-
ప్రైవేటు మెడికల్ సీట్లలో స్థానిక రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా బీ కేటగిరీ సీట్లలో స్థానికులకు (తెలంగాణ ప్రాంతం వారికి) 85% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా ఉంటుంది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ శాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా బీ కేటగిరీ కింద 35 శాతం సీట్లు (మైనారిటీ కాలేజీల్లో 25 శాతం సీట్లు) కేటాయిస్తారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇందులో 85% తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24 ప్రైవేటు మెడికల్ కళాశాలలుండగా, వాటిల్లో 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు లభించనున్నాయి. అదనపు సీట్లు ఇలా.. రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 3,750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లున్నాయి. ఆ సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు నీట్ ర్యాంకు ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పటివరకు ఉంది. కానీ ప్రస్తుతం సవరించిన నిబంధనలతో బీ కేటగిరీలో ఉన్న 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగతా 15 శాతం (168) సీట్లకు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడే వీలు ఉంటుంది. ఓపెన్ కోటా కాబట్టి ఇందులోనూ తెలంగాణ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనారిటీ కాలేజీలో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. ఇతర రాష్ట్రాల వారికి చెక్ ఇప్పటివరకు బీ కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు ఎక్కువ ఫీజు చెల్లించి ఎన్ఆర్ఐ కోటా సీట్లను కొనుగోలు చేయాల్సి వచ్చేది. బీ కేటగిరీ ఫీజుకు రెండింతలు ఎన్ఆర్ఐ కోటా సీట్లకు చెల్లించాల్సి వచ్చేది. లేదా ఇతర రాష్ట్రాలకు, ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఎక్కువ ఫీజుతో చేరాల్సి వచ్చేది. దీనిపై మంత్రి హరీశ్రావు ఆదేశం మేరకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుండి అన్ని బీ కేటగిరీ సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేయడం గమనార్హం. రాష్ట్రంలోనే డాక్టర్ కల సాకారం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేస్తున్న క్రమంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ స్థానిక విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బీ కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 85 శాతానికి పెంచి తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. డాక్టర్ కావాలనే కలను రాష్ట్రంలోనే ఉండి చదివి సాకారం చేసుకోవాలనుకునే ఎంతోమందికి దీనిద్వారా గొప్ప అవకాశం కల్పించింది. – హరీశ్రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
వైద్యకోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. https://ug.ntruhsadmissions.com వెబ్సైట్లో ప్రాధాన్యత క్రమంలో అన్ని కళాశాలలకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేయాలి. అన్ని విడతల కౌన్సెలింగ్లలో సీట్ల కేటాయింపునకు ఈ ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆప్షన్ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆప్షన్లు నమోదు చేసి సబ్మిట్ చేసే సమయంలో రిజిస్టర్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్చేసి సబ్మిట్ చేయాలి. ఏ కళాశాలలో సీటు లభించిందన్న సమాచారం విద్యార్థుల మొబైల్ ఫోన్కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురైతే 7416563063, 7416253073, 8333883934, 9063500829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. సలహాలు, సందేహాలకు 08978780501, 07997710168 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
బాలురే బాద్షాలు
- ఎంసెట్-2 టాప్-10లో ఆరుగురు వారే - రంగారెడ్డి జిల్లా వాసికి ఫస్ట్ ర్యాంకు - ఈ నెల 16 నుంచి వెబ్సైట్లో ఓఎంఆర్ పత్రాలు - 21 నుంచి ర్యాంకు కార్డుల డౌన్లోడ్కు అవకాశం - 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. ఆగస్టు మొదటి వారంలో అడ్మిషన్లు - ఎంబీబీఎస్లో 1,780, బీడీఎస్లో 640 సీట్లు - ర్యాంకులు విడుదల చేసిన మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2లో బాలురు సత్తా చాటారు. టాప్-10 ర్యాంకుల్లో ఆరుగురు వారే ఉన్నారు. ఉత్తీర్ణతపరంగా మాత్రం బాలికలు కాస్త ముందంజలో నిలిచారు. ఎంసెట్-2 ర్యాంకులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ శైలజా రామయ్యర్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎంసెట్ స్కోర్కు 75%.. ఇంటర్ మార్కులకు 25% ఎంసెట్-2కు మొత్తం 56,153 మంది దరఖాస్తు చేసుకోగా ఈ నెల 9న జరిగిన పరీక్షకు 50,961 మంది హాజరయ్యారు. అందులో 47,644 మంది (93.49 శాతం) ర్యాంకులు పొందారు. మొత్తంగా 48,205 మంది అర్హత సాధించినా.. 134 మంది ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. మరో 427 మంది విద్యార్థుల ఇంటర్మీడియెట్ వివరాలు ఎంసెట్ కమిటీకి అందలేదు. దీంతో వారిని మినహాయించి 47,644 మందికి ర్యాంకులను కేటాయించారు. ఎంసెట్ స్కోర్కు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి కంబైన్డ్ స్కోర్ను నిర్ణయించారు. దాని ఆధారంగా ర్యాంకులు ఖరారు చేశారు. తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 95 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారిలో 16,722 మంది బాలురు ఉండగా.. వారిలో 15,577 మంది (93.15 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. ఇక 34,239 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా.. 32,067 మంది (93.65 శాతం) అర్హత సాధించారు. 16 నుంచి ఓఎంఆర్ పత్రాలు పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్సైట్లో (med.tseamcet.in) అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. మూల్యాంకనంలో ఏమైనా పొరపాట్లు దొర్లితే జనరల్, బీసీ విద్యార్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.2 వేలు చెల్లించి తమ విజ్ఞాపనను ఆన్లైన్ ద్వారా (ఎంసెట్ వెబ్సైట్) అందజేయాలని సూచించారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ర్యాంకు కార్డులను విద్యార్థులు ఈ నెల 21 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలోని 2,420 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జనరల్ విద్యార్థులకు, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు (వికలాంగులు, ఆర్మీ, స్పోర్ట్స్ కేటగిరీ) సర్టిఫికెట్ల వెరిఫికే షన్ ఉంటుందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రాలను జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు కాళోజీ వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి తెలిపారు. 50 శాతం కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదట ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్లో ప్రవేశాలు చేపడతామన్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్, వెటర్నరీ, ఆయుర్వేదిక్, హోమియో, యునానీ, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు వరుస క్రమంలో ఉంటాయని చెప్పారు. తర్వాత రెండో దశ లేదా చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. టాపర్లు వీరే... పేరు ర్యాంకు కంబైన్డ్ స్కోర్ ఎంసెట్ మార్కులు జిల్లా రాజుపాలెం ఉజ్వల్ 1 97.66% 155 రంగారెడ్డి కాసం ఐశ్వర్య 2 97.66% 155 మెదక్ ఎం.సాయి శుశ్రుత 3 97.61% 155 కర్నూలు వేణుమాధవ్ పిన్నింటి 4 97.53% 155 రంగారెడ్డి ఎం.అంకిత్రెడ్డి 5 97.36% 155 హైదరాబాద్ జాతప్రోలు ప్రణవి 6 97.19% 154 మహబూబ్నగర్ తప్పెట తేజస్విని 7 97.19% 154 అనంతపురం సిద్ధార్థ్ బి రావు 8 97.02% 154 హైదరాబాద్ కొయ్య వినీత్రెడ్డి 9 96.98% 154 రంగారెడ్డి సీహెచ్ కృష్ణగీత్ 10 96.90% 154 ఖమ్మం కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లు ఇవీ.. ఎంబీబీఎస్లో.. కేటగిరీ కాలేజీలు సీట్లు ప్రభుత్వ 6 1,060 ప్రైవేటు 14 720 మొత్తం 20 1,780 బీడీఎస్లో... ప్రభుత్వ 1 140 ప్రైవేటు 9 500 మొత్తం 10 640 చిన్నప్పటి కోరిక నెరవేరబోతోంది ‘‘నా చదువు కోసం అమ్మానాన్నలు ఎంతో కష్టపడుతున్నారు. వారి కలలను సాకారం చేయడమే నా లక్ష్యం. చిన్నప్పట్నుంచి డాక్టర్ కావాలనే నా కోరిక నెరవేరబోతోంది. కోర్సు పూర్తి చేశాక ఇక్కడే ఆసుపత్రి పెట్టి సేవలందిస్తా’’ అని ఎంసెట్-2లో రెండో ర్యాంకు సాధించిన కాసం ఐశ్వర్య చెప్పారు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్కు చెందిన ఈమె శ్రీనివాస్, అమృత దంపతుల కుమార్తె. తల్లిదండ్రులు కిరాణా దుకాణం నిర్వహిస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. ఐశ్వర్య సెయింట్ మేరీస్ విద్యానికేతన్లో పదోతరగతి, కూకట్పల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదివారు. కార్డియాలజిస్ట్ కావాలని ఉంది కార్డియాలజీ చదివి గ్రామీణ ప్రాంతాల పేదలకు సేవలు చేయాలని ఉందని ఎంసెట్-2లో మూడో ర్యాంకు సాధించిన సాయి శుశ్రుత చెప్పారు. వైద్యులైన తన తల్లితండ్రుల వల్లే ర్యాంకును సాధించాన న్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శుశ్రుత ఎంసెట్లో 155 మార్కులు సాధించినా ఇంటర్ వెయిటేజ్లో ఒక్క మార్కు తగ్గడంతో ఫస్ట్ర్యాంక్ మిస్ అయింది. ఈమె పదో తరగతి వరకు కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ స్థానిక నారాయణ కాలేజీలో చదివారు. ఏపీ ఎంసెట్లో 18వ ర్యాంకు సాధించారు. ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు ‘మెడిసిన్లో మంచి ర్యాంకు వస్తుందని ముందే ఊహించా. కానీ ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది’ అని ఎంసెట్-2లో ఫస్ట్ర్యాంకు సాధించిన రాజుపాలెం ఉజ్వల్ పేర్కొన్నారు. ‘నాన్న డాక్టర్ శ్యామ్సుందర్ అందించిన సహకారం మరువలేనిది. ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు బోయిన్పల్లి సెయింట్ థెరిస్సాలో, కూకట్పల్లిలోని శ్రీచైతన్య కళాశాలో ఇంటర్మీడియె ట్ పూర్తి చేశాను. మెడిసిన్లో కార్డియో థొరాసిక్ స్పెషాలిటీ చేయాలని ఉంది’’ అని ఆయన చెప్పారు. కార్డియాలజీ చదువుతా మెడిసిన్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్గా సేవలందిస్తానని ఎంసెట్-2లో నాలుగో ర్యాంకు సాధించిన వేణుమాధవ్ చెప్పారు. హైదరాబాద్లోని స్నేహపురికాలనీకి చెందిన ఈయన టెన్త్ రమాదేవి పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ చైతన్యపురిలోని శ్రీచైతన్య కాలేజీలో చదివారు. ఇంటర్లో 982 మార్కులు సాధించిన వేణుమాధవ్.. ఏపీ ఎంసెట్లో 24వ ర్యాంకు సాధించారు. ఐఎస్ సదన్ అబ్బాయికి 5వర్యాంకు హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్కు చెందిన ఎం.అంకిత్ రెడ్డి ఎంసెట్-2లో 5వ ర్యాంక్ సాధించాడు. మున్ముందు మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు అంకిత్ తండ్రి ఎం.నరేశ్చంద్రారెడ్డి పేర్కొన్నారు. ‘అనంత’ విద్యార్థికి ఏడో ర్యాంకు అనంతపురం నగరానికి చెందిన తప్పెట తేజస్విని ఎంసెట్-2లో ఏడోర్యాంకు సాధించారు. ఏపీ ఎంసెట్లోనూ ఈమె 29వ ర్యాంకు సాధించారు. తేజస్విని తండ్రి శ్రీబాలాజీ బీఎస్ఎన్ఎల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. పరిశోధన విభాగంలో స్థిరపడతా జనరల్ మెడిసిన్ పూర్తి చేసి పరిశోధనా విభాగంలో స్థిరపడాలని భావిస్తున్నట్లు ఎంసెట్-2లో ఎనిమిదో ర్యాంకు సాధించిన సిద్ధార్థ్ చెప్పారు. హైదరాబాద్లోని అమీర్పేటకు చెందిన సిద్ధార్థ్.. పదో తరగతి వరకు బేగంపేటలోని గీతాంజలి స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ఎస్సార్నగర్లో శ్రీచైతన్య కాలేజీలో చదివారు. పేదలకు వైద్యం అందిస్తా కార్డియాలజీ చేసి పేదలకు వైద్యాన్ని అందించడమే తన లక్ష్యమని తొమ్మిదో ర్యాంకు సాధించిన వినీత్రెడ్డి తెలిపారు. ఈయన తండ్రి కేయిర్న్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తుండగా తల్లి గృహిణి. వినీత్ పదో తరగతి వరకు నారాయణ ఒలింపియాడ్లో, ఇంటర్ నారాయణగూడలోని శ్రీచైతన్య బ్రాంచ్లో చదివారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తా ‘‘ప్రణాళిక బద్ధంగా చదవడం వల్లనే ఈ ర్యాంకు సాధ్యమైంది. ఢిల్లీ ఏయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి మంచి డాక్టర్గా గుర్తింపు తెచ్చుకుంటా’’ అని ఎంసెట్-2లో ఆరో ర్యాంకు సాధించిన ప్రణవి తెలిపారు. పుట్టి, పెరిగిన అచ్చంపేట ప్రాంతానికి సేవలందిస్తానని, పేదలకు ఉచిత వైద్యసేవ చేస్తానని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement