-
ఎండ వేడిమికి 600 కోళ్లు మృతి
బ్రహ్మసముద్రం (కళ్యాణదుర్గం) : ప్రచండ భానుడి దెబ్బకు కోళ్లు విలవిలలాడుతున్నాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో రాజు అనే రైతుకు చెందిన కోళ్ల ఫారంలో సోమవారం 600 కోళ్లు నిమిషాల వ్యవధిలో చనిపోయాయి. వీటిని ఓ గోతిలో పూడ్చివేసినట్లు రైతు రాజు తెలిపాడు. -
బాబోయ్ ఇదేం వేడి..
- నిప్పులు కక్కుతున్న వాతావరణం - అల్లాడుతున్న జిల్లా ప్రజానీకం - విశాఖలో 36.2 డిగ్రీల ఉష్ణతాపం సాక్షి, విశాఖపట్నం: భానుడు ఉడుకు పుట్టిస్తున్నాడు. జనాన్ని ఉష్ణతాపంతో బెంబేలెత్తిస్తున్నాడు. వర్షాలు కురిసే కాలంలో ఎండలతో అల్లాడిస్తున్నాడు. జిల్లాలో సాధారణంకంటే మూడు నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం మరింత గా సెగలు కక్కాయి. వాస్తవానికి ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘కొమెన్’ తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వానల స్థానంలో వేసవిని తలపించే ఎండలు కాస్తున్నాయి. శనివారం నగరం (విమానాశ్రయం)లో 36.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇది సాధారణంకంటే మూడు డిగ్రీలు అధికం. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వేడి వెద జల్లుతూనే ఉంది. ఆకాశంలో మేఘాల జాడ కూడా లేకపోవడంతో నడినెత్తిపై సూర్యుడు ఉన్న అనుభూతిని పొందారు. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. వివిధ పనులపై వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉష్ణతాపానికి ఉక్కపోత కూడా తోడైంది. గాలులు కూడా అంతగా లేకపోవడంతో అటు ఎండ వేడి, ఇటు ఉక్కపోతతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆకస్మికంగా క్యుములోనింబస్ మేఘాలు నగరంపై ఆవరించాయి. ఈదురుగాలులు కూడా వీచాయి. అప్పటికప్పుడే కొద్దిపాటి వర్షం కురిసి మాయమైంది. దీంతో రోజంతా ఉష్ణతాపంతో సతమతమైన నగర వాసులు కాసింత ఊరట చెందారు. మరోవైపు మరికొన్ని రోజుల పాటు ఉష్ణతీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అవసరమైన జాగ్రత్తలతో బయటకు వెళ్లాలని వీరు సూచిస్తున్నారు. -
భానుడు @ 45
మచిలీపట్నం/తిరువూరు, న్యూస్లైన్ : భానుడు భగభగ మండుతున్నాడు. రోహిణీకార్తె మరో రెండురోజుల్లో ఉండగానే తన విశ్వరూపం చూపిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరువూరులో 45, మచిలీపట్నంలో 44, నూజివీడులో 43, ఘంటసాలలో 42.8, నందిగామలో 42.08, జగ్గయ్యపేటలో 42, చల్లపల్లిలో 41, అవనిగడ్డలో 40.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓ వైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో మాత్రం వాయుగుండం వాతావరణానికి భిన్నంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం ఉదయం ఏడుగంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. 10 గంటలకే ప్రజలు పనులు చూసుకుని ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం వేళలో ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. మరో కొద్దిరోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. తిరువూరులో ఉష్ణోగ్రత అధికమవుతుండటానికి కారణం 30 కిలోమీటర్ల దూరంలోని సత్తుపల్లి ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులేనని పలువురు భావిస్తున్నారు. కరెంటు కోత.. ఉక్కపోత... అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో సతమతమవుతున్న ప్రజలను కరెంటు కోతలు వేధిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా విధిస్తున్న కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్లలో ఉండలేక, చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement