-
'విభజన బిల్లును తగలబెట్టడంలో తప్పు లేదు'
విశాఖపట్టణం: ప్రజలు వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో తగలబెట్టడంలో తప్పు లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర రాజధానిలోని ట్యాంక్బండ్పై విగ్రహాలను ధ్వంసం చేస్తే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ నాయకుడు స్పందించలేదన్నారు. విభజన బిల్లు ప్రతులను దగ్ధం చేస్తే తెలంగాణ నేతలకు ఎందుకు కోపం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. విభజనను నిరసిస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద భోగిమంటల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సమైక్య జేఏసీ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమష్బాబు పాల్గొన్నారు. -
విభజన పీడ పోవాలని...
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: విభజన పీడ తొలగిపోవాలని కోరుతూ ఏపీ ఎన్జీవో నాయకులు తెలంగాణ నోట్ బిల్లు ప్రతులను భోగిమంటల్లో దహనం చేశారు. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ అశోక్బాబుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బిల్లు ప్రతులు దహనం చేసిన అనంతరం ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మచిలీపట్నం ఎంపీ కే నారాయణరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేదని, ఒకరి నాయకత్వాన్ని మరొకరు ఒప్పుకోరన్నారు. ఎన్జీవోలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భోగి రోజు ఇంట్లోని పనికిరాని వస్తువులను తగులబెడుతుంటారని, ప్రజలమధ్య చిచ్చుపెట్టిన టీ నోట్ బిల్లును ద హనం చేయడాన్ని సమర్ధించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సోనియాగాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సభలో ఎవరేమన్నారంటే... రావణకాష్టాన్ని రగిల్చారు: దారా సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు రాష్ట్రంలో విభజన అనే రావణకాష్టాన్ని రగిల్చి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించారని మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దారా సాంబయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలికి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు తెలుసా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సెకండ్ ఎస్సార్సీ ఏర్పాటు చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. తప్పుడు రిపోర్టుతో రోశయ్యను భయపెట్టారు: కరణం బలరాం, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిరాహారదీక్ష సమయంలో తెలంగాణ కు చెందిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు తప్పుడు రిపోర్టు ఇచ్చి భయపెట్టారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. తెలంగాణ ఉద్యమం రాజకీయ నిరుద్యోగులు చేసిందని, సీమాంధ్రలో ప్రజల నుంచి ఉద్యమం వచ్చిందన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తా : మాగుంట తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. మాలో సఖ్యత లేదు, సమైక్యత అంతకంటే లేదు. ఇది నిజమన్నారు. పార్లమెంటులో బిల్లు ఓడించిన తరువాత నిజమైన సంక్రాంతి చేసుకుందామన్నారు. కాళ్లు పట్టుకొని మద్దతు కోరతాం: కందుల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని జాతీయ పార్టీల నాయకుల కాళ్లు పట్టుకొని మద్దతు కోరతామని మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి తెలిపారు. విభజన జరిగితే జిల్లా తీవ్రంగా నష్టపోతుందన్నారు. విభజన చరమాంకంలో ఉన్నాం: చలసాని శ్రీనివాసరావు, మేధావుల ఫోరం వేదిక కన్వీనర్ విభజన ప్రక్రియకు సంబంధించి చరమాంకంలో ఉన్నామని మేధావుల ఫోరం వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు తన గుండెను చూపించి కాల్చమన్న ధీరశాలి ప్రకాశం పంతులు అని, ఆయన నివసించిన ప్రాంతం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడనివారిని చిత్తుగా ఓడించాలి: విద్యాసాగర్, కృష్ణా జిల్లా ఎన్జీవో అసోసియేషన్ నాయకుడు అసెంబ్లీలో సమైక్యాంధ్రకు కట్టుబడని శాసనసభ్యులను ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కృష్ణా జిల్లా ఎన్జీవో అసోసియేషన్ నాయకుడు విద్యాసాగర్ కోరారు. స్వాతంత్య్ర ఉద్యమం తరువాత అంతస్థాయిలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లు అడ్డుకోవాలి: శ్రీరాం, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకుడు తెలంగాణ బిల్లు అసెంబ్లీ దాటి వెళ్లకుండా అడ్డుకోవాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకుడు శ్రీరాం కోరారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్తో సహా తెలంగాణ , రాయలసీమ, కోస్తాంధ్రలు నష్టపోతాయన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చే యాల్సింది: బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణపై నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. టీ నోట్ మరణశాసనం : అబ్దుల్ బషీర్, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మరణశాసనంగా మారిన టీ నోట్ను అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్బషీర్ కోరారు. ఈనెల 17 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శాసనసభ సమావేశాల్లో ఏకవాక్య తీర్మానంతో టీ నోట్ను తిప్పిపంపాలన్నారు. ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని తిప్పికొట్టాలి: శివరమేష్రెడ్డి, లోక్సత్తా రాష్ట్ర నాయకుడు రాష్ట్ర విభజనకు సంబంధించి ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని తిప్పికొట్టాలని లోక్సత్తా రాష్ట్ర నాయకుడు అల్లు శివరమేష్రెడ్డి పిలుపునిచ్చారు. విభజనకు సంబంధించి శాసనసభ్యులకు గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజలమధ్య వైషమ్యాలు పెంచారన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్రనాయకుడు బత్తిన నరసింహారావు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు,డాక్టర్స్ జేఏసీ నాయకుడు రాజేంద్రప్రసాద్, సమైక్యాంధ్ర పరిరక్షణ నాయకుడు లంకా దినకర్, ఉపాధ్యాయ సంఘ ం తరఫున వెంకటరావు, న్యాయవాదుల తరఫున సిరిగిరి రంగారావు, ఆర్టీసీ తర ఫున కోటేశ్వరరావు, కాలేజస్ తర ఫున గోరంట్ల రవికుమార్, విద్యార్థుల తరఫున ఆర్ జగదీష్ పాల్గొన్నారు. -
భోగి మంటల్లో టీ నోట్ దహనం నేడు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన సెగను భోగి రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తాకేలా ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ ఏర్పాట్లు చేసింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కేంద్రం తెచ్చిన టీ నోట్ బిల్లును సోమవారం భోగి మంటల్లో దహనం చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఒంగోలులోని పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్ను వేదికగా చేసుకొంది. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టీ నోట్ను దహనం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు హాజరవుతున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ శ్రీరాం హాజరవుతున్నారు. స్థానిక ఎన్జీఓ హోమ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భోగి మంటల్లో టీ నోట్ దహనం గురించి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ వెల్లడించారు. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించిందన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా విభజించిందన్నారు. విభజన వల్ల కలిగే నష్టాల గురించి వివిధ రూపాల్లో నిరసనలు తెలపడంతోపాటు 66 రోజులపాటు నిరవధిక సమ్మెకు దిగినా కేంద్రం ధోరణి మారలేదన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. భోగి మంటల్లో టీ నోట్ దహనం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని అబ్దుల్బషీర్ కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు, రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ శ్రీరాం, కో చైర్మన్ శ్రీనివాస్, లంకా దినకర్, ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, నాసర్మస్తాన్వలి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ నాయకుడు చెంచయ్య, టీచర్స్ అసోసియేషన్ నాయకుడు వెంకటరావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకుడు గోపాల్, లాయర్ల జేఏసీ నాయకుడు సిరిగిరి రంగారావు, విద్యార్థి జేఏసీ నాయకుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement