-
కఠినమైన శిక్షణలో మొదటి దశ దాటిన స్పెయిన్ యువరాణి
స్పెయిన్ సింహాసనానికి కాబోయే వారసురాలు ప్రిన్సెస్ లియోనోర్. అక్టోబర్ నెలతో ఆమెకు 18 ఏళ్లు నిండాయి. ఆ సందర్భంలో తన దేశ రాజ్యాంగానికి విధేయతతో ప్రమాణం చేసింది. సమయం వచ్చినప్పుడు రాణిగా అడుగులు వేసేందుకు ఆమె వారసత్వానికి పునాది వేసింది. అందుకు ఆమె మూడేళ్ల పాటు కఠినమైన శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో లియోనోర్ ఇప్పటికే తొలి అడుగులు వేశారు. తన శిక్షణకు సంబంధించిన మొదటి దశను అదిగమించి తదుపరి దశలోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తన తల్లిదండ్రులైన క్వీన్ లెటిజియా, కింగ్ ఫెలిపే ఇద్దరూ కలిసి తమ పెద్ద కుమార్తె అయిన లియోనోర్ను స్పెయిన్లోని అరగోన్లోని జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజా వద్ద వదిలివేశారు. స్పెయిన్ సింహాసనానికి వారసురాలు, కాబోయే రాణి అయిన 18 ఏళ్ల యువరాణి లియోనోర్, దేశ దేశాధినేతగా తన భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి అధికారికంగా మూడు సంవత్సరాల కఠనమైన సైనిక శిక్షణను తీసుకునేందుకు ఆమె రెడీ అయ్యారు. సైనిక్ స్కూల్లో చేరుతున్న సమయంలో తన తల్లిదండ్రులతో పాటు 16 ఏళ్ల సోదరి ప్రిన్సెస్ సోఫియాతో కలిసి అకాడమీకి వచ్చినప్పుడు ప్రిన్సెస్ లియోనార్ చాలా సంతోషంగా అక్కడ కనిపించారు. ఆమె తండ్రి కింగ్ ఫెలిపే సైనిక యూనిఫాం ధరించి, సైన్యం, నావికాదళం, స్పెయిన్ వైమానిక దళానికి చెందిన కెప్టెన్ జనరల్గా ఆమెకు సెల్యూట్ చేశాడు. కింగ్ ఫెలిపే స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా గతంలో బోర్బన్ సింహాసనాన్ని అందుకుంటున్న సమయంలో జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజాలో శిక్షణ పొందాడు. ప్రిన్సెస్ లియోనార్ అమ్మగారు అయిన క్వీన్ లెటిజియా కూడా అక్కడ సంతోషంగా కనిపించింది. లియోనార్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ సమయంలో లియోనార్ ఒక అధికారితో కరచాలనం చేస్తున్నప్పుడు ఒక తల్లిగా ఎంతో గర్వంగా చూసింది. తన కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికిన తర్వాత, యువరాణి అడుగులు అకాడమీ వైపు మెల్లిగా పడ్డాయి. ఆ సమయంలో తన సొంత సూట్కేస్ను కూడా ఆమె తీసుకుళ్లింది. యువరాణి అయినా కూడా అందరిలా ఎంట్రీ పుస్తకంలో తన పేరుతో పాటు సంతకం చేసి లోపలికి వెళ్లింది. లియోనార్ తన ప్రాథమిక విద్యను శాంటా మారియా డి లాస్ రోసేల్స్ స్కూల్లో పొందింది. ఆమె మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, ఆమె యునైటెడ్ కింగ్డమ్లోని వేల్స్లోని UWC అట్లాంటిక్ కాలేజీలో ఇంటర్నేషనల్ బాకలారియాట్ ప్రోగ్రామ్ను అభ్యసించింది. ఆ తర్వాత, 17 ఆగస్టు 2023న, లియోనార్ జనరల్ మిలిటరీ అకాడమీలో తన మూడేళ్ల సైనిక శిక్షణను ప్రారంభించింది. మొదటి స్టేజీ దాటుకున్న ఆమె తాజాగా కఠినమైన శిక్షణ తీసుకునేందకు సిద్ధం అయింది. లియోనార్ 2023-2024 విద్యా సంవత్సరానికి లేడీ క్యాడెట్గా శిక్షణ పొందుతుందని అక్కడి అధికారులు తెలిపారు. మరుసటి సంవత్సరం, ప్రిన్సెస్ లియోనార్ నేవీలో శిక్షణ పొందుతారు. మారిన్ నావల్ మిలిటరీ స్కూల్లో మిడ్షిప్మ్యాన్గా జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో ట్రైనింగ్ షిప్లో పని చేస్తుంది. ఆ తర్వాత 2025 నుంచి 2026 వరకు శాన్ జేవియర్ జనరల్ ఎయిర్ అకాడమీకి ఎన్సైన్ విద్యార్థిగా చేరి అక్కడ ఎయిర్ అండ్ స్పేస్ ఆర్మీతో తన కోర్సులను పూర్తి చేస్తారు. స్పెయిన్ సింహాసనానికి వారసురాలిగా ఎంపిక అయ్యేందకు ఈ తీవ్రమైన శిక్షణ తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఆమె తండ్రి కింగ్ ఫెలిప్ కూడా అనేక మిలిటరీ అకాడమీలలో శిక్షణ పొందాడు. సైన్యం, నేవీ నుంచి హెలికాప్టర్ పైలట్ వింగ్లలో తన పనితీరును కనపరిచారు. ఇంత కఠినమైన శిక్షణను ఆమె దాటుకుంటే ఆమె ఒక రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది. లియోనార్ సింహాసనాన్ని అధిరోహిస్తే.. ఆమె 1833 నుంచి 1868 వరకు పాలించిన తన 4వ తరం నానమ్మ అయిన ఇసాబెల్లా II తర్వాత స్పెయిన్ మొదటి రాణి అవుతుంది. సుమారు 160 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం నుంచి ఒక మహిళ మరోసారి యువరాణిగా అడుగుపెట్టబోతుంది. భవిష్యత్లో లియోనోర్.. స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్గా పని చేసే బాధ్యత కూడా దక్కుతుంది. లియోనోర్ సైనిక శిక్షణ ప్రాముఖ్యత గురించి స్పానిష్ రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ ఇలా అన్నారు, "యువరాణి జీవితంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం... మన దేశం నాయకత్వం సంబంధించి ఇదొక ముఖ్యమైన అడుగు" అని తెలిపారు. లియోనోర్ మూడేళ్ల పాటు శిక్షణ అనంతరం స్పెయిన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, స్పేస్ కమాండ్లో లెఫ్టినెంట్గా ఉంటారు. అలాగే నేవీలో ఎన్సైన్గా ఉంటారు. స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించడానికి ముందు వారి వారసులు సైనిక అనుభవాన్ని పొందడం గొప్ప రాజ సంప్రదాయం. బెల్జియం యువరాణి ఎలిసబెత్ 2020-2021 విద్యా సంవత్సరాన్ని బ్రస్సెల్స్లోని రాయల్ మిలిటరీ అకాడమీలో గడిపారు, స్వీడన్కు చెందిన క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా 2022లో స్వీడిష్ సాయుధ దళాలతో శిక్షణను పొందారు. ప్రిన్సెస్ లియోనార్ అక్టోబర్ 31, 2005న స్పెయిన్లోని మాడ్రిడ్లో ప్రస్తుత చక్రవర్తి, కింగ్ ఫెలిపే VI, క్వీన్ లెటిజియా దంపతులకు జన్మించారు. ఆమెలో దాగి ఉన్న విశేషమైన తెలివితేటలు స్పానిష్ ప్రజల హృదయాలను దోచుకున్నాయి, రాజ కుటుంబం ప్రతిష్టను నిలబెట్టే వారసురాలు పుట్టిందని వారు సంబరపడ్డారు. ప్రత్యేకించి ఆమె తాత, మాజీ రాజు జువాన్ కార్లోస్ వివాదాల తర్వాత 2014లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆమె తండ్రి సింహాసనాన్ని అధిష్టించారు. తాజాగా లియోనోర్కు స్పానిష్ కిరీటం అందనుంది. వారి కుటుంబ నిబంధనల ప్రకారం ఆమె శిక్షణ పొంది భవిష్యత్లో స్పైయిన్ రాణిగా అవతరించడమే కాకుండా దేశ పరిరక్షణలో భాగం పంచుకోనుంది. View this post on Instagram A post shared by Princesa Leonor💕Infanta Sofía (@leonorandsofia) La Princesa de Asturias, acompañada por los Reyes y la Infanta Sofía, firma en el libro de honor de la Academia General Militar, donde hoy dará comienzo a su formación castrense. ➡️https://t.co/1hhg1pw3f3 pic.twitter.com/g95HgK5pnq — Casa de S.M. el Rey (@CasaReal) August 17, 2023 -
మెస్సీకి జైలు శిక్ష
♦ పన్ను ఎగవేత కేసులో 21 నెలలు విధించిన బార్సిలోనా కోర్టు ♦ ఉన్నత న్యాయస్థానం రద్దు చేసే అవకాశం! బార్సిలోనా : పన్ను ఎగవేత కేసులో అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ, అతని తండ్రి జార్జ్ హోరాసియో మెస్సీని బార్సిలోనా కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో ఇద్దరికి 21 నెలల జైలు శిక్షతో పాటు మెస్సీకి 2.09 మిలియన్ యూరోలు (రూ. 15 కోట్లు), జార్జ్కు 1.6 మిలియన్ యూరోలు (రూ. 12 కోట్లు) జరిమానా విధించింది. అయితే స్పెయిన్లో అహింస నేరాలకు సంబంధించిన కేసులో రెండేళ్ల కంటే తక్కువ శిక్ష పడితే వాటిని ఉన్నత న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణం. బార్సిలోనా కోర్టు విధించిన శిక్షను కూడా స్పెయిన్ సుప్రీంకోర్టులో మెస్సీ, జార్జ్లు అప్పీలు చేయనున్నారు. 2007-09 వరకు ఇమేజ్ రైట్స్ (చిత్రం వాడుకున్నందుకు) వల్ల తనకు వచ్చిన ఆదాయం 4.16 మిలియన్ యూరో (రూ. 31 కోట్లు)లకు పన్ను చెల్లించలేదని కోర్టు తెల్చింది. బెలిజ్, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఉరుగ్వేలోని పలు కంపెనీలను ఉపయోగించి తండ్రీకొడుకులు ఈ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించింది. ఇమేజ్ రైట్స్తో పాటు డానోన్, అడిడాస్, పెప్సీ కోలా, ప్రోక్టర్ అండ్ గాంబ్లీ (కువైట్ ఫుడ్ కంపెనీ) వంటి కంపెనీలతో ఉన్న ఒప్పందాలను కూడా మెస్సీ దాచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే నాలుగు రోజుల విచారణలో మెస్సీపై మూడు అభియోగాలు నమోదు చేశారు. చిన్నప్పట్నించి తన ఆర్థిక లావాదేవీలను తండ్రి జార్జ్ చూస్తున్నారని, ఆయనపై నమ్మకంతోనే ఏదీ పట్టించుకోలేదని మెస్సీ కోర్టుకు తెలిపాడు. ఇదే విషయాన్ని మెస్సీ తరఫు న్యాయవాదులు కూడా వినిపించారు. ఆదాయ వ్యయాల్లో మెస్సీ కలుగజేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ మెస్సీకి తెలుసని, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని స్టేట్ అటార్నీ (ట్యాక్స్) మరియో మాజా వాదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. 2013 ఆగస్టులో కూడా ఓ పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న మెస్సీ, జార్జ్... దర్యాప్తు తర్వాత స్వచ్ఛందంగా 5 మిలియన్ యూరోలు చెల్లించారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement