-
విజ్ఞానజ్యోతి విద్యార్థుల మృతి కేసు; ప్రభుత్వానికి చుక్కెదురు
న్యూఢిల్లీ: వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో హిమచల్ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యార్థుల మృతికి హిమచల్ప్రదేశ్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని ప్రభుత్వం కోరగా, మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు 2014 జూన్ 8న హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. చనిపోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును హిమచల్ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని కోర్టు కొట్టివేయడంతో విద్యార్థుల కుటుంబాలకు ఊరట లభించింది. -
బియాస్ దుర్ఘటన నేపథ్యంలో...
న్యూఢిల్లీ: బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన దుర్ఘటన నేపథ్యంలో విద్యార్థుల విజ్ఞాన యాత్రలకు మార్గదర్శకాలు రూపొందించాలని యూజీసీ, ఏఐసీటీఈలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్సభకు తెలిపారు. బియాస్ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించానని ఆమె చెప్పారు. సహాయక చర్యలు చేపట్టాలని హిమచల్ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ మంత్రులను సంఘటనా స్థలానికి పంపాయని చెప్పారు. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది జూన్ 8న హిమచల్ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైయ్యారు. వీరిలో ముగ్గురు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. -
'విఎన్ఆర్' ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
బియాస్ దుర్ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి విఎన్ఆర్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. దాంతో కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గత నెలలో విజ్ఞాన యాత్రలో భాగంగా ఉత్తర భారతంలో పర్యటించారు. అందులోభాగంగా హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలోకి దిగిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి మరణించిన సంగతి తెలిసిందే. అయితే కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తు శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రిథిమాకు కన్నీటి వీడ్కోలు
బంగారుపాళెం: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో కొట్టుకుపోయి ఆశువులుబాసిన ఇంజినీరింగ్ విద్యార్థిని రిథిమా పాపానికి శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్లోని విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న రిథిమా పాపాని తోటి విద్యార్థులతో కలిసి విజ్ఞాన యాత్రకు వెళ్లి, 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఆమె మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి ఆమె స్వగ్రామమైన చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం పాపానివారిపల్లెకు తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
రిధిమా.. వెళ్లిపోయావమ్మా !
మోతీనగర్: హిమాచల్ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన రిధిమా మృతదేహం లభించిందని అధికారులు సమాచారమివ్వడంతో మోతీనగర్ బీఎస్పీకాలనీలో ఆమె నివాసం వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈనెల 8న దుర్ఘటన జరిగిన నాటి నుంచి రిధిమా తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధాదేవిలు తల్లడిల్లుతూ కూతురు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు తమకూతురు క్షేమంగా తిరిగి వస్తుందని కళ్లల్లో ఒత్తులువేసుకొని అన్నపానీయాలు ముట్టకుండా ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు మృతదేహం వస్తుందని తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. రిధిమా మృతదేహం లభించిందని తెలియడంతో ఆమె స్నేహితులు, బంధువులు ఇంటికి తరలివస్తున్నారు. ఈనెల 8న బియాస్ నదిలో దుర్ఘటన జరగ్గా...ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఏడు మృతదేహాలు దొరకాల్సి ఉంది. మృతదేహం గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడినుంచి చిత్తూరు జిల్లాకు తరలించనున్నట్లు రిధిమా కుటుంబసభ్యులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement