-
అక్కడ వందల కోట్ల స్కాం జరిగింది: ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. బాల్కొండలో వందల కోట్ల స్కామ్ జరిగిందని అరవింద్ ఆరోపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండలో వందల కోట్ల స్కాం జరిగింది. బట్టాపూర్లో శ్రీకాంత్, వంశీరెడ్డి అక్రమంగా క్వారీక్రషర్లు నడుపుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఐదేళ్లు నడిపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రూ.51లక్షల కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు. సామాన్యుడు రూ.2వేలు విద్యుత్ ఛార్జీ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు. దీనికి మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలి అని సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
* 3 గంటలు వేచి చూసినా నాడి పట్టి చూడని వైద్యులు * మృత్యువుతో పోరాడి ఓడిన కేన్సర్ బాధితురాలు సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన బి.గంగు(62) తరచూ తలనొప్పి వస్తుండటంతో 45 రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుంది. వైద్యులు బ్రెయిన్ కేన్సర్గా నిర్ధారించారు. గత జూలై 27న ఆమె ఆస్పత్రిలో చేరింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు‘రోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది.. మా వల్ల కాదు.. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ వైద్యులు బంధువులకు సూచించారు. కుమారుడు ఆంజనేయులు అచేతనస్థితిలో ఉన్న తల్లి దుస్థితిని చూసి తల్లడిల్లిపోయాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని తల్లిని అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించాడు. ఉదయం 7.30 గంటలకు అత్యవసర విభాగానికి చేరుకున్నాడు. ఇక్కడ కేన్సర్ విభాగం లేదని.. ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. ఆలస్యం చేయకుండా అదే అంబులెన్స్లో ఉదయం 8.30 గంటలకు ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఓపీ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతే అడ్మిట్ చేస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. మృత్యువుతో పోరాడుతున్న తల్లిని అంబులెన్స్ డ్రైవర్కు అప్పగించి ఆంజనేయులు ఓపీకి చేరుకున్నాడు. వెంటిలేటర్ లేకపోవడంతో డ్రైవర్ నెబులైజర్ పంప్ ద్వారా ఆమెకు కృత్రిమ శ్వాస అందిస్తున్నాడు. ఓపీ వద్ద భారీ క్యూ ఉంది. ఎమర్జెన్సీ అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. క్యూలో నిలబడి చీటి రాయించుకునే సరికి సమయం 11.10 గంటలైంది. ఆంజనేయులు అంబులెన్స్ వద్దకు చేరుకునేలోపే తల్లి కన్నుమూసింది. అప్పటికీ ఒక్క వైద్యుడు కూడా అటు వైపు రాలేదు. ఇలా ఒక్క గంగూ మాత్రమే కాదు కేన్సర్తో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రికి చేరుకుంటున్న వందల మంది నిరుపేద రోగులది ఇదే దుస్థితి. బోలెడు ఆశతో ఆస్పత్రిలో అడుగు పెట్టిన కేన్సర్ బాధితులు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందుతున్నారు. ఇలా వారానికి సగటున ముగ్గురు రోగులు విగత జీవులవుతున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కనిపించని క్యాజువాల్టీ... ప్రతిష్టాత్మక కేన్సర్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు క్యాజువాల్టీ లేకపోవడం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపుతూ చేతులు దులుపుకుంటున్నారు. అదేమంటే కేన్సర్ ఎమర్జెన్సీ వైద్యం కాదు కదా! అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుతుండటం కొసమెరుపు. ‘కేన్సర్ నొప్పి కంటే వైద్యులు, సిబ్బంది వ్యవహార శైలే మమ్మల్ని ఎక్కువ బాధిస్తోంది. ఇక్కడ పని చేస్తున్న వైద్యులు కనీసం రోగి నాడి పట్టి చూసిన పాపాన పోవడం లేదు’అని ఖమ్మం జిల్లాకు చెందిన కేన్సర్ బాధితుడు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.‘వైద్యులు రాసిన మందుల చీటి తీసుకుని ఫార్మసీకి వెళ్తే మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రి ఎదురుగా ఉన్న మెడికల్ షాపులో దొరుకుతాయి కొనుక్కో’అంటూ ఫార్మసిస్టులు ఉచిత సలహా ఇస్తున్నారని మియాపూర్కు చెందిన కేన్సర్ బాధితురాలు సురేనా ఆరోపించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
భారతదేశం మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
KKR vs MI: కేకేఆర్తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
'నోటాకు ఓటు వేయండి': ఇండోర్ ఓటర్లకు కాంగ్రెస్ విజ్ఞప్తి
బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ.. సొంతూళ్లకు ఓటర్లు
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
తప్పక చదవండి
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement