-
భానుప్రకాష్ రెడ్డిపై టీటీడీ ఈవో ఫైర్..
-
ఐయూఎన్ఎస్ సభ్యుడిగా డాక్టర్ భానుప్రకాశ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త, బయో కెమిస్ట్రీ విభాగ అధ్యక్షుడు జి.భానుప్రకాశ్రెడ్డి పోషక శాస్త్రాల అంతర్జాతీయ సమాఖ్య (ఐయూఎన్ఎస్) సభ్యుడిగా ఎన్నికయ్యారు. పోషక శాస్త్రాల అభివృద్ధికి భానుప్రకాశ్ రెడ్డి చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. ఎన్ఐఎన్లో పాతికేళ్లుగా పని చేస్తున్న డాక్టర్ రెడ్డి అసాంక్రమిక ఆరోగ్య సమస్యల్లో కణస్థాయి పోషకాలపై పలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ జర్నల్స్లో 190 పరిశోధన పత్రాలను ప్రచురించారు. దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో విటమిన్–ఏ స్థాయిలపై డాక్టర్ భానుప్రకాశ్ రెడ్డి చేసిన విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా విటమిన్–ఏ సప్లిమెంటేషన్ విధానాన్ని మెరుగుపరిచింది. మధుమేహ వ్యాధిలో వచ్చే సమస్యలకు సూక్ష్మ పోషకాల పాత్రపై కూడా డాక్టర్ రెడ్డి పరిశోధనలు చేశారు. -
‘ఆ రిపోర్ట్ను సీఎస్ ఎందుకు దాస్తున్నారు’
సాక్షి, విజయవాడ : టీడీపీ నాయకులు రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకోవడం దురదృష్టకరమని బీజేపీ నేత, టీటీడీ మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీకి చెందిన నగదు, బంగారం డిపాజిట్లు ఏఏ బ్యాంకులలో ఎంత మేరకు ఉన్నాయో టీటీడీ అధికారులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బంగారంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన రిపోర్ట్ను సీఎస్ ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం లోపు రిపోర్ట్ను బహిర్గతం చేయాలని, అలా కాకుంటే ఉద్యమం చేపడతామని తేల్చి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్ధానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం బాధాకరమన్నారు. 1381 కేజీల బంగారాన్ని తమిళనాడు నుంచి తరలిస్తుంటే ఎన్నికల కమిషన్ సీజ్ చేయడం టీటీడీ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్నారు. తిరుమలలో వివిధ బ్యాంకులలో 10,500 కోట్ల నగదు, 9535 కేజీల బంగారు నిల్వలు ఉన్నాయని తెలిపారు. శ్రీవారి బంగారంపై టీటీడీ బోర్డ్ సభ్యులు ఈవోను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 400 కోట్ల రూపాయల బంగారంపై టీటీడీ బోర్డు మీటింగులో ఎందుకు చర్చ జరగలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, టీటీడీ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. -
రాహుల్ పొర్లు దండాలు పెట్టినా...
తిరుపతి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పాదయాత్రలు చేసినా... పొర్లుదండాలు పెట్టినా ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతిలో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించడంపై భానుప్రకాశ్రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రం అంధకారంగా మరిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరిగిన కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని భానుప్రసాద్ రెడ్డి విమర్శించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement