-
ఆర్.కృష్ణయ్యకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు.. ‘బాబు యవ్వారం విడ్డూరంగా ఉంది’
ముషీరాబాద్ (హైదరాబాద్): తమది బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకునే తెలు గుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఆర్.కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థిత్వంపై కుట్రలకు తెరలేపడం ఆయన స్థాయికి తగదని పలు బీసీ సంఘాలు ధ్వజమెత్తాయి. గత 4 దశాబ్దాలుగా బీసీల హక్కుల సాధనకు ఉద్యమాలే ఊపిరిగా జీవితం గడుపుతున్న ఆర్.కృష్ణయ్యను.. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయిస్తే చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వారు దుయ్యబట్టారు. కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికైతే బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ దూరం అవుతారోననే భయంతోనే చంద్రబాబు విషం కక్కుతున్నారని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం జాతీ య బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జకృష్ణ, ఏపీ యూత్ అధ్యక్షుడు బోన్ దుర్గానరేశ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్కోటితోపాటు పలు సం ఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలకు ఏనాడూ న్యా యం చేయలేదని, బీసీల పట్ల కపట ప్రేమను ఒలకపోశారని మండిపడ్డారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ప్రకటించిన చంద్రబాబు, ఆ తరువాత టీడీపీ శాసన సభా పక్ష నేతగా ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70 శాతం పదవులు కేటాయిస్తే చంద్రబాబుకు కుళ్లు ఎందుకని ప్రశ్నించారు. కృష్ణయ్యపై విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీ మరింత దిగజారడం ఖాయమని అన్నారు. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలంతా జగన్మోహన్రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటారని స్పష్టం చేశారు. -
ఈబీసీ కోటాకు వ్యతిరేకంగా ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా
-
బీసీలకు 65 శాతం టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 శాతం అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటిపార్టీసహా 22 బీసీ సంఘాలు, 64 బీసీ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మంగళవా రం అఖిల పక్షాలు, బీసీ సంఘాల సమావేశంలో ఎల్.రమణ(టీడీపీ), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), దిలీప్కుమార్(టీజేఎస్), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటిపార్టీ), రాజేందర్ (ఎంఐఎం) ప్రసంగించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో బీసీలకు 65శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్, కాంగ్రెస్ భరతం పడతామని హెచ్చరించారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గంలో 60 నుంచి 70 శాతం బీసీ జనాభా ఉందని, బీసీలకు టికెట్లు ఇస్తే వారే గెలుపుగుర్రాలని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇప్పటికే బీసీ బిల్లుకు మద్దతుగా ప్రధానమంత్రికి లేఖ రాశామన్నారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ తమ పార్టీ ఇప్పటికే బీసీలకు 50 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించినట్టుగా గుర్తుచేశారు. బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో బీసీలకు కేటాయించిన బడ్జెట్లో 50 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలకు అన్యా యం చేస్తున్నాయని, ఇది సరైన విధానం కాదని విమర్శించారు. టీజేఎస్ నేత దిలీప్కుమార్ మాట్లాడుతూ పార్టీ పదవుల్లో తమ పార్టీ ఇప్పటికే బీసీలకు 50శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, గొరిగే మల్లేశ్, నీల వెంకటేశ్, రమ్య, వేముల రామకృష్ణ, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
రచ్చకెక్కిన టీడీపీ విభేదాలు
ఉయ్యూరు: టీడీపీలో చైర్మన్పై అవిశ్వాస వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జంపాన పూర్ణచంద్రరావు (పూల)కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనతో టీడీపీ పరువు రోడ్డున పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరించే జంపాన కుటుం బం బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కి చంద్రబాబు, ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే బోడె, ఎమ్మెల్సీ వైవీబీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో కౌంటర్గా టీడీపీ ముఖ్యనేతలు మీడియా సమావేశం పెట్టి సమర్ధించుకునే పనిలోపడ్డారు. అయితే చైర్మన్ పూల తిరుగుబాటు జెండా ఎగురవేయడం, టీడీపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపైనే చర్చ జరుగుతోంది. ప్రదర్శన అడ్డగింపు.. ఉద్రిక్తత! మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు (పూల)పై అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ శ్రేణులతో పాటు ఆ సంఘ నాయకులు ర్యాలీకి ఉపక్రమించారు. సమాచారం అందుకున్న పోలీసులు చైర్మన్ను కలిసి ర్యాలీకి అనుమతి లేదని, సమావేశాన్ని తన అపార్ట్మెంటులోనే నిర్వహించుకుని మీడియాతో మాట్లాడుకోవాలని విన్నవించారు. ఈ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శొంఠి నాగరాజు అక్కడకు చేరుకుని శాంతియుత ప్రదర్శనకు అనుమతి ఏంటంటూ చైర్మన్తో కలిసి రోడ్డెక్కారు. సీఐ సత్యానందం నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ప్రదర్శనగా వెళ్లకుండా పూల మద్దతుదారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాదులాటలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసుల దురుసు ప్రవర్తనపై బీసీ సంఘాల ప్రతినిధులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో చివరకు సెంటర్ వరకు ప్రదర్శనను అనుమతించకతప్పలేదు. బీసీల సత్తా చూపుతాం బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఆ వర్గాలకే టీడీపీ అన్యాయం చేస్తుందని టీడీపీకి చెందిన చైర్మన్ పూల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చైర్మన్గా పీఠమెక్కించి నాలుగేళ్లు నరకం చూపించారు. ఏ ఒక్కరోజు నన్ను పాలన చేసుకోనివ్వలా.. అన్నీ అవాంతరాలే.. ప్రతి పనికీ ఎమ్మెల్యే అనుమతంటూ ఇబ్బందులు పెట్టారు.. నా సొంత నిర్ణయమంటూ ఏమీ లేదు.. టీడీపీ ముఖ్యనాయకులే పాలించుకున్నారు.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలోనే ఉంటే నాపై అవిశ్వాసం పెట్టి దింపేస్తానంటారా.. ఇదేనా బీసీలకు టీడీపీలో జరిగే న్యాయం’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు జిల్లాలో ఏ గౌడ కులస్తులను ఎదగనివ్వరన్నారు. ఎమ్మెల్యే కాగిత వెంకట్రావును అణగదొక్కినట్లే తనను కూడా ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపైనా విమర్శలు గుప్పించారు. అవిశ్వాసం వెనక్కి తీసుకోకుంటే రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చూపుతామన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి ఖుద్దూస్కు చైర్మన్ ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. చంద్రబాబూ.. ఖబడ్దార్.. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శొంఠి నాగరాజు మాట్లాడుతూ, బీసీల జోలికొస్తే ఖబద్దార్ అంటూ హెచ్చరించారు. టీడీపీలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. బీసీల పేరు చెప్పుకుని గద్దెనెక్కి బీసీ చైర్మన్పైనే అవిశ్వాసం పెట్టిస్తావా అని ప్రశ్నించారు. 13 జిల్లాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అవిశ్వాసం వెనక్కు తీసుకోకుంటే 2019 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పూలను బరిలోకి దించి టీడీపీని ఓడిస్తామని స్పష్టం చేశారు. -
కలెక్టర్ బదిలీ అయ్యేంత వరకు ఉద్యమం
– బీసీ సంఘాల హెచ్చరిక కర్నూలు(అర్బన్): అధికార దర్పంతో జిల్లాలో నియంతగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ను జిల్లా నుంచి బదిలీ చేసేంత వరకు దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తామని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. జిల్లాలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా, కలెక్టర్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. లక్ష్మినరసింహ, ఉపాధ్యక్షుడు టీ. శేషఫణి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్ను కలవాలని బంగ్లా వద్ద వేచివున్నా, పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆయన నిరంకుశ వైఖరిని ఎత్తి చూపుతున్నదని వారు నినదించారు. ప్రజల బాధలను పట్టించుకోని కలెక్టర్ తమకు వద్దన్నారు. ఆయన విధుల్లోకి చేరినప్పటి నుంచి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులను వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ నెల 14న కలెక్టరేట్లో రెవెన్యూశాఖకు చెందిన ఓ ఉద్యోగి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసి కోరతామన్నారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబు, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య, బీసీ నాయకులు దేవపూజ ధనంజయాచారి, సింధు నాగేశ్వరరావు, జలం శ్రీను, బహుజన సేవా సంఘం అధ్యక్షుడు సుబ్బరాయుడు, విజయ్కుమార్, మారెప్పయాదవ్, కృష్ణమూర్తి యాదవ్, బాలసంజన్న, దండు శేషుయాదవ్, మద్దిలేటియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement