-
తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆవిర్భావం
చైర్మన్గా భానుమూర్తి ఏకగ్రీవ ఎన్నిక హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల బ్రాహ్మణ సంఘాలతో తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) ఆవిర్భవించింది. దీనికి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు గంగు భానుమూర్తి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం న్యూనల్లకుంటలోని శ్రీ సీతారామాంజనేయ సరస్వతి దేవాలయం ప్రాంగణంలో గంగు భానుమూర్తి అధ్యక్షతన తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 58 మందితో కమిటీని ఏర్పాటు చేయ గా ఆ ప్రతినిధులు గంగు భానుమూర్తిని జేఏసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బండారు రామప్రసాద్, మహిళా ప్రతినిధిగా గీతామూర్తిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ భానుమూర్తి మాట్లాడుతూ తెలంగాణలోని బ్రాహ్మణులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకే జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అన్నారు. అందుకే ఆయన ఎంతో సహృదయంతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.100 కోట్ల బడ్జెట్ కేటారుుస్తాననడం ముదావహమన్నారు. పేద బ్రాహ్మణులకు కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడంతోపాటు పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీరుుంబర్స్మెంట్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేద బ్రాహ్మణులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బర్కత్పురలోని అర్చక భవన్లో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర స్థారుు విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వొడితెల విశ్వనాథరావు, మాజీ వీసీ ధర్మేందర్ రావు, గంగు ఉపేంద్రశర్మలు మాట్లాడారు. అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా పదివేల మంది బ్రాహ్మణ వధూవరుల కోసం ‘కల్యాణమస్తు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఆన్లైన్.. భానుడు
అతడు కంప్యూటర్ కోర్సులు చేయలేదు..ఇంజనీరింగ్ చదవలేదు.. కానీ కంప్యూటర్పై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. ఒక గంట దృష్టి సారించి కంప్యూటర్పై కూర్చుంటే ఓ నూతన వెబ్ సైట్ తయారైనట్లే.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న బనిగండ్లపాటి భానుమూర్తి.. ఆయన గురించి ‘సాక్షి’ పాఠకుల కోసం.. వైరా పట్టణానికి చెందిన బనిగండ్లపాటి భానుమూర్తి చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చింతకాని మండల పరిధిలోని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే విధంగా ఒక వెబ్సైట్ రూపొందించాడు. ఈ సమాచారం తెలుసుకోవాలనుకునే వారు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.చింతకాని.కామ్’ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్లో మండలానికి సంబంధించిన ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు, మరుగుదొడ్లు, జనరల్బాడీ మీటింగ్ల సమాచారం, ఎంపీటీసీ, వార్డు సభ్యుల వివరాలు పొందుపరిచాడు. బీఆర్జీఎఫ్ వెబ్సైట్.. మండల స్థాయిలో బీఆర్జీఎఫ్ నిధుల వ్యయానికి సంబంధించి, మండలపరిషత్ ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు ‘డబ్ల్యూడబ్ల్యూ.కెఎంఎం.కో.ఇన్’ అనే వెబ్సైట్ను కూడా రూపొదించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో బీఆర్జీఎఫ్ పథకం వెబ్సైట్ను అప్పట్లో భానుమూర్తి రూపొం దించారు. ఈ వెబ్సైట్ను అప్పటి కలెక్టర్ ఉషారాణి ప్రారంభించారు. అప్పట్లో ఈ వెబ్సైట్ ద్వారా మండల స్థాయిలోని అధికారులు బీఆర్జీఎఫ్ వివరాలను అప్లోడ్ చేయడం వల్ల రాష్ట్రస్థాయి అధికారులు సైతం వివరాలను తెలుసుకొనే వెసులుబాటు కలిగింది. పంచాయతీరాజ్ వెబ్సైట్.. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగాల కో సం ఒక్క క్లిక్తో ఆశాఖ పూర్తిసమాచారం తెలుసుకొనేందుకు నూతన వెబ్సైట్ను రూపొం దించి ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్న భానుమూర్తి టీపీఆర్ఎంఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన సొంత శాఖకు సంబంధించిన(పంచాయతీ రాజ్) ఉద్యోగులకు అవసరమైన కొత్త వెబ్సైట్ను తయారు చేశారు. ‘డబ్ల్యూడబ్ల్యూ.టీపీఆర్ఎంఈఓ.కామ్’ ద్వారా రాష్ట్రంలోని పది జిల్లాల్లోని పీఆర్ ఉద్యోగులకు కీలకమైన జీఓలు, సర్వీస్ సేవల వివరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, సెలవుల నిబంధనలు, ఆర్ధికపరమైన పూర్తిసమాచారాన్ని పొందుపర్చాడు. వీటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వివరాలను కూడా ఈ వె బ్సైట్లో పొందుపర్చాడు. గతంలో సైతం ఏపీపీఆర్ ఎంఈఏ పేరుతో వెబ్సైట్ను రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేతులుమీదుగా ప్రారంభించారు. బ్రాహ్మణ పరిషత్ కోసం వెబ్సైట్ రూపకల్పన.. బ్రాహ్మణ కులస్తులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చేందుకు ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించారు. అలాగే వివిధ ఛానెల్స్కు సంబంధించిన ఆన్లైన్ న్యూస్ కోసం ప్రత్యేక సైట్లు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టేందుకు ఆన్లైన్ ఖమ్మం వెబ్సైట్ను ఇలా అనేక వెబ్సైట్లను రూపొందించారు. భానుమూర్తికి ఈ వెబ్సైట్ల రూపకల్పనల్లో ప్రతిభను చూసి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ కలెక్టర్ ఉషారాణి, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నడింపల్లి వెంకటపతిరాజు,రాష్ర్టనేత మల్లెలరవీంద్రప్రసాద్ ఇలా అనేక మంది భానుమూర్తిని అభినందించారు. డొమైన్స్ కమిటీ సభ్యునిగా.. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన డొమైన్స్ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యునిగా భానుమూర్తి కొనసాగారు. కంప్యూటర్ నాలెడ్జ్ అధికంగా ఉన్న ఉద్యోగిగా అప్పుడు రాష్ట్ర స్థాయిలో భానుమూర్తి ఎంపికయ్యారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించేందుకు అప్పట్లో ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ రూపొందించిన సాఫ్ట్వేర్లో సమాచారాన్ని కంప్యూటరీకరించారు. ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తుల సలహాల కోసం ఆయన్ను ఎంపిక చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement