-
పేదల గుడిసెలపై ఖాకీ ప్రతాపం
సంతనూతలపాడు, న్యూస్లైన్ : పేర్నమిట్ట సమీపంలోని కందరగుంట వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో 120 మంది పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గుడిసెలు అక్రమంగా వేశారని పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్పీ పి.జాషువా ఆధ్వర్యంలో శనివారం ఉదయం గుడిసెలు కూల్చి వేశారు. వివరాలు.. కందరగుంట ప్రభుత్వ భూమిలో సుమారు 25 సంవత్సరాల క్రితం పేర్నమిట్ట గ్రామానికి చెందిన దళితులకు పట్టాలిచ్చారు. కాలక్రమంలో వారి వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన బొడ్డు వెంకయ్య ఆ భూమిని కొనుగోలు చేశాడు. అతని నుంచి ఒంగోలుకు చెందిన టీవీ శ్రీరామమూర్తి కొనుగొలు చేసి ఆ భూమిలో ప్లాట్లు వేసి అమ్ముకున్నాడు. ఒంగోలుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ప్లాట్లు కొనుగోలు చేశారు. పది రోజుల నుంచి మళ్లీ గుడిసెలు వేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. నగరపాలక సంస్థ, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సహకారంతో పోలీసులు గుడిసెలు తొలగించారు. దళితులకు కేటాయించిన ప్రభుత్వ భూమిపై ఇతరులకు హక్కు ఉండదని అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి ఆక్రమించుకోవడం నేరమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుడిసెలు వేసుకున్న కొందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దళారులను నమ్మి మోసపోయామంటున్నారు. ఒక్కో గుడిసెకు * 3 నుంచి 5 వేల వరకు దళారులు వసూలు చేశారని ఆరోపించారు. పేర్నమిట్ట పరి శర ప్రాంతాల్లో అద్దెలు చెల్లించలేక ఇక్కడ గుడిసెలు వేసుకుని దళారుల ను నమ్మి మోసపోయారు. గుడిసెల తొలగింపు కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.గాంధీ, ఆర్ఐ కె.కాశీయ్య, సర్వేయర్ నందయ్య, వీఆర్ఓలు మోహన్రెడ్డి, శ్రీరాములు, ఒంగోలు తాలుకా సీఐ శ్రీవాసన్, సీసీఎస్ సీఐ బీటీ నాయక్, మద్దిపాడు ఎస్సై భక్తవత్సలరెడ్డితో పాటు 70 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
విజిలెన్స్ దాడులు
కొండపి, న్యూస్లైన్: రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు చేసి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ ఐ. భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు ముందుగా కొండపిలోని 28వ నంబర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. మిడ్డే మీల్స్కు సంబంధించిన ఇన్వార్డ్సు, అవుట్వార్డ్సు రిజిస్టర్లు లేవు. స్టాక్ కంటే 742 కేజీల బియ్యం ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 1వ నంబర్ దుకాణంలో మిడ్డేమీల్స్కు చెందిన 146 కేజీల బియ్యాన్ని రికార్డులో చూపించలేదు. 6ఏ కేసు నమోదు చేశారు. నివేదికను జాయింట్ కలెక్టర్కు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ రేషన్ దుకాణాలను మండలస్థాయి అధికారులు నిత్యం తనిఖీ చేయాలని చెప్పారు. డీలర్లు సమయపాలన పాటించి.. మెరుగైన సేవలు అందించాలన్నారు. బిల్లులు లేకుండా మధ్యాహ్న భోజన బియ్యాన్ని డీలర్లకు తరలిస్తున్న గోడౌన్ డీటీపై జేసీకి లిఖిత పూర్వక ఫిర్యాదు అందించనున్నట్లు తెలిపారు. దాడుల్లో దర్శి ఈడీటీ, సింగరాయకొండ ఈడీటీ బ్రహ్మయ్య, యేసుదాసు ఆర్ఐ డేవిడ్రాజ్ పాల్గొన్నారు. కాగా అధికారుల దాడులతో డీలర్లు చెమటలు పోస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు గాను వినియోగదారులకు సరిగా రేషన్ అందించలేదు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపడితే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని గాభరా పడుతున్నారు. అధికారులు నేరుగా కార్డుదారుల వద్దకు వచ్చి రేషన్ అందుతున్నాయా లేదా.. అని సమాచారం అడుగుతుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమ బాధలు తొలగాలని ఆకాంక్షిస్తున్నారు. కనిగిరిలో.. కనిగిరి,న్యూస్లైన్: మార్కాపురానికి చెందిన విజిలెన్స్ అధికారులు రెండు రేషన్ దుకాణాలు, రెండు బియ్యం దుకాణాలను తనిఖీ చేశారు. జేసీ ఆదేశాల మేరకు దాడులు చేపట్టినట్లు సహాయ సరఫరా అధికారి ఆర్. కోటయ్య తెలిపారు. కనిగిరి, పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో 10 రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీరి వెంట ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఎ. వేణుగోపాల్, ఎఫ్ఐ ఎస్. చంద్రశేఖర్ ఉన్నారు. అధికారుల రాక ముందుగానే పసిగట్టిన చాలామంది వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేశారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
చీరలో 'ప్రేమలు' మమిత అలా.. ముక్కెరతో సుప్రీత ఇలా!
కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్కు వర్షం అడ్డంకి..
నవీన్పట్నాయక్కు ప్రధాని మోదీ ఆసక్తికర సవాల్
కన్నప్ప: మంచు విష్ణు చెప్పింది కాకుండా ప్రభాస్..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్..
ఐఫోన్లో చాట్జీపీటీ ఫీచర్స్!.. ఓపెన్ఏఐతో యాపిల్ చర్చ
ధరెంతైనా.. ఖరీదైన ఇళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్న భారతీయులు
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
'హార్దిక్ ఒక అద్బుతమైన కెప్టెన్.. అందరి కంటే డిఫరెంట్'
ఏబీ వెంకటేశ్వర్రావుకు కేంద్రం షాక్
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement