-
ఉమన్ బైక్ ట్యాక్సీ రైడర్
నాన్న, అన్నయ్య, భర్త, కాకుండా ఎంతో దగ్గరి స్నేహితుడైతేనే అమ్మాయిలు ఇతరుల టూవీలర్ ఎక్కుతారు. అటువంటిది తన స్కూటర్ మీద ఎంతోమందిని ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో దించుతూ వచ్చిన సంపాదనతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది మౌతుషి బసు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మౌతుషి ఊబెర్ టూవీలర్ రైడర్గా మారింది. కరోనా కారణంగా లక్షలాదిమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఆకలికి ఉద్యోగం ఉందా ఊడిందా అనేది తెలియదు. అందుకే ఎంతోమంది తమ అర్హతలకు సరిపోని ఉద్యోగాల్లో చేరి మరీ కుటుంబాలను లాక్కొస్తున్నారు. ఈ కోవకు చెందిన 30 ఏళ్ల అమ్మాయే మౌతుషి. కరోనాకు ముందు పానాసోనిక్ కంపెనీలో ఉద్యోగం చేసేది. కరోనాతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. దీంతో ఉద్యోగాల కోసం తీవ్రంగా వెతికింది. కానీ ఎక్కడా తనకు సరిపోయే జాబ్ దొరకలేదు. అయినా ఏ మాత్రం నిరాశపడకుండా వెతుకుతూనే ఉంది. చివరికి ఊబెర్లో టూవీలర్ రైడర్గా చేరింది. అంతకుముందు రైడింగ్లో ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైడర్గా పనిచేస్తోంది. అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైటర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కాడు. డ్రైవర్ అమ్మాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తర్వాత మౌతుషితో మాట్లాడి ఆమె గురించి తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా ‘సిస్టర్ నువ్వు ఎంతోమందికి ప్రేరణ’ అని అభినందిస్తున్నారు. అంతేగాక రణవీర్ని కూడా తెగపొగిడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతని పోస్టు వేలసంఖ్యలో లైక్లతో తెగ వైరల్ అవుతోంది. కుటుంబం కోసం తన శాయశక్తులా కృషిచేస్తోన్న మౌతుషి ఎంతోమంది యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. -
భలే భలే బైక్ ట్యాక్సీ
సౌలభ్యం: గోవాలో బైక్ ట్యాక్సీ డ్రైవర్లను పైలట్లు అంటారు. వాస్కోడాగామా ప్రాంతంలో స్టాండ్ల మీద పసుపు రంగు బైకులతో సిద్ధంగా ఉంటారు పైలట్లు. కొందరు యూనిఫామ్ కూడా ధరిస్తారు. మీరు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డులో నడుస్తున్నారు. సోమాజిగూడకు పోవాలి. నడిచేందుకు ఓపికుండదు. సమయానికి బస్సుండదు. ఆటో ఎక్కుదామంటే నలభయ్యో యాభయ్యో ఇమ్మంటాడు. జేబులో అంత ఉండదు. ఉన్నా అంతివ్వడానికి మనసొప్పుకోదు. అలాంటి సమయంలో బైకు మీద ఓ వ్యక్తి వచ్చి, పది రూపాయలిస్తే డ్రాప్ చేస్తా అంటే ఎలా ఉంటుంది? ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ తరహా ‘టూ వీలర్ ట్యాక్సీ’ కాన్సెప్ట్ జోరందుకుంటే భవిష్యత్తులో మనకూ అందుబాటులోకి కావచ్చు. టూ వీలర్ ట్యాక్సీ... ఈ కాన్సెప్ట్ ఇండియాకు కొత్త కావచ్చు. కానీ విదేశాల్లో చాలా పాపులర్. చైనాలో 1980 ప్రాంతంలోనే టూ వీలర్ ట్యాక్సీలు నడిచాయి. 90ల్లో ఊపందుకున్నాయి. ప్రస్తుతం చైనాలోని ప్రధాన నగరాలన్నింట్లో బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. 2008 ఒలింపిక్స్ సమయంలో మన అథ్లెట్లు బీజింగ్ నగరంలో బైక్ ట్యాక్సీల మీద షికార్లు చేశారు కూడా. అక్కడ బైక్ ట్యాక్సీ మీద ఐదు కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు మన కరెన్సీ ప్రకారం 50 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆటోలు, ట్యాక్సీలతో పోలిస్తే ఇది చాలా చవక. చైనాలో బైక్ ట్యాక్సీలు ఊపందుకుంటున్న సమయంలోనే బ్రెజిల్లోనూ ఈ సంప్రదాయం మొదలైంది. ఒక బ్యాంకు ఉద్యోగి పది బైకులు కొని ముందుగా టూ వీలర్ ట్యాక్సీ ప్రయాణాలకు శ్రీకారం చుట్టాడు. ఈ ఆలోచన సూపర్హిట్ అయి, దేశంలోనే పలు నగరాలకు విస్తరించింది. ప్రస్తుతం బ్రెజిల్ దేశవ్యాప్తంగా టూ వీలర్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్లోనూ బైక్ ట్యాక్సీ కాన్సెప్ట్ ఉంది. అయితే అక్కడ ఇది కూడా ఖరీదైన వ్యవహారమే. అక్కడి డ్రైవర్లు ఖరీదైన లగ్జరీ బైకులు వాడతారు. కాబట్టి ప్రయాణం కూడా ఖరీదైందే. ఇంకా కంబోడియా, కామెరూన్, ఇండోనేషియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో బైక్ ట్యాక్సీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈ దేశాల్లో బైక్ ట్యాక్సీల కోసం స్టాండ్లు కూడా ఉన్నాయి. మన దగ్గర ఆ రెండు చోట్లే! ఇండియాలో టూ వీలర్ ట్యాక్సీకి ముందుగా శ్రీకారం చుట్టింది గోవానే. ఈ సాగర నగరంలో బైకుల్ని అద్దెకిచ్చే కాన్సెప్ట్ ఎప్పట్నుంచో ఉండగా, కొన్నేళ్ల క్రితం బైక్ ట్యాక్సీ స్టాండ్లు మొదలయ్యాయి. గోవాలో బైక్ ట్యాక్సీ డ్రైవర్లను పైలట్లు అంటారు. వాస్కోడాగామా ప్రాంతంలో స్టాండ్ల మీద పసుపు రంగు బైకులతో సిద్ధంగా ఉంటారు పైలట్లు. కొందరు యూనిఫామ్ కూడా ధరిస్తారు. ఈ బైకులపై ప్రయాణం చేయడానికి మినిమమ్ ఛార్జి రూ.10. రెండు కిలోమీటర్ల తర్వాత కి.మీ.కి రూ.4 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టూరిజం ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఆటోలు, ట్యాక్సీలతో పోలిస్తే 25 శాతం డబ్బులతో బైక్ ట్యాక్సీలపై గోవా నగరమంతా చుట్టేయచ్చు. దేశంలో గోవా తర్వాత పర్యాటక ప్రాంతంగా మంచి పేరున్న కేరళలోనూ బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. కొచ్చిలో ‘టాప్ గేర్ రెంట్ ఏ బైక్’ అనే పేరుతో ఓ సంస్థ ఐదు టూ వీలర్ ట్యాక్సీల్ని అందుబాటులోకి తెచ్చింది. వీటికి మంచి స్పందనే వచ్చింది. కిలోమీటరుకు రూ.4 ఖర్చు చేసి వీటిపై ప్రయాణం చేయొచ్చు. విశేషమేంటంటే... ఈ బైక్ నడిపే డ్రైవర్తో పాటు ప్రయాణికుడికి రూ.లక్ష చొప్పున ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది. మెహబూబ్... బ్రాండ్ అంబాసిడర్! కేరళలో బైక్ ట్యాక్సీ కాన్సెప్ట్కి మంచి పేరు తెచ్చింది అశ్వక్ మెహబూబ్. దుబాయిలో చేస్తున్న ఉద్యోగం బోర్ కొట్టేసి, ఇండియాకు వచ్చిన మెహబూబ్ కొన్నాళ్లపాటు ఏ పనీ లేకుండా గడిపాడు. ఖాళీగా ఉన్న అతణ్ని డ్రాపింగ్ కోసం స్నేహితులు పిలిచేవాళ్లు. వేరే ఉద్యోగం ఏం చేద్దామా అనుకుంటున్న సమయంలో ఎక్కడో టూ వీలర్ ట్యాక్సీ గురించి చదివి, అదే తనకు జీవనోపాధి కాగలదని ఆలోచించాడు మెహబూబ్. తనను డ్రాపింగ్ కోసం పిలిచే మిత్రులకే తన ఆలోచన చెప్పాడు. వాళ్లంతా ప్రోత్సహించారు. క్రమంగా తనుండే ప్రాంతంలో మెహబూబ్ బైక్ ట్యాక్సీ డ్రైవర్గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. మొదట మెహబూబ్ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆటోవాలాలు తర్వాత అతణ్ని అర్థం చేసుకుని, తమ స్టాండ్లోనే అతనికి చోటిచ్చారు. అనుమతులకు సంబంధించి పోలీసుల నుంచి కూడా ఓ దశలో ఇబ్బందులు ఎదురైనా, నేరుగా పోలీస్ కమిషనర్నే కలిసి గ్రీన్సిగ్నల్ తెచ్చుకున్నాడు మెహబూబ్. పేషెంట్లను ఉచితంగా ఆసుపత్రులకు చేరవేస్తూ... లాంగ్ డ్రైవ్లకు డిస్కౌంట్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ మంచి పేరే తెచ్చుకున్నాడు మెహబూబ్. నిరుద్యోగులు తనను సంప్రదిస్తే, వాళ్లకూ ఇదే ఉపాధి కల్పిస్తానంటున్నాడు మెహబూబ్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement