-
బజ్ బాల్ బద్దలైంది.. అతడే ఇంగ్లండ్ కొంపముంచాడు: సెహ్వాగ్
భారత పర్యటనను ఇంగ్లండ్ జట్టు ఘోర ఓటమితో ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బాజ్ బాల్ అంటూ వీరవీగ్రుతన్న ఇంగ్లండ్ జట్టు ఆఖరి టెస్టులో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత దెబ్బకు ఇంగ్లండ్ బజ్ బాల్ పగిలిపోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 1-4 తేడాతో భారత్కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బజ్ బాల్ విధానంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. "భారత్ దెబ్బకు ఇంగ్లండ్ బాజ్ బాల్ బద్దలైంది. వారు ఆప్రోచ్ సరైనది కాదు. పిచ్చికి కూడా ఓ పద్దతి ఉంటుంది. ఇంగ్లండ్ తమ స్ధాయికి తగ్గట్టు ఆడలేకపోయింది. రెండో టెస్టు ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. కెప్టెన్ స్టోక్స్ విఫలమవడం వారి కష్టాలను మరింత రెట్టింపు చేసింది. ఇంగ్లండ్ ఇంకా బజ్బాల్ భ్రమలోనే ఉన్నారు. వారు ఈ విధానంతోనే విజయవంతం కావాలంటే ఒక పద్దతి, ప్రణాళిక ఉండాలని" ఎక్స్లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. -
Rohit Sharma: స్టోక్స్కు ఇదే తొలిసారి.. రోహిత్ రికార్డులివే!
విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ.. కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేకున్నా యువ జట్టుతో టీమిండియాకు అద్భుత విజయం అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. విరాట్, షమీ సిరీస్ మొత్తానికి.. గాయం కారణంగా రాహుల్ రెండో టెస్టు నుంచి జట్టుకు దూరం కాగా... నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మినహా అంతగా అనుభవంలేని జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ రసవత్తర మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, శుబ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్లో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో గెలిచింది. సొంతగడ్డపై వరుసగా పదిహేడవ సిరీస్ విజయం సాధించింది. బజ్బాల్ యుగంలో తొలి కెప్టెన్గా ఘనత దీనికంతటికి రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభే కారణమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘బజ్బాల్’ యుగంలో ఇంగ్లండ్ను వరుసగా మూడు మ్యాచ్లలో ఓడించిన కెప్టెన్, బెన్ స్టోక్స్కు తొలి సిరీస్ పరాజయం పరిచయం చేసిన సారథి(ROHIT SHARMA BECOMES THE FIRST CAPTAIN TO WIN A TEST SERIES AGAINST BAZBALL ERA)గా అరుదైన ఫీట్ నమోదు చేశాడంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసి ఇదిలా ఉంటే.. రాంచి టెస్టు సందర్భంగా రోహిత్ శర్మ వ్యక్తిగతంగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొమ్మిది వేల పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అయితే, మ్యాచ్ ఫలితాన్ని తేల్చే కీలకమైన రెండో ఇన్నింగ్స్లో మాత్రం విలువైన అర్ధ శతకం(55) బాదాడు రోహిత్. తద్వారా ఫస్ట్క్లాస్ క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. అదే విధంగా టెస్టు మ్యాచ్లో నాలుగు వేల రన్స్కు పైగా స్కోరు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 17వ భారత బ్యాటర్గా నిలిచాడు. అంతేకాదు.. ఇంగ్లండ్పై వెయ్యి పరుగుల మార్కును కూడా దాటేశాడు హిట్మ్యాన్. చదవండి: Virat Kohli: టీమిండియా గెలుపుపై స్పందించిన కోహ్లి.. పోస్ట్ వైరల్ -
దుబాయ్ ట్రిప్ కొంపముంచిందా?.. బజ్బాల్ భయపడిందా?
బజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా భయాన్ని పరిచయం చేసింది. గత కొంతకాలంగా ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా సంప్రాదాయ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇంగ్లీష్ జట్టు.. భారత్ ముందు మాత్రం తలవంచింది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగపెట్టిన ఇంగ్లండ్.. తొలి మ్యాచ్లో గెలుపొంది తామే టెస్టు క్రికెట్ రారాజులమని చెప్పకనే చెప్పింది. కానీ ప్రత్యర్ధి ఎవరన్నది ఇంగ్లండ్ మర్చిపోయింది. అదే ఇంగ్లండ్ చేసిన పెద్ద తప్పు. రెండో టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. వైజాగ్ టెస్టులో పర్యాటక జట్టును టీమిండియా చిత్తు చేసింది. విధ్వంసం సృష్టించే ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాట్లు మూగబోయాయి. భారత పేస్ గుర్రం బుమ్రా దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు గజగజలాడారు. ప్రత్యర్ధి కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం బుమ్రా బౌలింగ్కు ఫిదా అయిపోయాడు. అయితే తొలి రెండు టెస్టులు ఒక లెక్క.. రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు ఒక లెక్క. రాజ్కోట్లో రారాజు.. ఇంగ్లండ్ జట్టుకు రాజ్కోట్ టెస్టు ఎప్పటికి గుర్తిండిపోతుంది. టీమిండియా దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. 550 పరుగుల పైగా లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అస్సలు మనం చూస్తుంది ఇంగ్లండ్ జట్టునేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. భారత స్పిన్ వ్యూహంలో చిక్కుకుని ఇంగ్లీష్ బ్యాటర్లు విల్లావిల్లాడారు. జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ దాటికి ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఎక్కడో లోయార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన మార్క్ వుడ్(33) మినహా.. ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడు కూడా భారత బౌలర్లకు ఎదురుతిరగలేదు. గెలుపు విషయం పక్కన పెడితే కనీసం డ్రా అయినా చేసుకుందమన్న భావన ఏ ఒక్కరిలోనూ కన్పించలేదు. క్రీజులో కంటే డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే బెటర్ అన్నట్లు వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. ఎప్పుడో 1934లో టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా ఘోర ఓటమిని చూవిచూసిన ఇంగ్లండ్కు.. మళ్లీ ఇప్పుడు భారత్ పుణ్యాన ఘోర పరభావాన్ని చవిచూసింది. కచ్చితంగా ఈ ఓటమిపై ఇంగ్లండ్ జట్టుతో పాటు మేనెజ్మెంట్ ఆత్మ పరిశీలిన చేసుకోవాలి. చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీలు, మీడియా సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. టెస్టు క్రికెట్కు వైట్బాల్ క్రికెట్ తేడా ఉంటుందన్న విషయాన్ని ఇంగ్లండ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్లోనూ అదే కథ.. ఇంగ్లండ్కు బ్యాటింగ్ ఎంతో బలమో.. బౌలింగ్ కూడా అంతే బలం. జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్ వంటి పటిష్టమైన బౌలింగ్ విభాగం సైతం చేతులేత్తేసింది. ముఖ్యంగా వరల్డ్క్లాస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అయితే గల్లీ బౌలర్ కంటే దారుణంగా విఫలమయ్యాడు. టెస్టుల్లో దాదాపు 700 వికెట్లు పడగొట్టిన అండర్సన్ను 22 ఏళ్ల యువ ఆటగాడు జైశ్వాల్ ఊచకోత కోశాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్లో 13 ఓవర్లు వేసిన అండర్సన్.. 6 ఏకానమితో 78 పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో పాటు మరో స్పీడ్ స్టార్ మార్క్ వుడ్ది కూడా అదే పరిస్థితి. వుడ్ కూడా తన మార్క్ను చూపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ వుడ్కు చుక్కలు చూపించాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే.. అరంగేట్ర టెస్టులోనే తన స్పిన్ మాయాజాలంతో అకట్టుకున్న టామ్ హార్ట్లీ తర్వాతి మ్యాచ్ల్లో భారత బ్యాటర్ల ముందు దాసోహం అయ్యాడు. అడపదడపా వికెట్లు పడగొట్టి దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులో ఎందుకు ఉన్నాడో అర్దం కావడం లేదు. తొలి టెస్టులో కాస్త పర్వాలేదన్పించిన అహ్మద్.. ఆఖరి రెండు టెస్టుల్లో మాత్రం కనీస ప్రభావం చూపలేకపోయాడు. వికెట్లు విషయం పక్కన పెడితే పరుగులు కట్టడి చేయడంలో కూడా అహ్మద్ విఫలమయ్యాడు. అయితే సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ లేని లోటు ఇంగ్లండ్ జట్టులో సృష్టంగా కన్పిస్తోంది. ఇక రాంఛీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో ఇంగ్లీష్ జట్టు ఏ మెరకు పుంజుకుంటుందో మరి చూడాలి. దుబాయ్ ట్రిప్ కొంపముంచిందా? కాగా మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుకు పది రోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు రీ ఫ్రెష్మెంట్ పేరిట దుబాయ్కు పయనమైంది. ఇదే ఇంగ్లండ్ కొంపముంచిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ గ్యాప్లో భారత్లోనే ఉండి ప్రాక్టీస్ చేసి ఉంటే పరిస్ధితి మరో విధంగా ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడో టెస్టుకు కేవలం ఒక్కరోజు ముందే రాజ్కోట్కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు హడావుడిగా బరిలోకి దిగింది. కనీసం ప్రాక్టీస్ లేకుండానే ఆడిన ఇంగ్లండ్కు సరైన గుణపాఠం భారత్ చెప్పింది. ఇంతకుముందు ఏ పర్యటక జట్టు కూడా భారత్కు వచ్చి విశ్రాంతి పేరిట బయటకు వెళ్లింది లేదు. ఇంగ్లండ్ మాత్రం ఈ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. -
భారత్ కొంపముంచిన బజ్ బాల్...!
-
బజ్బాల్ ఆడితే మాకే మంచిది.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ఖతం చేస్తాం: సిరాజ్
భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా గురువారం(జనవరి 25) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ అయితే మ్యాచ్కు ఒక రోజే ముందే తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. అనూహ్యంగా ఇంగ్లీష్ జట్టు కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్తో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టుకు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. స్పీడ్ స్టార్ మార్క్ వుడ్కు తుది జట్టులో ఇంగ్లండ్ మేనెజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఇక మొదటి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బజ్బాల్ క్రికెట్ను ఉద్దేశించి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి ఉపఖండ పరిస్థితులలో బాజ్బాల్ విధానాన్ని ఎంచుకుంటే ఇంగ్లీష్ జట్టుకు కష్టాలు తప్పవు అని సిరాజ్ హెచ్చరించాడు. "ఒక వేళ ఇంగ్లండ్ భారత పరిస్థితుల్లో బజ్బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఒకటిన్నర రోజు లేదా రెండు రోజుల్లోనే ముగుస్తుంది. ఉపఖండంలో ఉన్న పిచ్లపై ప్రతి బంతిని బాదడం కుదరదు. బంతి కొన్నిసార్లు ఎక్కువగా టర్న్ అవుతోంది. మరి కొన్ని సార్లు స్ట్రైట్గా వస్తోంది. కాబట్టి ఇంగ్లండ్ బజ్ బాల్ ఆడితే మాకే మంచిది. ఎందుకంటే మ్యాచ్ త్వరగా ముగుస్తుందని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 202: కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
ఏపీ పరిశ్రమలపై ఈనాడు విషం.. అసలు విషయం ఇదే!
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement