-
82 మంది విద్యార్థినులకు విముక్తి
అబుజా: ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా నైజీరియాలోని ఉగ్రవాద సంస్థ బొకోహరమ్ చెర నుంచి మరో 82 మంది ‘చిబోక్’ విద్యార్థినులు విడుదలయ్యారు. వారు దేశాధ్యక్షుడు మహమ్మద్ బుహారీని కలవనున్నారు. 2014 ఏప్రిల్ 14న బొకోహరమ్ ఉగ్రవాదులు చిబోక్ పట్టణంలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై దాడి చేసి 276 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేశారు. అనంతరం 57 మంది తప్పించుకోగా, 219 మంది బందీలుగా మిగిలిపోయారు. వారిని ఇస్లాంలోకి మార్పించినట్లు అనంతరం బొకోహరమ్ వీడియో సందేశంలో పేర్కొంది. చర్చల ఫలితంగా గత అక్టోబర్లో 21 మంది బాలికలు ఉగ్రవాదుల చెర నుంచి విడుదలయ్యారు. ఆరు నెలల అనంతరం మరో 82 మంది విద్యార్థినులు విడుదలై నట్లు అధ్యక్ష భవనం తెలిపింది. అయితే ఇందుకుగాను ఎంతమంది ఉగ్రవాదులను విడుదల చేయనున్నారో మాత్రం వెల్లడించలేదు. -
శరణార్ధులపై ఆత్మాహుతి దాడులు
నైజీరియా: నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. శరణార్ధుల క్యాంపులపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఉగ్రవాదుల తాకిడిని తట్టుకోలేక నైజీరియాకు ఈశాన్య దిక్కున ఉన్న మైదుగురి ప్రాంతంలోకి వలస వెళ్లి కొన్ని టెంట్ల కింద శరణార్థులుగా ఉంటున్నవారిపై ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుధవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు ఆత్మాహుతి దాడులు వరుసగా జరిగాయని ఈ దాడుల్లో క్యాంపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, టెంట్లు పూర్తిగా కాలిపోయాయని అక్కడి అధికారులు చెప్పారు. కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు తెలిపారు. అయితే, ఎంతమంది చనిపోయారనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎజెన్సీకి చెందిన అధికారి ఇబ్రహీం అబ్దుల్కాదిర్ మాట్లాడుతూ ‘మునా క్యాంపుల్లో బాంబుదాడులు జరిగాయి. నాలుగు ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నట్లు సమాచారం అందింది. మా వాళ్లు అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది’ అని చెప్పారు. -
పొరపాటున బాంబేశారు..100 మంది మృతి
నైజీరియా: ఉగ్రవాదులపై వేయాల్సిన బాంబును పొరపాటున శరణార్థుల శిబిరంపై వేయడంతో 100 మందికి పైగా మృతి చెందిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. కామెరూన్ సరిహద్దు సమీపంలోని రాన్ ప్రాంతంలో.. బోకోహారమ్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ విమానం శరణార్థుల శిబిరంపై బాంబు జారవీడిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను నైజీరియా మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబొర్ ధృవీకరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని బోర్నో స్టేట్ గవర్నమెంట్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధితుల్లో శరణార్థులతో పాటు శిబిరంలో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేషన్స్ వితౌట్ బార్డర్స్, రెడ్ క్రాస్ సంస్థల సిబ్బంది ఉన్నట్లు సమాచారం. -
బాలికలు బాంబులు పేల్చుకుని విధ్వంసం!
మైదుగురి: రెండు రోజుల కిందట తరహాలోనే మరో ఇద్దరు బాలికలు విధ్వంసం సృష్టించారు. దీంతో కొందరు సైనికులు కూడా మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నైజీరియాలోని మైదుగురి నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. విక్టర్ ఐసుకు అనే పోలీస్ అధికారి కథనం ప్రకారం.. నైజీరియా వాయవ్యప్రాంతంలో ఉన్న మైదుగురి సిటీ మార్కెట్లో అప్పటివరకూ అంతా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు గుర్తుతెలియని పదేళ్లలోపు వయసున్న బాలికలు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేపింది. ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదన్నారు. మొదట మార్కెట్లో ఓ బాలిక ఆత్మాహుతి దాడికి పాల్పడగా కొన్ని సెకన్లలోనే మరో బాలిక విధ్వంసానికి పాల్పడిందని విక్టర్ ఐసుకు అనే పోలీసు తెలిపాడు. బొకోహరమ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడి ఉంటుందని స్థానిక మీడియాకు వివరించారు. రెండు రోజుల కిందట నైజీరియాలో జరిగిన మహిళల ఆత్మాహుతి దాడుల్లో 57 మందికి పైగా మృతిచెందగా, 177 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బొకోహరమ్ ఉగ్రసంస్థ గత ఏడేళ్ల కాలంలో 20 వేలకు పైగా పౌరులను పొట్టనపెట్టుకుంది. 26 లక్షల మంది ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వలస వెళ్లారు. -
22 మంది ఉగ్రవాదులు హతం
లాగోస్: బోకోహారమ్ ఉగ్రవాదులపై నైజీరియన్ ఆర్మీ విరుచుకుపడింది. బోర్నో రాష్ట్రంలో జరిపిన సైనిక ఆపరేషన్లో 22 మంది బోకోహారమ్ ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ అధికారి కల్నల్ సాని ఉస్మాన్ వెల్లడించారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు సైనికులు కూడా మృతి చెందారని, మరో ఇద్దరు గాయపడ్డారని ఆయన వెల్లడించారు. లోగోమని ప్రాంతంలో రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లతో విరుచుకుపడిన బోకోహారమ్ ఉగ్రవాదులపై సైన్యం దాడి జరపడంతో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఘటనలో ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిల్స్ తో పాటు భారీ మొత్తంలో గ్రెనేడ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement