-
కానరాని పక్షులు కిలకిలలు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరులో నేడు కిలకిల రావాలు వినిపించటం లేదు.. విహంగాల విలవిలలు తప్ప. నీరు, ఆహారం కొరత.. కాలుష్యం బెడద.. వేటగాళ్ల తూటాల వల్ల ఇక్కడకు వచ్చిన విదేశీ పక్షులు మృత్యువాతపడుతున్నాయి. ఫలితంగా కొల్లేరు రానురాను జీవ కళ కోల్పోతోంది.. మనిషిలో పెరిగిన స్వార్థానికి అవి ‘కిల్’ అవుతున్నాయి.. కొల్లేరు అభయారణ్యం పరిరక్షణను గత ప్రభుత్వం గాలికొదిలేయడంతో.. పక్షుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. –ఆకివీడు సాక్షి, పశ్చిమగోదావరి : ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు ప్రముఖమైంది. దీనిని పరిరక్షించేందుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామ్సార్ ఒప్పందం కూడా చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 11వ శతాబ్ద ప్రాంతంలో ఒక పట్టణం. 17వ శతాబ్దం వరకూ ఇక్కడ మనుషులు సంచరించారు. అయితే తెలుగు రాజుల కాలంలో కొల్లేరు పట్టణం దగ్ధమైపోయినట్లు చరిత్ర చెబుతోంది. తదనతంరం పెద్దగొయ్యిగా ఏర్పడి, గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చే అదనపు నీరు, వరదల నీటితో ఈ ప్రాంతం ముంపునకు గురైంది. సముద్రమట్టానికి 10 అడుగుల ఎత్తు వరకూ సుమారు 314 చ.మైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఒక సరస్సుగా గుర్తించి, కొల్లేరు సరస్సుగా నామకరణం చేశారు. ఇలా 18వ శతాబ్దం ప్రారంభంలో కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. సరస్సులో వివిధ రకాల చేపలు, కలువ కాయలు(కలేబికాయలు), నాచు కాయలు ఇలా ఎన్నో రకాల మొక్కలు నీటిలోంచి పుట్టుకువచ్చి కాయలు కాస్తుండేవి. ఆ కాయల్ని తినేందుకు విదేశాల నుంచి 200 రకాలకు పైగా పక్షులు వలస వచ్చేవి. వీటితో పాటు స్థానిక పక్షులు లక్షలాదిగా కొల్లేరులో జీవించేవి. అయితే రానురాను పక్షులు ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు కానరావడం లేదు. ఔ అమలు కాని చట్టాలు కొల్లేరు అభయారణ్య పరిరక్షణకు గత ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఆచరణకు నోచుకోలేదు. కొల్లేరుతో పాటు ఐదో కాంటూర్ను పరిరక్షించడానికి నిత్యం పహరా కాయాల్సిన యంత్రాంగమే చోధ్యం చూస్తోంది. ఫలితంగా ఒకనాడు కొల్లేరులో తిరుగుతున్న తిమింగాల్ని సైతం లెక్కచేయకుండా బాంబులతో పేల్చేసిన చెరువుల స్థానంలో నేడు పుట్టగొడుగుల్లా కొత్త చెరువులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అడపాదడపా దాడుల పేరుతో ఎంపిక చేసుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి, కాసులు దండుకోవడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆటపాకలోని రక్షిత పక్షుల కేంద్రంలో కూడా పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వందలాది విదేశీ పక్షులు మృత్యువాత పడుతున్నాయి. సాక్షాత్తూ అటవీశాఖ అధికారుల కళ్లముందే ఈ దారుణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పక్షుల కేంద్రంలో యంత్రాలతో అభివృద్ది పనులు చేయకూడదనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. పక్షులు సంచరించే ప్రాంతాల్లో విచ్చల విడిగా చేపలు, రొయ్యల చెరువులు పుట్టుకొస్తుండటంతో మేత, యాంటి బయోటిక్స్ విని యోగం విచ్చలవిడిగా జరుగుతూ పక్షుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. కిక్కిస దగ్ధంతో మాడిపోతున్న పక్షులు ఏటా వేసవిలో కొల్లేరులోని వందలాది ఎకరాల్లో కిక్కిస దగ్ధమవుతోంది. కిక్కిస మంటల్లో వేలాది పక్షులు, పక్షి గుడ్లు మాడి మసైపోతున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొల్లేరు కుచించుకుపోతోంది. సరస్సు మనుగడకు ప్రమాదం ఏర్పడింది. అంతరించే స్థాయికి పక్షులు చేరుకున్నాయి. కొల్లేరు కిలకిల రావాలు వినాలంటే, సరస్సు మనుగడ కాపాడాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు సరస్సుపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. నెరలు తీసి బీడుగా.. కొల్లేరు సరస్సులో జలాలు కనుమరుగవుతున్నాయి. కొల్లేరు ప్రాంతం నెరలు తీసి బీడు బారుతోంది. వివిధ రకాల ఫ్యాక్టరీలకు చెందిన రసాయన వ్యర్థాలతో కూడిన నీరు కొల్లేరులో చేరుతోంది. దీంతో పక్షులు చనిపోతున్నాయి. వాటి కళేబరాలు పచ్చిక పొదల్లో పడి కుళ్లి కృశించిపోతున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వాటిలో ప్రసిద్ధిగాంచిన విదేశీ పెలికాన్ పక్షులూ ఉన్నాయి. మొక్కుబడిగా చెక్పోస్టులు కొల్లేరు అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టులు మొక్కుబడిగా ఉన్నాయి. అభయారణ్య పరిధిలో కృష్ణా జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 చెక్ పోస్టులున్నాయి. చేపల మేత, మందులు, వాహనాల రాకపోకల నిషేధంతో పాటు, కొల్లేరు పక్షుల్ని రక్షించాల్సిన బాధ్యత చెక్పోస్టు అధికారులు, సిబ్బందిపై ఉంది. వీరు సరిగా పట్టించుకోనందున అభయారణ్యంలోకి వెళ్లకూడనివన్నీ వెళ్లిపోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటపాకలోని పక్షి ఆవాస కేంద్రం వద్ద ఆధునికీకరణ పనులతో చెల్లాచెదురైన పెలికాన్, ఇతర పక్షులు మూగజీవాలపై ‘వేటు’ కొల్లేరు మూగ జీవాలపై వేటగాళ్ల దాడి అధికమైంది. పక్షి కనిపిస్తే చాలు, దానిని చంపి, తినేసే వరకూ నిద్రపోని వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పక్షుల వేట సాగిపోతోంది. కొల్లేరులో పరజ, కొంగ, గూడు కొంగ, నత్తకొట్టుడు, కొండింగాయ, పెలికాన్ పక్షులతో పాటు దొరికిన పక్షిని చంపి తినేస్తున్నారు. వేటాడిని పక్షుల్ని రహస్యంగా ఏలూరు, ఆకివీడు, భీమడోలు, గణపవరం, భీమవరం, కాళ్ల, పాలకొల్లు, నిడమర్రు, ఉంగుటూరు, కృష్ణా జిల్లా కైకలూరు, కలిదిండి, మండలవల్లి, గుడివాడ, ముదినేపల్లి తదితర మండలాలకు రహస్యంగా తీసుకువెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రహస్యంగా వేట సాగిస్తున్నారు పక్షులను వేటాడకూడదనే నిషేధం ఉన్నప్పటికీ పక్షుల్ని వేటాడి రహస్యంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రూ.100 నుంచి రూ.500 వరకూ అమ్ముతున్నారు. –గాతల ఇమానియేలు, జువ్వలపాలెం తరిగిపోతున్న పక్షి జాతి కొల్లేరు కాలుష్యానికి గురైంది. మరోపక్క అడపాదడపా వేటాడుతున్నారు. దీంతో చాలా రకాల పక్షులు చనిపోయాయి. ప్రస్తుతం ఉన్న పక్షులకు నీరు, ఆహారం కొరత ఏర్పడింది. దీంతో అవి బలహీనమైపోయాయి. ఆవాస కేంద్రాలు కూడా లేక పక్షులు అంతరించిపోతున్నాయి. పక్షుల ఆవాస కేంద్రాలకు ప్రభుత్వం పది వేల ఎకరాలు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –బలే గణేష్, శృంగవరప్పాడు, కృష్ణా జిల్లా, కొల్లేరు -
దొరికినోళ్లకు దొరికినన్ని!
ఆటపాక (కైకలూరు) : అనుకున్నంతా అయ్యింది.. ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువులో చేపలను ప్రజలు సోమవారం లూటీ చేశారు. దీంతో 2012 జూన్ సంఘటన పునరావృతమైంది. ఉదయం నుంచి ఆటపాక, కోమటిలంక గ్రామాలతో పాటు సమీప గ్రామ ప్రజలు వందలాదిగా వచ్చి అటవీశాఖ ఆధీనంలోని చెరువులో ఒక్కసారిగా దిగారు. అందినకాడికి చేపలను ఒడిసి పట్టుకుని పరారయ్యారు. యువకులు, వృద్ధులతో పాటు మహిళలు కూడా చెరువులో దిగి చేపల వేటలో పాల్గొన్నారు. ఆటపాక పక్షుల కేంద్రం చెరువు 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు దిక్కుల నుంచి ఒక్కసారిగా చెరువులో దిగి సంచులతో బతికిన చేపలను యథేచ్ఛగా తీసుకెళ్లి విక్రయించారు. కొందరు నాలుగు చేపలను తాళ్లు కట్టి ఈడ్చుకుంటు వెళ్లారు. ఒక్కో చేప రూ.700 నుంచి రూ.1000 పలికింది. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను నిలువరించడం అటవీ సిబ్బంది, పోలీసులకు వీలు పడలేదు. అటవీ శాఖ రేంజర్ పర్యావరణ కేంద్రంలో డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహిస్తుండగానే చేపల చోరీ జరగడం గమనార్హం. చేపల లూటీ పూర్తయిన తర్వాత కైకలూరు టౌన్ ఎస్సై షబ్బీర్ అహ్మద్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికైనా చేపలను పట్టుకునే అవకాశం కల్పించాలని ఆటపాక ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు. అటవీశాఖ అధికారుల హైడ్రామా... అభయారణ్య పరిధిలోని పక్షుల కేంద్ర చెరువులో చేపలను పట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని డాంబికాలు పలికిన అటవీశాఖాధికారులు కళ్లెదుట అభయారణ్యంలో చేపలను తరలిస్తుంటే నిమ్మకునీరెత్తినట్లు మిన్నకున్నారు. అటవీశాఖ రేంజర్ ధన్రాజ్ ఈఈసీ కేంద్రం వద్ద ఆటపాక, జాన్పేటలకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఆటపాక గ్రామ పరిధిలో మొత్తం 96 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 44 పర్యావరణ అభివృద్ధి కమిటీ (ఈఈసీ) సభ్యులు కలిగినవే. డ్వాక్రా సంఘాలు, ఈఈసీ సంఘాలు బ్యాంకులో జాయింట్ అకౌంట్ తీసుకోవాలని, చెరువులో అడుగున ఉన్న చేపలను పట్టుకుని వచ్చిన మొత్తంలో సగం గ్రామాభివృద్ధికి, మిగిలిన సగం పక్షుల కేంద్ర అభివృద్ధికి ఉపయోగించాలని రేంజర్ వారికి సూచించారు. ప్రస్తుతం చెరువులో జరుగుతున్న లూటీని పోలీసుల సహకారంతో అడ్డుకుని చేపలు పట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ నిర్ణయం ముందే తీసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. చెరువులో ఇప్పటివరకు నీరు లేక చనిపోయినవి, గ్రామస్తులు తీసుకెళ్లినవి, ఇతరులు రాత్రివేళల్లో తరలించినవి కలిపి దాదాపు కోటి రూపాయల విలువైన చేపలు ఉంటాయని అంచనా. మిగిలినవి కూడా చాలా విలువే చేస్తాయని తెలుస్తోంది. ఇదిలావుంటే డ్వాక్రా మహిళా సంఘాలతో చెరువులో చేపలకు కేవ లం రూ.10 లక్షలు పాట జరిగిందనే వదంతులు వినిపిస్తున్నాయి. బెదిరిన పక్షులు... వందలాదిమంది ప్రజలు ఒక్కసారిగా చెరువులోకి దిగడంతో ఆటపాక పక్షుల కేంద్రంలోని పెలికాన్, పెయింటెడ్ స్టాక్ పక్షులు పరారయ్యాయి. బెదిరి వెళ్లిన పక్షులు తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆటపాక పక్షుల కేంద్రం పక్షులు లేక కళావిహీనంగా మారింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement