-
బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్తో దీనికి కనెక్షన్ ఏమిటి?
బజరంగ్ దళ్ మరోమారు చర్చల్లోకి వచ్చింది. హరియాణాలోని నూహ్(మేవాత్)లో జరిగిన హింసాకాండ నిందితుడు బిట్టూ బజరంగీ, ఉరఫ్ రాజ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. తాను బజరంగ్దళ్ నేతనని స్వయంగా బిట్టూ ప్రకటించుకున్నాడు. అయితే విశ్వహిందూ పరిషత్ బిట్టూకు, బజరంగ్దళ్కు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. కాగా బజరంగ్ దళ్పేరు చర్చల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. బజరంగ్ దళ్ ఎలా ఏర్పాటయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అనంతరం అది జూలై 1984..‘ఆపరేషన్ బ్లూ స్టార్’ ముగిసి నెల రోజులు పూర్తయింది. అయినా పంజాబ్లో హిందువులపై తరచూ హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతలో అయోధ్యలోని రామజన్మభూమికి విముక్తి కల్పించేందుకు విశ్వహిందూ పరిషత్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గోరఖ్నాథ్ మఠం అధిపతి మహంత్ వైద్యనాథ్ నేతృత్వం వహించగా, కాంగ్రెస్ నేత దౌ దయాల్ ఖన్నా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1984 సెప్టెంబరులో ఈ కమిటీ బీహార్లోని సీతామర్హి నుండి అయోధ్య వరకు 400 కిలోమీటర్ల యాత్రను ప్రారంభించింది. సరయూ ఒడ్డున భారీ కార్యక్రమం యాత్రలో ఊరేగింపునకు ముందు ఒక ట్రక్కులో రాముడు, సీత విగ్రహాలు ఏర్పాటు చేశారు. వెనుకనున్న వాహనాల్లో సాధువులు, వేలాది మంది ప్రజలు ఉన్నారు. 1984, అక్టోబర్ 6న యాత్ర అయోధ్యలోని సరయూ నదిపైగల వంతెన వద్ద ముగిసింది. అక్టోబరు 7న సరయూ ఒడ్డున ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది పాల్గొన్నారని సీనియర్ జర్నలిస్ట్ వినయ్ సీతాపతి తన పుస్తకంలో రాశారు. రామజన్మ భూమి కోసం పాటుపడేవారికే ఓటు ఆరోజు జరిగిన కార్యక్రమంలో వేదికపై ఒక పెద్ద చిత్రం ఏర్పాటు చేశారు. అందులో నిరాయుధ సాధువుల ఎదుట కత్తులు పట్టుకున్న ముస్లింలు నిలబడి ఉన్నట్లు చూపించారు. ఆ కార్యక్రమానికి హాజరైనవారు జాతీయ సమైక్యత, సమగ్రత కోసం ముస్లింలు ఈ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎలాంటి గందరగోళం ఏర్పడకూడదని అటల్ బిహారీ వాజ్పేయి అభ్యర్థించారని సీతాపతి తన పుస్తకంలో రాశారు. ఈ భూమిని, మిగిలిన రెండు పవిత్ర స్థలాలను (కాశీ, మధుర) విముక్తి చేయడానికి ఎవరు ప్రయత్నించినా వచ్చే ఎన్నికల్లో హిందువులు వారికే ఓటు వేయాలని కార్యక్రమంలో తీర్మానించారు. వానరసేన స్ఫూర్తిగా బజరంగ్ దళ్ 1984, అక్టోబర్ 8న విశ్వహిందూ పరిషత్ వానరసేన స్ఫూర్తిగా బజరంగ్ దళ్ ఏర్పాటును ప్రకటించింది. వానరసేన సీతామాతను రక్షించడంలో రామునికి సహాయపడింది. బజరంగ్ దళ్ ఉద్దేశ్యం బాబ్రీ మసీదు నుండి రామ జన్మభూమిని కాపాడటం. ఆ తరువాత కొన్నేళ్లకు రామజన్మభూమి ఉద్యమానికి బజరంగ్ దళ్ ప్రధాన భూమికగా మారింది. 1992 డిసెంబరు 6న భజరంగ్ దళ్ నేతృత్వంలో కరసేవకులు అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత బజరంగ్దళ్పై ప్రభుత్వం నిషేధం విధించింది. వీహెచ్పీ వెబ్సైట్లో.. విశ్వహిందూ పరిషత్ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం బజరంగ్ దళ్ ఎవరిపైననో నిరసన వ్యక్తం చేసేందుకు ఆవిర్భవించలేదు. హిందువులను సవాలు చేసే సంఘ వ్యతిరేక శక్తుల నుండి రక్షణకే ఏర్పాటయ్యింది. ఆ సమయంలో శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో చురుకుగా పాల్గొనే స్థానిక యువకులకే బజరంగ్ దళ్ బాధ్యతలు అప్పగించారు. తరువాతి కాలంలో దేశం నలుమూలల నుంచి యువకులు ఈ సంస్థలో చేరారు. 1993లో తొలిసారిగా బజరంగ్ దళ్ అఖిల-భారత సంస్థాగత రూపం నిర్ణయించారు. అన్ని రాష్ట్రాలలో బజరంగ్ దళ్ శాఖలు ఏర్పాటయ్యాయి. ఇది కూడా చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. -
‘వాలంటైన్ డే’ను అడ్డుకుంటాం
సుల్తాన్బజార్: పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత్, భజరంగ్దళ్ వ్యతికిస్తున్నాయని, ఫిబ్రవరి 14న వాలంటైన్ డే పేరిట జరిగే అన్ని కార్యాక్రమాలను అడ్డుకుంటామని వీహెచ్పీ స్టేట్ కన్వీనర్ సుభాష్చందర్ తెలిపారు. బుధవారం కోఠిలోని వీహెచ్పీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటైన్ అనే వ్యక్తి రోమ్ రాజ్యానికి చెందిన దేశద్రోహి అని, అలాంటి వ్యక్తికి సంబంధించిన రోజున వారి దేశంలోనే ప్రేమికుల రోజు నిర్వహించడం లేదన్నారు. కానీ మన దేశంలో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రేమికుల రోజు పేరిట సమాజాన్ని, యువతను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతీసే విధంగా పబ్లు, రిసార్ట్స్, హోటళ్లలో ఈ కార్యక్రమాలను నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. తాము ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం కాదని, భజరంగ్దళ్ ప్రేమికుల దినోత్సవానికి మాత్రమే వ్యతిరేకంమన్నారు. ప్రేమికులు మల్టీనేషనల్ కంపెనీల ఉచ్చులో పడవద్దని సూచించారు. ఈ సందర్బంగా వాలంటైన్ డే వ్యతిరేక పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో వీహెచ్పీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, మహంకాళి విభాగ్ కన్వీనర్ జీవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
'వాలెంటైన్స్' డేకు నిరసనల సెగ
హైదరాబాద్: వాలెంటైన్స్డేకు నిరసనగా హైదరాబాద్ వ్యాప్తంగా భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కోఠి, అబిడ్స్, వైఎంసీఏ సర్కిల్లతోపాటూ మరిన్ని ప్రాంతాల్లో భజరంగ్దళ్ కార్యకర్తలు వాలెంటైన్స్ డే గ్రీటింగ్లు, వాలెంటైన్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఆందోళన చేస్తున్న భజరంగ్దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నెలకొన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని పార్క్లు, రద్దీ ప్రాంతాలు, ప్రేమికులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement