-
మహోజ్వల భారతి: బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వ నిషేధం
1837 నాటి ఈస్టిండియా కంపెనీ ‘కార్మిక వలసల కొత్త విధానం’ పై బ్రిటన్లోను, భారతదేశంలోనూ బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్థాయిలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 1838 ఆగస్టు 1న భారతీయ కార్మికుల ఎగుమతి వ్యవహారంపై విచారణకు ఒక కమిటీని నియమించారు. కమిటీ నివేదిక అనంతరం 1839 మే 29న విదేశీ కార్మిక వ్యవస్థను నిషేధించారు. అలాంటి వలసలను చేపట్టే ఏ వ్యక్తి అయినా 200 రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షకు గురవుతాడు. నిషేధం తర్వాత కూడా, కొంతమంది భారతీయ కార్మికులను పాండిచ్చేరి (అప్పట్లో ఫ్రెంచ్ వారి అధీనంలో) మీదుగా మారిషస్కు పంపడం కొనసాగింది. భారతీయ వెట్టి చాకిరీ వ్యవస్థ బ్రిటిషు వారు 19 వ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన నిర్బంధ కార్మిక వ్యవస్థ. ఒక పరిమిత కాలానికి చేసుకునే ఒప్పందం ప్రకారం కార్మికులు పనిచేస్తారు కాబట్టి దీన్ని ఒప్పంద కార్మిక వ్యవస్థ అనే వారు. అది బానిసత్వం లాంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో పదహారు లక్షలకు పైబడిన సంఖ్యలో భారతీయులను శ్రామికులుగా వివిధ ఐరోపా వలస రాజ్యాలకు రవాణా చేశారు. బ్రిటిషు సామ్రాజ్యంలో 1833లోను, ఫ్రెంచ్ వలస దేశాల్లో 1848 లోను, డచ్ సామ్రాజ్యంలో 1863 లోనూ బానిసత్వాన్ని నిర్మూలించిన తర్వాత ఈ వ్యవస్థ విస్తరించింది. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ 1920 ల వరకు కొనసాగింది. నేడు కరిబియన్ దేశాలు, నాటల్ (దక్షిణాఫ్రికా), తూర్పు ఆఫ్రికా, మారిషస్, శ్రీలంక, మలేషియా, మయన్మార్, ఫిజీ వంటి దేశాల్లో ప్రవాస భారతీయ సమాజం ఉందంటే దానికి మూలం ఈ కార్మిక వ్యవస్థే. ఇండో–కరిబియన్, ఇండో–ఆఫ్రికన్, ఇండో–ఫిజియన్, ఇండో–మలేషియన్, ఇండో–సింగపూర్ జనాభా పెరుగుదలకూ ఈ వ్యవస్థే దోహదం చేసింది. ఈ వ్యవస్థలో ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులను హీనంగా కూలీ అని పిలిచేవారు. వివిధ వలస దేశాల్లో వారి పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉండేవి. వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ఒప్పందంలో నియమాలు ఉన్నప్పటికీ వాటిని పాటించేవారు కాదు. ఒప్పంద కాలపరిమితి తీరిపోయాక కూడా ఏదో విధంగా వాళ్లను వెనక్కి పోనీయకుండా నిర్బంధంగా అక్కడే ఉంచేలా యజమానులు కుటిల ప్రయత్నాలు చేసేవాళ్లు. భారతదేశంలో కార్మికుల నియామకాల్లో కూడా అనేక అక్రమాలు జరిగేవి. తమ పని ఏమిటో, పని చెయ్యబోయేది ఎక్కడో వాళ్లకు చెప్పేవారు కాదు. ఓడ ఎక్కేముందు రేవు లోను, ఓడలోనూ వాళ్ల నివాస పరిస్థితులు అమానవీయంగా ఉండేవి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు బ్రిటిషు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ అక్రమాలు కొనసాగాయి. చివరికి దేశవ్యాప్తంగాను, బ్రిటన్లోను, ఇతర దేశాల్లోనూ ప్రజల నుండి వచ్చిన వత్తిడి కారణంగా 1917లో ఈ వెట్టి చాకిరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసారు. -
చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరి
వేములవాడఅర్బన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు పదేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక చేసేది ఏమీ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్సీల్లో 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది మండల సమన్వయ కర్తలు పనిచేస్తున్నారు. తమకు కనీస వేతనాలు పెంచాలని వారు ప్రభుత్వన్ని కోరుతున్నారు. అప్పట్లో వీరిని ఎంపిక చేసి ఔట్ సోర్సింగ్పై నియమించారు. వీరు అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ విభాగం, కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానం కలిగిన వారిని ఎంపిక చేశారు. ఎమ్మార్సీ కార్యాలయంలో డేటా ఎంట్రీ మండల విద్యావనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మండల సమన్వయ కర్తలుగా నియామకమైన వీరు మండ కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల నెలవారీ వేతనాలతో పాటు పాఠశాలకు మంజూరయ్యే నిధులు, ఖర్చుల వివరాలను నమోదు చేస్తారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవోల అసిస్టెంట్లుగా ఉంటున్నా వీరు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. చాలీచాలని వేతనం.. పదేళ్ల క్రితం నియామకమైన వీరికి కనీస వేతనాల ఊసేలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మార్సీ కార్యాలయాల్లో అన్ని పనులు చేస్తుంటారు. కానీ వారికి వేతనం రూ.15 వేలు మించదు. దాంతో వారి కుటుంబాలు గడవక వీధిన పడే పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. అయినా ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఇవే.. ∙సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ∙ఏడాదికి 22 సెలవులు ఇవ్వాలి. ∙మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ∙రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందజేస్తున్న జీవో నెం 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ∙ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ కార్డులు అందించాలి. ∙ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సెలవులు, అలవెన్సులు కల్పించాలి. -
పాపం పసివాళ్లు
వెట్టిచాకిరీలో భారీగా పసివాళ్లు నిన్న గాజుల కంపెనీలు... నేడు చీరలు, ప్లాస్టిక్ కంపెనీల్లో వెలుగు చూస్తున్న వరుస ఉదంతాలు పోలీసుల చొరవతో 238 మందికి విముక్తి బాలికలు సైతం అదో కీకారణ్యం. వందలాది మంది పిల్లలు ఆ అరణ్యంలో కౄరమృగం లాంటి వ్యక్తి వద్ద వెట్టిచాకిరీ చేస్తుంటారు. రొట్టె ముక్కలనే ఆహారంగా వేస్తూ... వారి శ్రమను దోచుకుంటూ ఉంటాడా వ్యక్తి. మరణం తప్ప... తప్పించు కోవడానికి మరో మార్గంలేని దుస్థితి ఆ చిన్నారులది.... సుమారు పాతికేళ్ల క్రితం చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలోని దృశ్యమిది. ప్రస్తుతం నగరంలో అదే తరహా దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. పాపం... పుణ్యం... ప్రపంచ ‘మార్గం’ తెలియని చిన్నారులు... కూటి కోసం... కూలి కోసం... గనులలో... కర్మాగారాలలో... వెట్టి చాకిరి అనే భూతం కోరల్లో చిక్కుకుంటున్నారు. బాల్యానికీ... బంధువులకు దూరంగా... ఆకలితో అలమటిస్తూ... బాధలతో దోస్తీ చే స్తున్నారు. సిటీబ్యూరో: ‘మెరుపు మెరిస్తే... వాన కురిస్తే...ఆకశాన హ రివిల్లు విరిస్తే’... చిందులేయలేరు ఆ చిన్నారులు. ఆకలేస్తే అమ్మ దగ్గరకు వెళ్లి మారాం చేయలేని దైన్యం వారిది. జ్వరం వ స్తే అమ్మ కొంగు చాటున విశ్రాంతి తీసుకుంటూ... ఆమె ప్రేమగా ఇచ్చే మందు వేసుకోలేని దౌర్భాగ్యం వారిది. కనీసం తోటి పిల్లలకు సాయం చేద్దామన్నా వీలులేని దయనీయ స్థితి. కంటి నిండా నిద్ర పోవడానికి సైతం కుదరని హీన స్థితి. ఇదంతా వెట్టిచాకిరి ప్రభావం. అవును పసిపిల్లల వెట్టి చాకిరీకి పాతబస్తీ కేరాఫ్ అడ్రస్సుగా మారింది. చిన్నారుల రక్తాన్ని... శ్రమను అక్కడి వ్యాపారులు జలగల్లా పీల్చేస్తున్నారు. పోలీసుల వరుస దాడుల్లో వెలుగు చూస్తున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనం. భవానీనగర్లో 14 గాజుల పరిశ్రమల్లో పని చేస్తున్న 216 మంది పిల్లలను ఇటీవల వెట్టి నుంచి రక్షించిన పోలీసులు... గురువారం కంచన్బాగ్లో చీరల తయారీ, ప్లాస్టిక్ కంపెనీల్లో పనిచేస్తున్న మరో 22 మందిని రక్షించారు. వీరిలో బాలికలూ ఉండడం గమనార్హం. పలకా బలపం పట్టాల్సిన పిల్లలను కారాగారాల్లాంటి కర్మాగారాల్లో బంధించి... రాత్రీ పగలు అనే తేడా లేకుండా పనులు చేయించుకుంటున్నారు. బీహార్ నుంచి పిల్లలను అక్రమ రవాణా చేస్తూ... ఇక్కడి వ్యాపారుల కబంధ హస్తాల్లో పెట్టి... వారి బంగారు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అనారోగ్యం పాలైనా పట్టించుకునే వారుండరు. తీవ్ర అస్వస్థతకు గురైతే వారిని తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులిపేసుకుంటారు. కార్మిక చట్టాలకు ఇవి కొన్ని యోజనాల దూరంలో ఉంటాయి. పని గంటల ‘లెక్క’లు అక్కరకు రావు. దాహంతో అలమటిస్తున్నా.... తాగడానికి మంచినీరు కూడా ఇవ్వరు. ఇరుకైన గదుల్లో 20 మంది చొప్పున కుక్కేస్తున్నారు. పిల్లికూనల్లా ఒకరిపై ఒకరు ఒదిగి నిద్రపోవాల్సిందే. వారం రోజుల్లో పోలీసులు సుమారు 16 కంపెనీలలో వరుస దాడులు చేయడంతో వీరి కష్టాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. ఈ మాఫియా వెనుక సూత్రధారుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 24 మంది నిందితులను అరెస్టు చేశారు. వెలుగులోకి రాని మరిన్ని కేంద్రాలు.... పాతబస్తీలో గల్లీగల్లీలో బాల కార్మికులు పని చేస్తుంటారు. బల పాలు, రంగుల తయారీ, గాజుల తయారీ, పతంగులు, విస్తరాకులు, దారాల తయారీ వంటి పరిశ్రమల్లో పిల్లలనే పనులకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా శాలిబండ, ముర్గిచౌక్, కోళ్ల ఫారాలు, కామాటిపుర, గాజుబండ, చాంద్రాయణగుట్ట, చందులాల్ బారాదరి, దూద్బౌలి, హుస్సేనీఆలం, పటేల్మార్కెట్, గుల్జార్హౌస్, మొగల్పురాలో ఈ వెట్టిచాకిరి ఎక్కువగా ఉంది. ఇక్కడి వ్యాపారులు సంబంధిత అధికారులకు నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటూ... ఈ వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శివార్లలోని పారిశ్రామిక వాడల్లో సైతం బాల కార్మికులతో పని చేయించుకుంటున్నట్లు తెలిసింది. వ్యాపారుల క క్కుర్తి పెద్ద వాళ్లను పనిలో పెట్టుకుంటే వారికి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. పైగా వారు కేవలం 8 గంటలే పని చేస్తారు. యాజమాన్యాల మాట అన్నివేళలా చెల్లుబాటు కాదు. అదే చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే జీతాలు తక్కువ ఇవ్వవచ్చు, ఎక్కువ గంటలు పని చేయించుకోవచ్చుననేది వ్యాపారుల ఉద్దేశం. దీంతో వారు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా పిల్లలను తీసుకొచ్చి... వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. వారికి రోజుకు రూ.50 నుంచి రూ.150 వరకు చెల్లిస్తున్నారు. నిందితుల్లో 20 మంది బీహారీలే... భవానీనగర్ ఉదంతంలో పట్టుబడిన నిందితుల్లో 20 మందిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు నాంపల్లి కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ 14 కంపెనీల్లో 213 మంది బాలలతో వెట్టిచాకిరి చేయిస్తున్న కేసుల్లో 22 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వారిలో 20 మంది బీహారీలే కావడం గమనార్హం. నిందితుల్లో ఇద్దరు మాత్రమే భవానీనగర్కు చెందిన తండ్రీ కొడుకులైన వ్యాపారులు మహ్మద్ అక్రమ్ ఖాన్ (32), మహ్మద్ యాసీన్ ఖాన్ (62). ఇక పిల్లల విషయంలో పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు, జార్ఖండ్కు చెందిన నలుగురు మినహా మిగతా వారంతా బీహార్ రాష్ట్రంలోని గయ, పాట్నా, నలందా జిల్లాలకు చెందిన వారు. సూత్రధారుల కోసమే... వెట్టిచారికి ఉదంతం వెనుక సూత్రదారులు ఎవరున్నారనే కోణంలో ఆరా తీసేందుకే నిందితులను కస్టడీ కోసం పిటిషన్ వేశామని పోలీసులు అంటున్నారు. పిల్లలను ఇతర దేశాలకేమైనా పంపించారా అనే విషయంపైనా ఆరా తీస్తామన్నారు. ఇతర జిల్లాలు, పట్టణాలకు చిన్నారులను అక్రమ రవాణా చేశారా? అనే విషయాలు త్వరలో వెలుగు చూస్తాయంటున్నారు. బీహార్కు చెందిన నిందితులను విచారిస్తే పిల్లలను ఎత్తుకొచ్చారా లేక తల్లిదండ్రుల ఇష్టంతో తీసుకొచ్చారా? అనేది తేలుతుందంటున్నారు. వారికి డబ్బులు ఎలా పంపిస్తున్నారు? బ్యాంకు అకౌంట్లు తదితర వివరాలు త్వరలో బయటికి వస్తాయని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ సమన్వయం రామంతాపూర్లోని డాన్బోస్కో స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఇక్కడి చైల్డ్ వెల్ఫేరకమిటీ (సీడబ్ల్యూసీ)... బీహార్ సీడబ్ల్యూసీ అధికారులతో ఇప్పటికే సంప్రదించింది. మరోవైపు పిల్లల వయసు నిర్ధారణకు ఉస్మానియా వైద్యులకు పోలీసులు లేఖ రాశారు. త్వరలో ఉస్మానియా వైద్యులు పిల్లల వద్దకే వెళ్లి... వయసు నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశాలు ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement