-
గుంటూరు బ్యూటీషియన్ హత్యకేసు.. వివాహేతర సంబంధమే కారణమా?
సాక్షి, గుంటూరు(తెనాలిరూరల్): బ్యూటీషియన్ హత్య కేసులో ఆమె భర్తను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక గాంధీనగర్ ఘంటావారి వీధిలోని బ్యూటీ పార్లర్లో ఉన్న స్వాతిని ఆమె భర్త వెంకట కోటయ్య కత్తితో దారుణంగా నరికి చంపి, ఆపై ఆమె శవంపై పూల మాలలు వేసి నివాళులర్పించి మరీ రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన విషయం తెలిసిందే. స్థానిక టూటౌన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ స్రవంతి రాయ్ వెల్లడించారు. అనుమానంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు డీఎస్పీ వివరించారు. ఆమె కథనం ప్రకారం.. చెంచుపేట జెండాచెట్టు బజారుకు చెందిన లారీ డ్రైవర్ పరిమి వెంకటేశ్వరరావు కుమార్తె స్వాతికి లారీ డ్రైవర్ కాకర్ల వెంకట కోటయ్యతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వాతి గాంధీనగర్లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. చదవండి: (ఫేస్బుక్లో పరిచయైన యువతితో పెళ్లికి సిద్ధం.. రూ.39లక్షలు..!) ఆమె ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వెంకట కోటయ్య అనుమానించేవాడు. ఈ విషయంపై తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు. ఈ నెల 15వ తేదీన కూడా భార్యతో గొడవ పడి కొట్టడంతో ఆమె చెంచుపేటలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రోజూ తల్లిదండ్రుల ఇంటి వద్ద నుండే గాంధీనగర్లోని బ్యూటీ పార్లర్కు వచ్చి వెళుతోంది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న వెంకట కోటయ్య గురువారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ వద్దకు వచ్చి స్వాతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. భార్య మృతి చెందిందని నిర్ధారించుకున్న వెంకట కోటయ్య ముందుగానే తన వెంట తెచ్చుకున్న పూల దండలను ఆమె మృతదేహంపై వేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి ఇద్దరు కొడుకులకు తల్లిని చంపేసినట్లు చెప్పాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో టూటౌన్ సీఐ ఎస్.వెంకట్రావు, ఎస్ఐ శివరామయ్య, సిబ్బంది ఉన్నారు. చదవండి: (గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్లో భార్యను చంపిన భర్త) -
పట్టపగలు మెట్రో స్టేషన్ లో కిరాతకం
గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళను ఓ దుర్మార్గుడు కిరాతకంగా హత్య చేశాడు. గుర్గావ్ లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ లో సోమవారం ఉదయం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రోహిణి ప్రాంతంలో బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న పింకీ దేవి(34) అనే మహిళను జితేందర్ అనే ఆటోడ్రైవర్ పాశవికంగా పొడిచి చంపాడు. ముందుగా వెనుక నుంచి ఆమెపై జితేందర్ దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత ఆమె గొంతు కోసి, విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడని చెప్పాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కత్తితో బెదిరించాడు. ఎలక్ట్రిక్ స్టాండింగ్ ఫ్యాన్ విసిరి అతడిని పట్టుకున్నారు. పింకీ దేవిని సమీపంలోని ఉమా సంజీవని ఆస్పత్రికి తరలించగా సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తీవ్రగాయాలతో మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. ఆమె దేహంలో 30 కత్తి గాయాలున్నాయని పోస్టుమార్టం చేసిన వైద్యుడు దీపక్ మాథూర్ తెలిపారు. షిల్లాంగ్ కు చెందిన పింకీ దేవి తన భర్త మాన్ సింగ్ తో కలిసి గుర్గావ్ లోని సార్ హాల్ గ్రామంలో నివసిస్తోంది. మూడేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. నిందితుడు జితేందర్ ను ప్రభుత్వాసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు. అతడు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జితేందర్ గుర్గావ్ లోని రాజీవ్ నగర్ లో నివసిస్తున్నాడని వెల్లడించారు. అయితే గత కొన్ని నెలలుగా పింకీ దేవిని జితేందర్ వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
Advertisement