-
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: వరుస వలసలతో కంగుతింటున్న కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలంపాటు పనిచేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2014, 2018 ఎన్ని కల్లో ఓడిపోయారు. మొన్నటివరకు పార్టీలో క్రియా శీలకంగా ఉన్న భిక్షమయ్య ఉన్నట్టుండి పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ విషయం ముందే టీపీసీసీ నాయకత్వం పసిగట్టి నిలువరించే ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. వారి కారణంగానే ఓడాను.. కోమటిరెడ్డి సోదరుల కారణంగానే ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు సార్లు ఓటమి పాలయ్యానని.. తన ఉసురు వారికి తగులుతుందని భిక్షమయ్యగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనపై గత ఎన్నికల్లో కొందరిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దించి ఓటమికి కారణమయ్యారని ఆయన ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ను మధుయాష్కీకి లేదా గ్రూపులు లేని బీసీ నేతలకు ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరామని, అయితే కోమటిరెడ్డి సోదరులు అడ్డుపడి వారే టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు. అందుకే గెలవాలని మాయమాటలు ఇటీవల టీఆర్ఎస్లో చేరడానికి కోమటిరెడ్డి సోదరులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. దీంతో భువనగిరి లోక్సభ సీటును ఎలాగైనా గెల వాలని వారు మాయమాటలు చెబుతున్నారని భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదనే బాధతోనే కాంగ్రెస్ పార్టీ, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు భిక్షమయ్యగౌడ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సామాజిక న్యాయం పాటిస్తూ నల్లగొండలో ఓసీ, భువనగిరిలో బీసీకి టికెట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తన అనుచరులతో కలసి రెండు, మూడ్రోజుల్లో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, సంక్షేమ పథకాల వైపే ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, పదేళ్లపాటు తనకు సహకరించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు. -
భిక్షమయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి
సాక్షి,యాదగిరిగుట్ట : కాంగ్రెస్ పార్టీ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని డీసీసీ వైస్ ప్రసిడెంట్ కలకుంట్ల బాల్నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. భిక్షమయ్యగౌడ్కు ఆలేరు టిక్కెట్ ఇవ్వడంపై మంగళవారం స్థానికంగా ఆ పార్టీ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్న భిక్షమయ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం హర్షనీయమన్నారు. భిక్షమయ్యను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, మాజీ ధర్మకర్త పెలిమెల్లి శ్రీధర్గౌడ్, గుండ్లపల్లి కరణ్గౌడ్, చీర శ్రీశైలం, పెలిమెల్లి చిన్న వెంకట్గౌడ్, గుండు నర్సింహగౌడ్, బొజ్జ సాంబేష్, గడ్డం చంద్రంగౌడ్, శేఖర్, బత్తిని ఆనంద్గౌడ్, రాంపల్లి రజినికాంత్గౌడ్ తదితరులున్నారు. భిక్షమయ్యగౌడ్కు టికెట్పై హర్షం ఆత్మకూరు(ఎం) : కాంగ్రెస్ అభ్యర్థిగా బూడిద భిక్షమయ్యగౌడ్కు టికెట్ రావడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు వద్ద పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, నాయకులు యాస లక్ష్మారెడ్డి, కొడిత్యాల నరేందర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, ఎంపీటీసీ దిగోజు నర్సింహాచారి, పాల సంఘం చైర్మన్ జెన్నాయికోడె నగేష్, కందడి అనంతరెడ్డి, ముద్దసాని సిద్దులు, కట్టెకోల హన్మంతుగౌడ్, పరకాల అంజయ్య, బొబ్బల అంజిరెడ్డి, లోడి శ్రీను, చామకూర నారాయణ, చెరుకు శ్రీనువాస్గౌడ్, ఎలగందుల మహేష్, కొసన కిష్టయ్య, ఉగ్గె నరేష్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం: బొమ్మలరామారం : ఆలేరులో కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకుడు మహదేవుని రాజు అన్నారు. మహాకూటమి అభ్యర్థిగా భిక్షమయ్యగౌడ్కు టికెట్ ఖరారు కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ.. మంగళవారం మండలంలో చీకటిమామిడి గ్రామంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యావపూర్ రాజునాయక్, కట్టా మాణిక్యంగౌడ్, శంకర్, జూపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తేనే ఆలేరు అభివృద్ధి తుర్కపల్లి : కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఆలేరు అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని దేవోజినాయక్ తండాలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు నిత్యం అండదండగా ఉండి అభివృద్ధి చేసే నాయకుడు భిక్షమయ్యగౌడ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ, ఎంపీటీసీ యేశబోయిన రాజయ్య, నాయకులు చాడ కరుణాకర్రెడ్డి, కానుగంటి శ్రీనివాస్, బోరెడ్డి హన్మంత్రెడ్డి, బోరెడ్డి మహిపాల్రెడ్డి, ఎరుకల వెంకటేశ్గౌడ్, ఐనాల మహేందర్రెడ్డి, వంగ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయిపల్లిలో ప్రచారం: ఆత్మకూరు(ఎం) : కాంగ్రెస్ అభ్యర్థి భిక్షమయ్యగౌడ్ను గెలిపించాలని పలువురు ఆ పార్టీ నాయకులు కోరారు. గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వారు మండలంలోని రాయిపల్లిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న మేనిపెస్టోను ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాస లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, ఎంపీటీసీ బూడిద రాములుగౌడ్, పాల సంఘం చైర్మన్ జెన్నాయికోడె నగేష్, కందడి అనంతరెడ్డి పాల్గొన్నారు. -
రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసి ఎన్నికలు పెట్టండి
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముడుపుల కేసులో ఇద్దరు సీఎంలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని టీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్ అన్నారు. తమ వద్ద చాలా సమాచారం ఉందని బాగోతాలు బయటపెడతామంటూ ఇద్దరు సీఎంలు పరస్పర ఆరోపణలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ వివాదంలో కేంద్ర కూడా జోక్యం చేసుకోవాలని జాప్యం చేయడం తగదని అన్నారు. విపక్ష నేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా.. ప్రధాని బీజేపీ అగ్ర నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో తన కూతురుకి కేబినెట్ పదవికోసం కేసీఆర్ బీజేపీతో సఖ్యతతో ఉంటూ చంద్రబాబు విషయంలో రాజీపడుతున్నారని అనిపిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబుపై కేసు నమోదు చేయకపోవడమే అందుకు నిదర్శనం అని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులు, కొనుగోళ్లకు పాల్పడుతున్న ఇద్దరు సీఎంలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసి కేంద్రం ఎన్నిక జరపాలని వారు డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- వంట సరిగా చేయలేదని.. భార్యను చంపిన భర్త
Advertisement