-
50 అడుగుల ఎత్తైన ప్రహరీగోడ- సాయుధ ప్రైవేటు సైన్యం!
బల్వారా: హర్యానాలోని బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్పాల్కు అతి పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యమే ఉంది. ఆయనకు చెందిన సత్యలోక్ ఆశ్రమం వద్ద శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్రం 500 పారామిలటరీ బలగాలను తరలించిందంటే ఆ సామ్రాజ్యం ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆశ్రమంలో రామ్పాల్ అనుచరులు 15వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆశ్రమం వద్దకు వెళితే ఆయన అనుచరులు పోలీసులపైనే తిరగబడ్డారు. అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసుల ఆదేశాలతో లోపల ఉన్న అనుచరులు తమతమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు. సాయుధ బలగాల సహాయంతో హర్యానా పోలీసులు బుధవారం సాయంత్రం రామ్పాల్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అతను ముఖానికి వస్త్రం అడ్డుపెట్టుకున్నాడు. అతనిని రేపు కోర్టులో హాజరుపరుస్తారు. అరెస్ట్ సందర్భంగా ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి రామ్పాల్ అధిపతి. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న బల్వారాలో అతని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి చుట్టూ 50 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ ఉంది. లోపల 12 ఎకరాల విశాల స్థలం. ముఖ్య అనుచరులకు ఏసీ గదులు. ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్న లెక్చర్ హాళ్లు ఉన్న ప్రధాన ఆశ్రమమనే ఆధునిక భవనంలో ఆయన నివాసం. అనుచరులు, సేవకులు, సాయుధ ప్రై వేటు సైన్యంతో పాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ కార్లు ఆయన సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీల్లో 25 లక్షలకు పైగా అనుచరులు, భక్తులున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని సమాచారం. ** -
ఎవరీ రామ్పాల్?
బల్వారా(హర్యానా): హర్యానాలో వివాదాస్పద స్వామీజీ రామ్పాల్ ఒక్కసారిగా మీడియాకెక్కారు. బల్వారా పట్టణంలోని స్వామిజీ ఆశ్రమం వద్ద మంగళవారం ఆయన అనుచరులకు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఇంతకీ ఈ స్వామిజీ ఎవరు? హర్యానాలోని సోనిపేట జిల్లా గోహనా తహసీల్ ధనానా గ్రామంలో 1951, సెప్టెంబరు 8 ఆయన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. రామ్పాల్ సింగ్ జతిన్ ఇంజినీరింగ్లో డిప్లోమా చేసి, హర్యానా నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్గా చేరారు. మొదటి నుంచీ ఆధ్మాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న రామ్పాల్ కొన్నాళ్లకే ఉద్యోగాన్ని వదిలి ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన అనుచరుల్లో నిమ్నవర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. హిందూ మతం బోధించే దేవుళ్లను పూజించడం, ఉపవాసాలు ఉండటం, తదితర మత కార్యక్రమాలు పాటించకూడదని ఆయన తన అనుచరులకు చెప్పేవారు. స్వామీజీపై కేసులే కేసులు! 1999లో రోహ్తక్ జిల్లాలోని కరోంతలో తొలి ఆశ్రమాన్ని ప్రారంభించిన రామ్పాల్ కొద్ది కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆశ్రమాలను ప్రారంభించారు. హిస్సార్ జిల్లా బర్వాలాలో ముఖ్య ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కరోంతలో తాను ప్రారంభించిన ఆశ్రమాన్ని ఆర్యసమాజ్ వర్గాలతో ఘర్షణల కారణంగా 2006లో బలవంతంగా మూసివేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ ఆశ్రమంలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి బుల్లెట్ గాయాలతో చనిపోవడం సంచలనమైంది. దాంతో పోలీసులు రామ్పాల్పై హత్యాకేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం ఆరోపణల కింద రెండేళ్లు జైళ్లో గడిపి, 2006లో బెయిల్పై విడుదలయ్యారు. ఆశ్రమ భూమికి సంబంధించి ఒక ఫోర్జరీ కేసు కూడా ఆయనపై నమోదైంది. 2013లో ఒక దాడి కేసుతో పాటు ప్రమీలాదేవి అనే ఆర్యసమాజ్ కార్యకర్త హత్య కేసు కూడా రామ్పాల్పై నమోదైంది. ఈ సంవత్సరం జూలైలో స్వామీజీ కోర్టుకు వెళుతుండగా, ఆయన అనుచరులు హిసార్ పట్టణంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను పంజాబ్, హర్యానా హైకోర్టు సుమోటోగా స్వీకరించి, కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆయనను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఈ నెల 5న ఆయనపై బెయిల్ పొందేందుకు వీల్లేని వారెంటును జారీ చేసింది. ఈ నెల 10, 17 తేదీలలోనూ ఆయన కోర్టుకు రావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలు చూపుతూ కోర్టుకు హాజరుకాలేదు. దాంతో 21వ తేదీలోపు ఆయనను కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గొడవలు మొదలయ్యాయి. **
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
ప్రముఖ సింగర్పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. షాకింగ్ విషయాలు రివీల్
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
నీట్ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Advertisement