-
బోల్డ్ కంటెంట్ కథలో భాగమే
‘‘ఆర్డీఎక్స్ లవ్’ కథ ఏ హీరోయిన్కైనా చెబితే ఫస్ట్ సీన్కే గెటవుట్ అంటారు. అంత బోల్డ్గా ఉంటుంది. ఈ కథతో కొందరి హీరోయిన్లను సంప్రదించాను. 70 రోజులు ఒక్క సినిమాకు డేట్స్ ఇచ్చే బదులు మూడు కమర్షియల్ సినిమాల్లో కనిపించవచ్చు అనేవారు. అంత వ్యాపార ధోరణిలో ఆలోచించారు’’ అని దర్శకుడు భాను శంకర్ అన్నారు. తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్పుత్ జంటగా భాను శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. సి. కల్యాణ్ నిర్మించారు. అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భాను శంకర్ చెప్పిన విశేషాలు. ► పక్కా వాణిజ్య అంశాలున్న చిత్రం ఇది. మెసేజ్తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. అది కూడా కేవలం కథలో భాగమే. యూత్ని టార్గెట్ చేయడం కోసం చేసింది కాదు. బహిరంగంగా మాట్లాడని టాపిక్లను ఈ సినిమాలో చూపించాం. ► ‘ఆర్ఎక్స్ 100’ సినిమా రిలీజ్ అయిన రెండో రోజే ఈ సినిమాలో హీరోయిన్గా పాయల్ను కన్ఫర్మ్ చేశాం. పాయల్కు కథ బాగా నచ్చి 70 రోజులు డేట్స్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె చాలా బాగా చేసింది. ఈ సినిమాతో తను సౌందర్య, అనుష్క రేంజ్కు వెళ్తుంది. ► సినిమాలో ఒక పాత్ర చేస్తే నిజ జీవితంలో కూడా అలానే ఉంటామేమో అని కొందరు ఆర్టిస్టులు భయపడతారు. భయపడితే గొప్ప ఆర్టిస్టులు ఎలా అవుతారు? మా చిత్ర టీజర్ రిలీజ్ అయినప్పుడు ‘బీ గ్రేడ్ సినిమానా?’ అంటూ పాయల్కి సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. దాంతో తను భయపడింది. ‘కామెంట్ చేసేవాళ్లు కేవలం టీజరే చూశారు, నీకు సినిమా మొత్తం తెలుసు కదా? నువ్వు ఎందుకు భయపడతావు?’ అని చెప్పాను. ► రొమాంటిక్ సినిమాకు, ‘సి’ గ్రేడ్ సినిమాకు చాలా వ్యత్యాసం ఉంది. రొమాన్స్ పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఉంటుంది. పెద్దవాళ్లు చేస్తే ఒకలా చూసి, చిన్నవాళ్లు చేస్తే మాత్రం విమర్శిస్తారా? ► ఇప్పటికీ అభివృద్ధి చెందని గ్రామాల పరిస్థితులను మా సినిమాలో వివరించాం. అందుకు సెల్ సిగ్నల్ కూడా లేని ఒక ఊర్లోనే 45 రోజులు షూటింగ్ చేశాం. ఈ సినిమా విడుదల తర్వాత నెక్ట్స్ సినిమా ఏంటని ఆలోచిస్తాను. -
3 కోట్ల ‘అర్ధనారి’కి 15 కోట్ల ఆఫర్!
అర్జున్ యజత్, మౌర్యాని జంటగా పత్తికొండ సినిమాస్ పతాకంపై రవికుమార్, భరత్ రాజ్, కర్లపూడి కృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అర్ధనారి’. భాను శంకర్ చౌదరి దర్శకత్వం వహించారు. రవివర్మ సంగీత దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కాన్సెప్ట్ బాగుందనే టాక్ వచ్చింది. వసూళ్లు కూడా బాగున్నాయని దర్శకుడు భానుశంకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన పలు విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ♦ మా యూనిట్ సభ్యులందరూ హైదరాబాద్లోని శ్రీ మయూరి థియేటర్లో సినిమా చూశారు. నేను నిజామాబాద్లో ప్రేక్షకులతో కలసి చూశాను. నిజామాబాద్ మల్టీప్లెక్స్లో మార్నింగ్ రెండు షోలు వేశారు. ప్రేక్షకుల స్పందన చూసి మరో రెండు షోలు పెంచారు. ముఖ్యంగా మహిళలు సెకండాఫ్లో ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. శుక్రవారం మార్నింగ్ మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చాయి. మ్యాట్నీకీ, ఫస్ట్ షోకీ కలెక్షన్స్ పెరిగాయి. సాధారణంగా ఏ మాత్రం ఇమేజ్ లేని ఆర్టిస్టుల సినిమాలకు కలెక్షన్స్ తక్కువే ఉంటాయి. ఈ సినిమాకి మౌత్ టాక్ బలంగా ఉండడంతో ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆర్టిస్టులందరూ చక్కగా నటించారు. ఇలాంటి మంచి కథలు, సినిమాలు మరిన్ని రావాలని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. ♦ కరెంట్, రోడ్, ఓటు హక్కు.. ఇలా సమాజంలో కళ్ల ముందు ఉండే ప్రతి అంశం గురించి ఈ సినిమాలో చర్చించాను. సామాన్యుడు తన బాధ్యతలను విస్మరించడం వల్లే సమాజంలో అన్యాయాలు ఎక్కువైయ్యాయన్నది చూపించాను. ముఖ్యంగా సినిమాలో చూపించిన పంచ సూత్రాల సన్నివేశానికి అద్భుత స్పందన లభిస్తోంది. రాజకీయ నాయకులందరూ ఈ పంచ సూత్రాలను అమలుపరిస్తే దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది. ♦ ‘అర్ధనారి’ కథ తయారు చేసుకున్నాక పలువురు నిర్మాతల్ని కలిశాను. ‘ఈ రోజుల్లో సందేశాలు చెప్తే ఎవరు వింటారండీ. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగింది. దేశభక్తి ఎవరికి కావాలండీ’ అని డిజప్పాయింట్ చేశారు. ‘దేశం గురించి చెప్పడం కూడా తప్పే’ అన్నట్లు మాట్లాడారు. సందేశం ఇవ్వాలంటే స్టార్ హీరోలు మాత్రమే ఇవ్వాలన్నారు. కొత్తవాళ్లు చెప్తే చూడరని అన్నారు. నిర్మాతలు ఎం.రవికుమార్, భరత్ రాజ్, కర్లపూడి కృష్ణలు కథ విని, ‘ఈ కథతోనే సినిమా తీద్దాం. వేరే కథ వద్దు’ అని ఎంకరేజ్ చేశారు. కొత్త నటీనటులతో 3 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా తీయడం రిస్కే. కానీ, ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలాంటి మంచి కథతో సినిమా తీయడం ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన ప్రక్రియ. కమర్షియల్ హంగుల పేరుతో తీసిన కథనే మళ్లీ మళ్లీ తీస్తున్నారు. సందేశాత్మక కథలు, సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మా ‘అర్ధనారి’ నిరూపించింది. ♦ శుక్రవారమే హిందీ, తమిళ, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి రీమేక్ రైట్స్ కోసం పలువురు నిర్మాతలు సంప్రతించారు. ఆయా భాషల్లో స్టార్ హీరోలు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని భాషల్లో కలిపి సుమారు15 కోట్ల రూపాయలు రీమేక్ రైట్స్ ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే కథలతో సినిమాలు చేస్తాను.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement