఆహారాలు తోపాటు అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి, బరువుపై ట్రైగ్లిజరైడ్స్ ప్రభావం బరువుపై ట్రైగ్లిజరైడ్లు అధికంగా ప్రభావం చూపుతాయి. వీటి స్థాయిలు పెరిగిన వ్యక్తుల పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోతుంది. తినడం, నిద్రించడం వంఇ వాటి వల్ల టాక్సిన్లు పేరుకుపోతాయి. ఇది కాస్త చెడు కొలస్ట్రాల్కి దారితీస్తుంది. ఆహారాన్ని తయారు చేసే విధానంలో ఉపయోగించే నూనెల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. లేదంటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ప్రమాదం ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ట్రైగ్లిజరైడ్లను తగ్గించే ఆహారాలు, ఆయుర్వేద మూలికలు తేనె తేనె ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్తో విజయవంతంగా పోరాడుతుంది. ఒక చెంచా తేనెను ఒక గ్లాసు వేడి నీటిలో కరిగించి, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను సాధారణీకరించి చెడు కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నీటిలో 8 నుంచి 10 చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా ½ టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా జోడించవచ్చు. వెల్లుల్లి: ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి, ఆయుర్వేదం వెల్లుల్లి వినియోగాన్ని గట్టిగా సిఫార్సు చేస్తుంది. వెల్లుల్లిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, అలిసిన్, అజోయిక్ ఇతర సల్ఫర్ సమ్మేళనాలు వంటి సేంద్రీయ సల్ఫేట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. తురిమి లేదా ఒలిచిన, వెల్లుల్లిని వంటలలో చేర్చమని అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి పాలు కూడా మంచిదే అని చెబుతున్నారు. ఇది ఎలా చేయాలంటే..వెల్లుల్లి 5 నుంచి ఆరు తీసుకుని, రెండు లవంగాలు చూర్ణం చేసి 50 మి.ల్లీ లీటర్ల దేశీయా ఆవు పాలల్లో కలిపి వేడి చేయండి. సగం అయ్యేంత వరకు మరగినిచ్చి ఫిల్టర్ చేసి వేడిగా తాగండి చక్కటి ఫలితం ఉంటుంది. ఆమ్లా ఉసిరికాయలో విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి యాంటీఆక్సిడెంట్. ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ధమనులను శుభ్రం అవ్వడమే గాక ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అర్జునుడు ఇది చాలా శక్తివంతమైన ఆయుర్వేద మూలిక, ఇది కొలెస్ట్రాల్ను కరిగించి ధమనులను శుభ్రంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అర్జునుడిని తెల్లవారుజామునే నీటిలో కరిగించి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. గుగ్గులు ఆయుర్వేదంతో ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడే మరొక మూలిక. గుగ్గులు. గుగ్గుల్ స్టెరోన్లను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను చురుకుగా నిరోధిస్థాయి. ఈ ఆయుర్వేద మూలికను ప్రతిసారి భోజనం తర్వాత తీసుకోవచ్చు కూడా. మీ ట్రైగ్లిజరైడ్లను సాధారణంగా ఉంచడానికి 25 మిల్లీగ్రాం సరిపోతుంది. సెలెరీ ఈ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సెలెరీని సలాడ్గా తినవచ్చు, వంటలలో చేర్చవచ్చు లేదా రసంగా త్రాగవచ్చు. రోజుకు 2 కాడల ఆకుకూరల వినియోగం చెడు కొలెస్ట్రాల్ను 7 పాయింట్లు తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి . అవకాడో అవోకాడోస్లో గణనీయమైన మొత్తంలో ఫైబర్, ఒలేయిక్ యాసిడ్ వంటి మంచి కొవ్వులు ఉంటాయి, ఇది అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అవోకాడో సాధారణ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నిర్వహించడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దీనిలో కొవ్వులు అధికం అనే విషయం గుర్తుంచుకోవాలి. గ్రీన్_టీ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించగలవు. ఒక గ్లాసు గ్రీన్ టీలో కూరగాయలు, పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదం గ్రీన్ టీని రోజుకు మూడు సార్లు తాగాలని సిఫార్సు చేస్తోంది. బ్రౌన్రైస్ మీరు మీ సాధారణ ట్రైగ్లిజరైడ్లను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, బ్రౌన్తో కూడిన వైట్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్లో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి అనే వాస్తవం పక్కన పెడితే, ఇందులో ఫైబర్, సంతృప్త కొవ్వులు కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుద్ధి చేయడానికి, బరువును తగ్గించడానికి ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది . యాపిల్స్ ఈ రుచికరమైన పండ్లలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వీటిని ఫ్లేవనాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గించి ఊపిరితిత్తులు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సగటు యాపిల్లో పెద్ద మొత్తంలో విటమిన్లు ఏ, సీ ఉంటాయి. సుమారు 4 గ్రాముల ఫైబర్లో కేలరీలు కేవలం 100 మాత్రమే. యాపిల్స్ తోపాటు, ఆయుర్వేదం బేరి, దానిమ్మ, ద్రాక్షపండ్లు, నారింజలను తీసుకోవడం ద్వారా ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సిఫార్సు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. . బ్రోకలీ బ్రోకలీలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, అవి యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. బ్రోకలీతో కలిపి తీసుకుంటే, అందులో ఉండే ఫైబర్లు జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన పిత్త ఆమ్లాలతో బంధించి వాటిని సహజంగా శరీరం నుంచి బయటకు తీస్తాయి. బ్రోకలీ సాధారణ ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. బార్లీ బార్లీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెరను సాధారణీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. తృణధాన్యంలో బీటా -గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను 4-10% తగ్గిస్తుంది. అదనంగా, బార్లీ గోధుమలకు చాలా మంచి ప్రత్యామ్నాయం. మీరు దీన్ని బ్రెడ్కు ప్రత్యామ్నాయంగా క్రమం తప్పకుండా తినవచ్చు. చేప చేప నూనె, చేప ట్యూనా, మాకేరెల్, ట్రౌట్, సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్ వంటి చేపలు ఒమేగా 3 యాసిడ్లతో నిండి ఉంటాయి, ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించి గుండె జబ్బులను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆయుర్వేదం వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినాలని అలాగే ప్రతిరోజూ 1 నుంచి 4 గ్రాముల చేప నూనెను తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. దుంప దీని ఆకులలో సినారైన్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పేరుకుపోయిన టాక్సిన్ని వేగవంతంగా తొలగిస్తుంది. తత్ఫలితంగా కొలెస్ట్రాల్ తగ్గి ధమనులను శుభ్రం అవుతాయి . పాలకూర బచ్చలికూర వీటిలో ల్యూటిన్ ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్స్ని ధమనుల గోడలకు అంటుకోకుండా, మూసుకుపోకుండా నిరోధిస్తుంది. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఇ, ఫలకం తొలగింపుపై శ్రద్ధ చూపుతుంది తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. అలాగే బీన్స్, బఠానీలు, చిక్పీస్, కాయధాన్యాలు మరియు ఇతర ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫ్లాక్స్ సీడ్లో లిగ్నన్లు ఉంటాయి, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. గుండె సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఫ్లాక్స్ సీడ్లో ఫైబర్ ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ఉత్పత్తి, శోషణను నియంత్రిస్తాయి. (చదవండి: ఈ పొరపాటు చేస్తే.. మీరు ఏజ్డ్ పర్సన్లా కనిపించడం ఖాయం!) -
ఆకాశ పండు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!
స్కై ఫ్రూట్ మహిళలలో వచ్చే పీఓసీడీ సమస్యలకు ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కనిపరిష్కారం. ఈ స్కై ఫ్రూట్ (ఆకాశపండు) గొప్పతనం గురించి ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. ఆధునిక వైద్య శాస్త్రంలో, స్కై ఫ్రూట్స్ ఖ్యాతి చాలా పాతది కానప్పటికీ, ఆగ్నేయాసియా దేశాలలో, అధిక రక్తపోటు పీసీఓడీ సమస్యలకు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి సాంప్రదాయకంగా ఆకాశ పండ్ల విత్తనాలను ఉపయోగిస్తారు. స్కైఫ్రూట్ ఎలా ఉపయోగించాలి? మీకు స్కై ఫ్రూట్ మొత్తం దొరికితే, దాన్ని పగలగొట్టి దాని గింజను బయటకు తీయండి. వెచ్చని నీటితో లోపలి విత్తనాన్ని నమలవచ్చు లేదా మింగవచ్చు. రుచి పరంగా, ఇది చాలా చేదుగా ఉంటుంది. మీ చక్కెర స్థాయి 200 కంటే ఎక్కువ ఉంటే, పూర్తి విత్తనాన్ని తీసుకోండి. మీ చక్కెర స్థాయి 200 కంటే తక్కువగా ఉంటే, సగం గింజను తినండి. ఇది టాబ్లెట్గానూ లేదా పౌడర్ రూపంలో లభిస్తుంది. “ఉదయం, పళ్ళు తోముకున్న వెంటనే తీసుకోవాలని చెబుతున్నారు. గరిష్ట ప్రయోజనాల కోసం, స్కై ఫ్రూట్ తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ, కాఫీ, పాలు ఏదైనా ఇతర ఆహార పదార్థాలను తాగకుండా ఉండండి. స్కైఫ్రూట్ ప్రయోజనాలు.. “స్కై ఫ్రూట్" అందించే ప్రయోజనాలకు సంబంధించి సుదీర్ఘ జాబితానే ఉంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంతోపాటు వివిధ సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. వాటిలో కొన్ని: చర్మ అలెర్జీకి చికిత్సలా పని చేస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఋతుస్రావం నొప్పిని అరికడుతుంది. దుర్వాసన వదిలించుకోవడానికి సహాయపడుతుంది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది అల్జీమర్స్కు చికిత్స చేస్తుంది నపుంసకత్వానికి చికిత్స చేస్తుంది శరీర బలాన్ని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఆస్తమా చికిత్సలో సహాయపడుతుంది నిద్రలేమికి చికిత్స చేస్తుంది ఆకలిని పెంచుతుంది మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది మలేరియాకు చికిత్స చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది కణితులతో పోరాడడంలో సహాయపడుతుంది ఆస్తమా చికిత్సలో ఉపయోగపడుతుంది హృదయనాళ వ్యవస్థను మెరుగుపరిచి, రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది కరోనరీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆర్టెరియోస్క్లెరోసిస్ ఫలకాన్ని నివారిస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్లు.. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అదనంగా, స్కై ఫ్రూట్ విటమిన్లు, కొవ్వులు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, సహజ ప్రోటీన్లు, ఎంజైమ్లు తోపాటు వివిధ ముఖ్యమైన పోషకాల విలువైన మిశ్రమాన్ని అందిస్తుంది. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. స్కైఫ్రూట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు.. స్కై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతిన్నట్లు కొన్ని కేసులు వచ్చాయి. ఎవరైనా అనారోగ్యంగా భావిస్తే.. బద్ధకం, వికారం, ఆకలి లేకపోవడం, చీకటి మూత్రం వంటి కాలేయ గాయం వంటి లక్షణాలు కనిపిస్తే..అలాంటి వారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే కళ్లలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం లేదా చర్మం పసుపు రంగులోకి మారడం, కామెర్లు వచ్చినా, స్కై ఫ్రూట్ తీసుకోవడం మానేసి వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అలాగే ఏదైనా వాడేముందు సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు వాడి మంచి ప్రయోజనాలను పొందండి. (చదవండి: చూపు లేదు కానీ క్యాన్సర్ని గుర్తిస్తారు) -
నిత్యం వంటింట్లో ఉపయోగించే వాటితో..గుండెలో బ్లాక్స్కి చెక్పెట్టండి ఇలా..
చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారినపడుతున్నారు. సినీ స్టార్ల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ చిన్న వయస్సులోనే గుండెజబ్బుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మారుతున్న జీవనశైలికి తోడు ఉరుకుల పరుకుల జీవనం కారణంగా.. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినంత వ్యాయమం లేకపోవడం తదితర కారణాల రీత్యా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వీటికి ప్రధాన కారణం ఓబెసిటీ, స్మోకింగ్. సాధ్యమైనంత వరకు స్మోకింగ్ కు దూరంగా ఉండటమే మంచిది. గుండెకు సరఫరా అయ్యే నాళాల్లో బ్లాక్లు ఏర్పడి గుండె కండరం డ్యామేజ్ అయ్యితే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ॥ Heart Attack ॥3000 years ago in our country India there was a great sage. His name was Maharishi Vagvat ji, he had written a book named Ashtang Hrudayam and in this book he had written 7000 formulas to cure diseases, this is one of them.Vagvat ji writes that whenever the… pic.twitter.com/C2E2EJ9yra— We Hindu (@SanatanTalks) June 4, 2023 అలాగే నడుస్తుంటే ఆయాసం వచ్చిన గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని గుర్తించి సకాలంలో వైద్యుల వద్ద చికిత్స తీసుకోవాలి. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో బ్లాక్లు ఉన్నట్లు తేలితే.. ప్రమాద తీవ్రతను బట్టి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవడం మంచిది. ఐతే ఈ బ్లాక్లను చక్కటి ఆయర్వేద వైద్యంతో కూడా సులభంగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు నవీన్ నడిమింటి. మనం వంటింట్లో తరుచుగా ఉపయోగించే వాటితోనే ఈ బ్లాక్లకు చెక్పెట్టొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణుల నవీన్ నడిమింటి. అవేమిటో ఆయన మాటల్లోనే చూద్దామా.. అల్లం ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90 శాతం తగ్గించగలదు. వెల్లుల్లి రసం ఇందులో ఉండే అల్లిసిన్ మూలకం కొలస్ట్రాల్ని, బీపీని తగ్గిస్తుంది. దీంతో హార్ట్ బ్లాక్ ఓపెన్ అవుతుంది నిమ్మరసం ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో అన్ని నరాలను తెరుస్తాయి. అలసటను తగ్గిస్తుంది. పై వాటన్నింటితో తయారు చేసే ఔషధం రోజు ఉదయం పరగడుపున మూడు స్పూన్లు తీసుకుంటే అన్ని బ్లాక్స్ సులభంగా తొలగిపోతాయి. తయారు చేయు విధానం: నిమ్మరసం - ఒక కప్పు అల్లం రసం- ఒక కప్పు వెల్లులి రసం- ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్- ఒక కప్పు విధానం: ఆ నాలుగింటిని కలిపి సన్నని మంటపై వేడి చేయండి. మూడు కప్పులు అయ్యేంత వరకు బాగా మరిగించండి. ఆ తర్వాత చల్లారిన ఆ మిశ్రమానికి మూడు కప్పుల తేనె కలిపి ఓ సీసాలో భద్రపరుచుకోండి. దీంతో బ్లాక్లు సులభంగా తొలుగుతాయని, ఈ సమస్య నుంచి త్వరిత గతిన బయటపడే అవకాశం ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణలు నవీన్ నడిమింటి చెబుతున్నారు. (చదవండి: బరువు తగ్గాలనుకుంటే..బ్రేక్ ఫాస్ట్లో వాటిని దగ్గరకు రానియ్యకండి..) -
Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్గా మారి..!
ప్రకృతి సిద్ధంగా దొరికే తేనె.. ఇంటివైద్యం మొదలుకొని ఆయుర్వేదం వరకు రకరకాల సమస్యల నివారణకు వాడుకలో ఉన్నదే. ప్రకృతి ప్రసాదమేకదా! అని ఎట్లాపడితే అట్లా వాడితో ఔషధం విషంగా మారుతుంది. అవును!! చాలా మంది పరకడుపున వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగుతారు. సాధారణంగా ఈ ప్రక్రియను శరీరంలోని కొలెస్ట్రాల్ను కరిగించి బరువును తగ్గిస్తుందనే నమ్మకంతో అనుసరిస్తారు. సహజంగానే తీపి గుణం కలిగిన ప్రకృతి సిద్ధమైన తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మాగ్నిషియం, కాపర్, మాంగనీస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్, ఎన్జైమ్స్ పుష్కలంగా ఉంటాయి. తీపికి ప్రత్నామ్నాయంగా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు కూడా ముడి తేనె ఉపయోగంలో ఉంది. అంతేకాక ఇది దగ్గు నుంచి ఉపశమనాన్నిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. కాలిన గాయాలను నయం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుంది కూడా. ఇంతటి సుగుణాలు ఉన్న తేనెను హెర్బల్ టీ, లెమన్ టీ, వేడి పాలు.. వంటి ఏ రకమైన వేడిపదార్ధాలతోనైనా కలిపి తాగడం ఆయుర్వేదం ప్రకారం ప్రమాదమని ప్రముఖ ఆయుర్వేద ఎక్స్పర్ట్ డా. రేఖా రాధామణి హెచ్చరిస్తున్నారు. కారణమేమిటో తెలుసుకుందాం.. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ►తేనెను వేడిగా తీసుకుంటే అది శరీరంలో స్లో పాయిజన్గా మారుతుంది. ఒక్కసారి దీనిని వేడిగా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరంలో హానికారక విషాలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి శరీరంలో క్రమంగా పెరిగి అనేక వ్యాధులకు కారణమవుతుంది. ►ముడి తేనెలో పోషకాలు సహజంగానే అధికంగా ఉంటాయి. దీనిని అలాగే నేరుగా వినియోగించాలి. ఐతే స్టోర్లలో లభించే పాశ్చరైజ్డ్ తేనెలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్, కార్న్ (మొక్కజొన్న) సిరప్ వంటివి తీపి కోసం కలుపుతారు. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రమాదకరం. అలాగే ముడి తేనెలో ఉండే పుప్పొడి, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్లు కూడా దీనిలో ఉండవు. ►అంతేకాకుండా సూపర్ మార్కెట్లలో లభించే అన్నిరకాల తేనెలు విపరీతమైన ఉష్ణోగ్రతల్లో వేడి చేసి ప్యాక్ చేయబడి ఉంటాయి. అటువంటి తేనెను కొనకపోవడం మంచిది. వాడకపోవడం ఇంకా మంచిది. తేనెటీగల నుండి నేరుగా సహజ తేనెను తీసి విక్రయించేవారి నుంచి కొని, వేడి చేయకుండా తింటే తేనెలోని సహజ పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయని డాక్టర్ రాధామణి సూచిస్తున్నారు. చదవండి: మీరు బాదం పాలు తాగుతున్నారా? వికారం, థైరాయిడ్, అలర్జీ..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
T20 WC: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
Advertisement