-
చర్మం ఒలిచినా దక్కని ఫలితం
వడోదర: రైల్వే ఉద్యోగం సాధించేందుకు ఓ యువకుడు చేసిన తెగింపు యత్నం బెడిసికొట్టింది. తన బొటన వేలి చర్మాన్ని ఒలిచి స్నేహితుడి వేలికి అతికించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్లో బయటపడ్డాక తనకు బదులుగా పరీక్ష రాయించాలని పథకం వేశాడు. అయితే, బండారం బయటపడి ఇద్దరూ కటకటాల పాలయ్యారు. బిహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తా స్నేహితులు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. రైల్వే శాఖలోని గ్రూప్ డి ఉద్యోగాలకు మనీష్ దరఖాస్తు చేసుకున్నాడు. ఎంపిక పరీక్ష వడోదరలో ఆదివారం జరిగింది. మనీష్ బదులు చదువులో ఎప్పుడూ ముందుండే గుప్తా పరీక్షకు వచ్చాడు. అభ్యర్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ గండం గట్టెక్కేందుకు మనీష్ తన బొటనవేలి చర్మాన్ని ఒలిచి గుప్తా చేతి వేలికి అతికించాడు. గుప్తా ఆ చేతిని ప్యాంట్ జేబులోనే ఉంచుకుని, మరో చేతి వేలితో చేసిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ యత్నం పలుమార్లు విఫలమైంది. అనుమానించిన అధికారులు అతడి మరో చేతిని బయటకు తీయించి, శానిటైజర్ స్ప్రే చేశారు. బొటనవేలికి అతికించిన చర్మ ఊడి కింద పడింది. అధికారుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు మిత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ వెరిఫికేషన్ను ఊహించిన కుమార్..పరీక్షకు ముందు రోజే ఎడమ బొటనవేలిని స్టౌపైన కాల్చుకుని, బ్లేడుతో ఆ చర్మాన్ని ఒలిచి గుప్తా బొటనవేలికి అంటించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒకవేళ, అతికించిన చర్మం ఊడి రాకున్నా వారి పన్నాగం పారేది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. -
వేలిముద్రకు రూ.300
⇒ ‘ఉపకార’, రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలనలో కాలేజీల దందా ⇒ దరఖాస్తుల ఆమోదానికి విద్యార్థుల వేలిముద్రలు అవసరం ⇒ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు ఈశ్వర్ హయత్నగర్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు పరిశీలనకు సంబంధించి వేలిముద్రలు ఇచ్చేందుకు కళాశాల కార్యాలయానికి వెళ్లాడు. రూ. 300 చెల్లిస్తేనే వేలిముద్రలు తీసుకుంటామని సిబ్బంది స్పష్టం చేసింది. గత్యంతరం లేక డబ్బులు చెల్లించి వేలిముద్రలు ఇచ్చాడు. అయితే డబ్బులు తీసుకున్నందుకు రశీదు అడిగితే సిబ్బంది మూకుమ్మడిగా హెచ్చరికలు జారీ చేశారు. ఈశ్వర్కే కాదు.. ప్రస్తుతం కళాశాల విద్యార్థులందరికీ ఇదే అనుభవం ఎదురవుతోంది. విషయం అధికారుల దృష్టికి వెళ్లినా స్పందన కరువైంది. లిఖితపూర్వక ఫిర్యాదు లేదన్న సాకుతో చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: కొత్త కొత్త పేర్లతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే ప్రైవేటు కళాశాలలు తాజాగా కొత్త దందా షురూ చేశాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కోసం చిల్లర వసూళ్లకు ఉపక్రమించాయి. ఈపాస్ ద్వారా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్లో భాగంగా కాలేజీలో వేలిముద్రలు సమర్పించాలి. ఇవి సరిపోలితేనే దరఖాస్తు సంబంధిత సంక్షేమ శాఖకు చేరవేసే వీలుంటుంది. ఈ నెల 15వ తేదీ నాటికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ముగిసింది. దీంతో తాజాగా ఆయా దరఖాస్తుల పరిశీలన మొదలైంది. ముందుగా ఈపాస్ వెబ్సైట్లో నమోదైన దరఖాస్తు సంబంధిత జిల్లా సంక్షేమాధికారి ఐడీకి వెళ్తుంది. అక్కడ ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా సంఖ్య వెరిఫికేషన్ అయ్యాక... బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం కళాశాల ఐడీకి దరఖాస్తులను బదిలీ చేస్తారు. డబ్బులిస్తే సరి... ఈ ఏడాది ఉపకార వేతనాలు, ఫీజు రీయిం బర్స్మెంట్కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ శాఖల పరిధిలో 13.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న వారిలో ఎక్కువమంది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పైనే ఆధారపడ్డారు. అవి మంజూరు కాకుంటే వారి కోర్సు పూర్తవడం కష్టమే. ఈ చిన్న విషయాన్ని సాకుగా చేసుకున్న కాలేజీ సిబ్బంది చిల్లర వసూళ్లకు తెగబడ్డారు. వేలిముద్రలు సమర్పించే సమయంలో నిర్ణీత మొత్తంలో ఫీజు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఇందులో అధికంగా ఇంజనీరింగ్, పీజీ కాలేజీలే ఉన్నాయి. ఒక్కో కాలేజీకి ఒక్కో రేటు కాలేజీల్లో ఒక్కో చోట ఒక్కో రకంగా వసూళ్ల దందా కొనసాగుతోంది. హయత్నగర్, ఇబ్ర హీంపట్నం సమీపంలో ఉన్న కాలేజీల్లో రూ.300 వరకు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఘట్కేసర్, మొయినాబాద్ ప్రాంతం లో ఉన్న కాలేజీల్లో రూ.200గా నిర్ణయించారు. అలా డబ్బులు ఇచ్చిన విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే ఆమోదిస్తూ... డబ్బులు చెల్లించని విద్యార్థుల దరఖాస్తులను పెండింగ్లో పెడుతున్నారు. ఈ విషయంపై ఎస్సీ అభివృద్ధి శాఖకు మౌఖిక ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతు న్నారు. కానీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాసిస్తే కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడు తుందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పది కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు ఫట్!!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు పదికోట్ల వరకు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్లు పాకిస్థాన్లో ఆగిపోనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన 28 రోజుల గడువు లోగా వినియోగదారుల వివరాలను పరిశీలించడం తమ వల్ల కాదని ఆపరేటర్లు చేతులు ఎత్తేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. మొత్తం పరిశీలించాలంటే కనీసం 150-200 రోజుల గడువు కావాలని ఆపరేటర్లు కోరారు. లేనిపక్షంలో ప్రస్తుతమున్న ప్రీపెయిడ్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. పాకిస్థాన్లో మొత్తం 14 కోట్ల మొబైల్ కనెక్షన్లున్నాయి. వాటిలో కేవలం 10 శాతం మాత్రమే పోస్ట్ పెయిడ్. డిసెంబర్ 16 నాటి పెషావర్ స్కూలు దాడి తర్వాత మొత్తం ప్రీపెయిడ్ కనెక్షన్లన్నింటినీ మళ్లీ వినియోగదారుల వివరాలు పరిశీలించాలని పాక్ హోం శాఖ ఆదేశించింది. అక్కడున్న ఐదుగురు ఆపరేటర్లు... మొబిలింక్, యుఫోన్, టెలినార్, వారిద్, జాంగ్ సంస్థల ప్రతినిధులు హోంశాఖ మంత్రి నిస్సార్ అలీఖాన్తో భేటీకానున్నారు. అప్పుడు దీనికో పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement