-
అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు చాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ కా ర్యాలయాల్లో ఇకపై కేవలం బీఆర్ అంబేద్కర్, భగత్సింగ్ ఫొటోలు మాత్రమే ఉంచాలని, మరే నాయకుడి ఫొటో ఉంచకూడదని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వాఫీసుల్లో కనీసం ముఖ్యమంత్రి ఫొటో కూడా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, స్వాతంత్య యోధుడు భగత్ సింగ్ను ఆయన కొనియాడారు. వీరిరువురి ఆలోచనాధోరణికి అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రిపబ్లిక్డే ప్రసంగంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలో ప్రతి చిన్నారికి సరైన విద్య అందాలన్నది అంబేద్కర్ ఆశయమని గుర్తు చేశారు. ఇందుకోసం విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను ఆయన వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీ ఏర్పా టు చేస్తామన్నారు. విజయానికి కులమతాలతో పనిలేదని అంబేద్కర్, భగత్సింగ్ భావించారని కేజ్రీవాల్ చెప్పారు. తమ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన మార్పులను ఆయన వివరించారు. -
భగత్సింగ్ టెర్రరిస్ట్ అట..!
శ్రీనగర్ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్పై కశ్మీర్లోని జమ్మూ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రోఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ తజూవుద్దీన్ అనే అధ్యాపకుడు భగత్సింగ్ను టెర్రరిస్ట్తో పోల్చారని వర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించి, యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తిని టెర్రరిస్ట్ అంటూ వ్యాఖ్యానించిన అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన వర్సిటీ వీసీ మనోజ్ కే ధర్.. ఘటనపై విచారణ చేయవల్సిందిగా ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆదేశించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు తనకు రికార్డుతో కూడిన ఆధారాలను అందించారని, విచారణ పూర్తయ్యే వరకు తజూవుద్దీన్ను విధుల నుంచి బహిష్కరించినట్లు వీసీ తెలిపారు. విద్యార్థుల ఆరోపణలపై స్పందించిన ప్రోఫెసర్ తాను భగత్సింగ్పై అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తాను రష్యా విప్లవంలో లెనిన్ పాత్రపై విద్యార్థులతో రెండు గంటల పాటు మాట్లాడానని, దానిని కొందరు తప్పుగా వక్రీకరించారని తెలిపారు. భగత్సింగ్ను తాను ఎప్పుడూ విప్లవకారుడిగా, గొప్ప స్వాతంత్ర్యయోధుడిగా కీర్తిస్తానని పేర్కొన్నారు. -
భగత్సింగ్పై ఇంత ప్రేమకు ఏది కారణం?
అభిప్రాయం మే 3వ తేదీన ‘సాక్షి’లో 'చరిత్ర చర్చ' శీర్షికతో వచ్చిన సంపాదకీయం ఆలోచింప చేసేదిగా ఉంది. ‘తరగతి గదుల నుంచి నిష్క్రమిస్తున్న ‘చరిత్ర’ పార్లమెంటుకెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్సింగ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కలలుగన్న సమాజం తదితరాలపై సాగాలని ఆశించి నప్పుడు ఆయన అవగాహనపై, విప్లవాచర ణపై మరింతగా దృష్టి పెట్టాలి. భగత్సింగ్ను బ్రిటిష్ వలసవాదులు ఉరితీయాలని సంకల్పించుకోవడానికి ప్రధాన మైన కారణం ‘ఆయన రూపొందుతున్న లెనిన్’ అని గుర్తించి భయపడ టమేనని అన్నాడు బిపన్ చంద్ర. అయితే భగత్సింగ్ను విప్లవకారు డుగా గుర్తించడానికి దేశంలోని నాటి ప్రధాన రాజకీయ పార్టీల కన్నిటికీ ఏదో ఒక అభ్యంతరముండింది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినా దంతో, ఆయన ఉత్తర భారత్లో ఏర్పాటు చేసిన పలు సంస్థల ఆశయాలు, మార్గం ఆనాటి రాజకీయ పార్టీలలో వేటికీ ఆమోదయో గ్యమైనవి కాదు. నెహ్రూ, ఆయన అనుయాయులు భగత్సింగ్ ఆదర్శాన్ని, త్యాగాన్ని కొనియాడినట్లు కనిపించినా నెహ్రూపై, కాంగ్రెస్ పార్టీపై గాంధీకున్న పట్టువల్ల వాళ్ల సమర్థనకు పరిమితులేర్పడినాయి. భగత్సింగ్, సహచర విప్లవకారుల పోరాటాల నాటికే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినా, ఆయన మార్గాన్ని అది అనుసరించనూ లేదు, ఆయ నను తమలోకి ఆహ్వానించనూ లేదు. ఐక్య కమ్యూనిస్టు పార్టీ 1946లో మెుదటిసారి సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. 1947, సెప్టెంబర్ 11న సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా 1948, సెప్టెంబర్ 13-17 నాటికే ఆ పంథా పట్ల అందులోని మితవాద వర్గా నికి విశ్వాసం సన్నగిల్లింది. బిపన్ చంద్ర ఈ కమ్యూనిస్టు సంప్ర దాయానికి, అవగాహనకు చెందినవాడు. కనుక వలస పాలకులకు, గాంధీకే కాదు 1951 నాటికి కమ్యూనిస్టు పార్టీకి కూడా భగత్సింగ్ను ఆయన విప్లవలక్ష్యం, పంథాను సమర్థించడానికి పరిమితులేర్పడి నాయి. బిపన్ చంద్ర వంటి వాళ్లకు కూడా అందుకే భగత్సింగ్ విప్లవ టెర్రరిస్టుగా కనిపించాడు. ఆ తర్వాత కాలంలో ఆయనను ‘సామ్యవాద విప్లవకారుడు’గా పేర్కొన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీకీ, బిపన్చంద్రకూ సామ్యవాద విప్లవానికీ వర్గపోరాటం అనివార్యమన్న అవగాహన పట్ల విశ్వాసం పోయింది. బిపన్ చంద్ర మెుదలైన మార్క్సిస్టు చరిత్రకారుల కృషి పట్ల పూర్తి గౌరవం చూపుతూనే, వాళ్ల చరిత్ర రచనకున్న ఈ పరిమితిని కూడా అర్థం చేసుకోవాలి. భగత్సింగ్పై ప్రత్యేకించి కృషి చేసిన వారిలో బిపన్ చంద్ర, ప్రొఫెసర్ చమన్లాల్లను మించిన వాళ్లు ఉండకపోవచ్చు. కాని భగత్సింగ్ను‘రూపొందుతున్న లెనిన్’గా చరి త్రలో నమోదు చేయడానికి ఆయన విప్లవ హృదయాన్ని వర్తమానంలో ఆవిష్కరించే ప్రాపంచిక దృక్పథం చరిత్రకారులకుండాలి. ‘ప్రజల కర్ణాటక చరిత్ర’ను పునర్నిర్మించే క్రమంలో స్వయంగా విప్లవకారుడు, అమరుడు సాకేత రాజన్ అటువంటి చరిత్ర రచనకు ప్రయత్నం చేశాడు. అది రెండు బృహత్ సంపుటాలుగా వెలువడి విశేష కృషిగా గుర్తింపు పొందింది. సాకేత రాజన్ వంటి వేలాది విప్లవ కారులను బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతున్న పాలకులకు.. విప్లవ కారులను దేశద్రోహులుగా పేర్కొంటున్న బీజేపీకి భగత్సింగ్ మీద ఇంత ప్రేమ కలగడం చారిత్రక అవకాశవాదం కాక మరేమిటి? ఆయన ‘ఫిలాసఫీ ఆఫ్ బాంబ్’ గానీ, ‘నేను నాస్తికుణ్ని ఎలా అయ్యాను’ అంటూ ఆయనలో ఏర్పడిన పరిణామంగానీ, ఆయన ఎంచుకున్న విప్లవ మార్గం గానీ బీజేపీకి జీర్ణమయ్యే విషయాలేనా? హిందూ జాతీయవాదాన్ని భారత జాతివాదంగా రుద్దుతున్న బీజేపీ.. భగత్సింగ్ భుజం మీద తుపాకి పెట్టి బిపన్ చంద్ర వంటి లౌకిక ప్రజాస్వామిక చరిత్రకారులను, కమ్యూనిస్టులను మాత్రమేకాదు విప్లవకారులను కూడా కాల్చదలుచుకున్నది. రోహిత్ వేముల మెుదలు కన్హయ్య కుమార్ వంటి విద్యార్థి నాయకుడు, ఉమర్ ఖలీద్, అనిర్బన్ వంటి విప్లవ విద్యార్థులు దేశద్రోహులుగా కనిపిస్తున్న సంఘ్ పరివార్కు భగత్సింగ్ను విప్లవ టెర్రరిస్టు అనడం అభ్యంతరకరం కావడం పచ్చి అవకాశవాదమే. మావోయిజాన్ని దేశద్రోహంగా చిత్రి స్తున్న హిందుత్వ శక్తులకు.. ఆ మావోయిస్టులకు వేగుచుక్క అయిన భగత్సింగ్ మీద ప్రేమ కలగడాన్ని మించిన ద్వంద్వనీతి ఉందా? వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement