-
నంబర్ వన్ విద్యార్థి
డ్రగ్స్కు బానిసైన ఓ యువకుణ్ణి గురువు ఎలా దారిలో పెట్టాడనే కథతో రూపొందనున్న సినిమా ‘స్టూడెంట్ నెం.1’. కృష్ణచైతన్య, భానుచందర్, భానుప్రియ ముఖ్యతారలుగా రవికిరణ్ దర్శకత్వంలో కె.ఎల్.ఎన్. ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కెమేరా స్విచ్చాన్ చేయగా, భానుచందర్ క్లాప్ ఇచ్చారు. దేవీప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘డ్రగ్స్ మాఫియా, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తీస్తోన్న చిత్రమిది. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు రవికిరణ్. ‘‘నేను ఎన్టీఆర్ ఫ్యాన్. నా సినిమాకి ఆయన సినిమా టైటిల్ పెట్టడం హ్యాపీగా ఉంది’’ అన్నారు హీరో కృష్ణచైతన్య. నాజర్, ‘తాగుబోతు’ రమేశ్, తనికెళ్ల, అజయ్ ఘోష్ నటించనున్న ఈ చిత్రానికి మాటలు: గోపీకిరణ్, సంగీతం: తలారి శ్రీనివాస్. -
ఆ 40 రోజుల కథ!
ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తొలికిరణం’. జాన్బాబు దర్శకత్వంలో పీడీ రాజు, భానుచందర్, అభినయ ముఖ్యతారలుగా సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏసుక్రీస్తు పునరుత్థాన దశలో 40 రోజుల పాటు భక్తులతోటే ఉన్నారు. ఆ 40 రోజుల్లో క్రీస్తు ఏం చేశాడన్నదనేది కథ. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. గుడ్ఫ్రైడే వేళ మార్చి 25న రిలీజ్ చేయనున్నాం’’ అని తెలిపారు. -
శ్రీహరికి ఈ సినిమా అంకితం
‘‘శ్రీహరి కెరీర్లో ‘శివకేశవ్’ ఓ అద్భుతం. ఆయనే బ్రతికి ఉంటే... హీరోగా సెకండ్ ఇన్నింగ్స్కి బంగారు బాట వేసేదీ సినిమా. ఆ స్థాయిలో విజృంభించి నటించారు శ్రీహరి’’ అని నిర్మాత బానూరు నాగరాజు(జడ్చర్ల) అన్నారు. స్వర్గీయ శ్రీహరి, భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘శివకేశవ్’. సంజన, గుర్లిన్చోప్రా, శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్లు. ఆర్వీ సుబ్రమణ్యం దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నాగరాజు విలేకరులతో ముచ్చటించారు. అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని, గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదలకు జాప్యం జరిగిందని నాగరాజు చెప్పారు. జయంత్ నటన ఆకట్టుకుంటుందని, గుర్లిన్ చోప్రా, సంజన, శ్వేతాబసు ప్రసాద్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని ఆయన తెలిపారు. శ్రీహరికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామని, శ్రీను వైట్ల శిష్యుడు వెంకటేశ్ రెబ్బా దర్శకత్వంలో ‘నాక్కొంచెం టైమ్ కావాలి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నామని నాగరాజు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement