-
తిరుచ్చి జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ
-
ఖాకీలకు సవాల్
సగటున మూడో రోజులకో దారుణహత్య... పట్టపగలు వణుకు పుట్టిస్తున్న బ్యాంకు దోపిడీలు... వరుసగా భారీ చోరీలు... ఘోరాలు... కరీంనగర్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరసామ్రాజ్యం విస్తరిస్తున్నతీరు కలవరపెడుతోంది. జిల్లా పోలీసు విభాగానికి సవాలు విసురుతోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: డిసెంబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 18 మంది కిరాతకంగా హత్యకు గురయ్యారు. గడిచిన మూడు నెలల్లోనే మూడు చోట్ల బ్యాంకు చోరీలు, ఒక దారి దోపిడీ హడలెత్తించింది. ఇదేమీ పట్టనట్లుగా పోలీసు యంత్రాంగం నేలవిడిచి సాము చేస్తోంది. శాంతిభద్రతలను పరిరక్షించే ప్రాథమిక కర్తవ్యాన్ని మరిచినట్లు సాదాసీదాగా ప్రవర్తిస్తోంది. మరోవైపు అనుచిత ప్రవర్తనతో తరచుగా విమర్శల పాలవుతోంది. ఇటీవల కోరుట్ల ఠాణాలో లాకప్డెత్ను తలపించిన నిందితు డు చంద్రయ్య ఆత్మహత్య... విద్యార్థి జేఏసీ నేత శ్రీరామ్పై కమాన్పూర్లో విచక్షణరహితంగా ప్రవర్తించిన తీరు పోలీసుల పరువును బజారుకీడ్చింది. చిన్నాచితక సంఘటనలకు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ల బ్రహ్మాస్త్రం ప్రయోగిం చే ఉన్నతాధికారులు ఆ రెండు కేసుల్లోనూ అ డ్డంగా ఇరుక్కున్నారు. అసలైన బాధ్యులను వెనుకేసుకొచ్చిన అపప్రథను నెత్తినేసుకున్నా రు. రాష్ట్రస్థాయిలో అందరినీ ఆకర్షించేందుకు అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు వనం వీడి జనంలోకి రావాలని చేపట్టిన ఁఅంతర్మథనంరూ. ఆరంభశూరత్వంగా బీర్పూర్లోనే ఆగిపోయింది. వరుసగా పెరిగిపోతున్న క్రైంరేటును కట్టడి చేసే దిశగా అధికారులు ప్రత్యేక కసరత్తు చేయకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా ఆత్మహత్యలు నమోదవుతున్న జిల్లాల్లో కరీంనగర్ రాష్ట్రంలో నంబర్వన్ స్థానంలో ఉంది. మరోవైపు దారుణహత్యలు జరుగుతున్న తీరు భయోతాత్పం కలిగిస్తోంది. హుజూరాబాద్లో అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారి టోనీ హత్య, ఇటీవల చిగురుమామిడిలో చిన్నారి లయశ్రీని బలిగొనటం, సారంగపూర్ మండలంలో చెర్లపల్లి, ఇటీవల మహాముత్తారం మండలంలో జరిగిన జంటహత్యలు, గోదావరిఖనిలో వీక్లీ మార్కెట్లో యువకుడు చక్రధర్ను కిరాతకంగా హతమార్చటం, వీణవంక మండలం నర్సింగపూర్లో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల బాలరాజు హత్య, అదే మండలం అయిలాబాద్లో తోట చంద్రయ్యను అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి పొడిచి చంపిన ఘటనలన్నీ వరుసగా కలకలం రేకెత్తించాయి. కుటుంబకలహాలు, వివాహేతర సంబంధాలు, భూతగాదాలతో పాటు రాజకీయ కక్షలు ఈ హత్యలకు పురిగొల్పాయి. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా కట్టుదిట్టంగా వ్యవహరించకపోతే ఈ నేరాలు.. ఘోరాలు మరింతగా జడలు విచ్చుకునే ప్రమాదముంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement