-
ఈ నెల 10న భారత్ బంద్..!
సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, వామపక్షపార్టీలు సోమవారం (సెప్టెంబర్ 10) నాడు భారత్బంద్కు పిలుపునిచ్చాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సగటు వాహనదారుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. మరోవైపు నిత్యావసర ధరలు కూడా మండిపోతున్నాయి. శుక్రవారం దాదాపు 50 పైసల వరకు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు 79.99, డీజిల్ 72.09 రూపాయలకు చేరింది. గత నెల రోజులుగా డీజిల్ ధర 4 రూపాయలు, పెట్రోలు ధర 3 రూపాయలు వరకు పెరిగింది. ఇదిలా ఉండగా.. ధరల పెరుగుదలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ఆర్థికశాఖ శాఖ మంత్రి అరుణ్జైట్లీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇంత జరగుతున్నా ‘భయపడొద్దు’అని మాట్లాడుతున్న కేంద్రమంత్రి వ్యవహారం ఆక్షేపనీయంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఆ ఫలాలు దేశవాసులకు అందించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్శర్మ విమర్శించారు. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గించకుండా ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. కాగా, గత నెల రోజులుగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, డాలర్తో రూపాయి క్షీణత ఫలితంగా దేశీయంగా ఇంధన ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. కాంగ్రెస్ జెండా పండుగ.. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల్ని అవస్థలకు గురిచేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడిపై భారం మోపారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10 (సోమవారం)న భారత్బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన గాంధీ కుటుంబంపై కేసీఆర్ అడ్డగోలు విమర్శలు సరికావని హెచ్చరించారు. సెప్టెంబర్ 11 నుంచి 18 వరకు కాంగ్రెస్ జెండా పండగ నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజల మధ్యేనని అన్నారు. -
భారత్ బంద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తికి తీవ్ర గాయాలు
ఓటు హక్కు వినియోగం అందరి బాధ్యత
కత్తితో దాడిచేసి.. ఆస్పత్రిలో చేర్పించి..!
వైఎస్సార్సీపీ వెంటే యాదవులు
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
పార్టీని వీడిన కీలక నేతలు..
జగనన్నతోనే సంక్షేమాభివృద్ధి
జిల్లాలో 18,631 పోస్టల్ బ్యాలెట్లు
ఫెసిలిటేషన్ కేంద్రాల తనిఖీ
శతశాతం ఓటింగ్ లక్ష్యం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement