-
రేవంత్ది ఒకే మాట..నా వంతు ఎంత అనే!
సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవానికి ఎవరైనా రేవంతూ అని మాట్లాడిస్తే తన వంతు ఎంత అని అడుగుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన వాళ్లు కూడా రేవంత్ని నీ రేటెంతరెడ్డి అని అడుగుతున్నారంట అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ముందు పెట్టుకొని సెటి ల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. గురువారం పార్టీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న లోలోపల సెటిల్మెంట్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దాని కంటే కూడా కాంగ్రెస్ హయాంలోనే అవినీతి, అరాచకాలు ఎక్కువ జరుగుతున్నా యని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమా లపై నాలుగు నెలలు దాటినా ఒక్కదాని మీద ఎంక్వైరీ పూర్తి అవ్వలేదన్నారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి సెటిల్మెంట్లు చేస్తున్నారని, ఆ క్రమంలోనే కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పజెప్పడం లేదని నిందించారు. రాహుల్ ట్యాక్స్ వసూలు ఎలాగంటే.. రాహుల్గాంధీ ట్యాక్స్ వసూలుకు సంబంధించి అనుసరిస్తున్న ఒక విధానాన్ని తాను బయట పెడుతున్నానని మహేశ్వర్రెడ్డి వివరించారు. ’’గత ప్రభుత్వం ఓ సంస్థకు నగరం నడిబొడ్డున రూ.1,500 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకు (నెలకు ఎకరానికి రూ.2లక్షల లీజ్కు) ఇస్తే దానిని కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రద్దు చేసి అది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మరో జీవో ద్వారా అదే భూమిని అదే సంస్థకు రేవంత్రెడ్డి కేటాయించారు.’’ అని ఆరోపించారు ఇందులో భాగంగా రూ.300 కోట్లు తీసుకుని ఢిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే వీటికి సంబంధించిన అంశాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ భూమికి సంబంధించే ఇంత కుంభకోణం చేస్తే.. కాళేశ్వరం, ధరణిల్లో ఇంకా ఎంత కుంభకోణం చేస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో ఇంకో అవినీతి బయటపెడతా మరో రెండు రోజుల్లో మరో అవినీతి అంశంపై ఆధారాలతో సహా మీడియా ముందుకి వస్తా నని మహేశ్వర్రెడ్డి వెల్లడించారు. మహేశ్వర్ రెడ్డికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న భయంతో సీఎం రేవంత్రెడ్డి సచివాలయం ఆరో ఫ్లోర్లోకి ఎవరినీ రానివ్వకుండా సెక్యూ రిటీ పెంచారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ సెక్యూరిటీ పెంచి ఎవరినీ అనుమతించడం లేదన్న సమాచారం తనకు అందిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లడంతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి భయం పట్టుకుందన్నారు. -
పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదు
సాక్షి హైదరాబాద్: తనపై క్రమశిక్షణా చర్య తీసుకుంటూ పంపించిన నోటీస్లో పేర్కొన్నట్లు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ సమాధానమిచ్చారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించనందున తన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరారు. సోమవారం ఈ మేరకు పార్టీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సభ్యకార్యదర్శి ఓం పాథక్కు లేఖ రాశారు. ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆగస్ట్ 23న రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. 10 రోజుల్లో నోటీస్కు సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీ ఆదేశించింది. పీడీయాక్ట్పై అరెస్టయి జైలులో ఉన్నందున సోమవారం నోటీస్కు సమాధానమిస్తూ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే.. ‘మతప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాపై.. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం సాగిస్తున్న అరాచకాలనే ప్రశ్నించాను తప్ప ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేయలేదు. నేను పంపిన వీడియోలోనూ ఏ మతాన్ని కించపరచలేదు. పార్టీ ఎమ్మెల్యేగా 8 ఏళ్ల కాలంలో ఏనాడూ పార్టీ లైన్ దాటి ప్రవర్తించలేదు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నా. మునావర్ ఫారుఖీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్లను కించపరచలేదు’అని ఈ లేఖలో పేర్కొన్నారు. -
ఆ అవకాశం ఎవరికో? పోటీలో రఘునందన్ రావు, ఈటల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్షనేత(బీజేఎల్పీ)గా ఎవరిని ఎన్నుకుంటారనేది చర్చనీయాంశమవుతోంది. బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. రాజాసింగ్తో పాటు ఎం.రఘునందన్రావు, ఈటల రాజేందర్ పార్టీ ఎమ్మెల్యేలు గా ఉన్నారు. పార్టీలో సీనియర్గా ఉన్న రఘునందన్రావుకు ఈ అవకాశం లభిస్తుందా? లేదా మంత్రిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవమున్న ఈటలకు దక్కుతుందా? అని పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడిగా ఈటలకు మంచి ప్రాధాన్యం లభించడం, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించినందున రఘునందన్ వైపు రాష్ట్ర నాయకత్వం మొగ్గుచూపొచ్చుననే వాదన పార్టీలో వినిపిస్తోంది. చదవండి: ‘సిట్టింగులందరికీ సీట్లు’ -
బడ్జెట్పై చర్చను ప్రతిపక్షం ప్రారంభించదా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విస్మయం సాక్షి, హైదరాబాద్: బడ్జెట్పై చర్చను ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రారంభించాల్సి ఉన్నా, బుధవారం శాసనసభలో చర్చ జరిగిన తీరుపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసంతృప్తిని వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్ను సోమవారం ప్రవేశపెట్టగా, బుధవారంనాడు దీనిపై చర్చ ప్రారంభమైంది. బడ్జెట్పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ చర్చను ప్రారంభించడం ఇప్పటిదాకా ఆనవాయితీ. దీని ప్రకారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చర్చను ప్రారంభించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి బుధవారం సభకు హాజరుకాకపోవడం వల్లనే బీజేపీ సభ్యులు చర్చను ప్రారంభిం చినట్టుగా కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. కీలకమైన బడ్జెట్ ప్రారంభ చర్చ అవకాశా న్ని మరో పార్టీకి వదిలివేయడంపై ఆ పార్టీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
అరిగిపోయిన రికార్డు: బీజేఎల్పీ
సాక్షి, హైదరాబాద్: ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అరిగిపోయిన రికార్డులా ఉందని బీజేఎల్పీనేత జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల ఆకాంక్షలను ఈ ప్రసంగం ప్రతిబింబించలేదని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన విలేకరులో మాట్లాడుతూ ఈ ప్రసంగం మేడిపండు చందంగా ఉందని, కాకిలెక్కలతో కూడుకుని ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల అమలుపై కార్యాచరణ గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం ఏమి సాధించిందో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు ప్రగతిభవన్ను దాటడం లేదని ఎద్దేవా చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement