-
ఉరితాడై.. ఉసురు తీసిన 'ఊయల' !
మహబూబ్నగర్: ఇంటివద్ద చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటున్న ఓ బాలిక ప్రమాదవశాత్తు ఉరిపడి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సిద్దాపూర్ హెడ్కానిస్టేబుల్ రెడ్యానాయక్ కథనం ప్రకారం.. బొమ్మన్పల్లికి చెందిన పరశురాములు చిన్న కూతురు శ్రావణి(10) ఇంటి ఆరుబయట చీరతో కట్టిన ఊయలలో శుక్రవారం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక మెడకు ఉరి పడింది. వెంటనే కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి ఊయల నుంచి తీశారు. అపస్మారక స్థితికి వెళ్లిన బాలికను వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నాగర్కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్ రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ బాలిక శనివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
రెప్పపాటులో ఘోరం
పోలీసుల బైక్ను ఢీకొట్టి బావిలో పడిన ట్రాక్టర్ నలుగురు యువకులు దుర్మరణం ప్రమాదం నుంచి తప్పించుకున్న యజమాని బాధిత కుటుంబాలకు మంత్రి, ఎమ్మెల్యే పరామర్శ సైదాపూర్/ చిగురుమామిడి : మద్యం మత్తు... అతివేగం.. ర్యాష్ డ్రైవింగ్ రెప్పపాటులో నలుగురి ప్రాణాలు తీసింది. ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఓ యువకుడు మిత్రులకు దావత్ ఇచ్చేందుకు వారిని కొత్తవాహనంపై తీసుకెళ్లాడు. అందరూ కలిసి రాత్రి వరకూ మద్యం తాగారు. తిరుగు ప్రయాణంలో రెప్పపాటులో ఘోరం జరిగింది. మద్యం మత్తులో వేగంగా ట్రాక్టర్ నడుపుతూ అటుగా వెళ్తున్న బైక్ను ఢీకొట్టారు. ఏం జరిగిందో అని వెనుకకు తిరిగి చూసేలోపు వాటి ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఐదుగురిలో నలుగురు ట్రాక్టర్తో సహా బావిలో పడి దుర్మరణం చెందారు. మరో యువకుడు త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు. ఈ విషాద సంఘటన సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల శివకుమార్ మంగళవారం కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇంజిన్ కూలింగ్ కోసం మూడు రోజులుగా ట్రాక్టర్ను తిప్పుతున్నాడు. ట్రాక్టర్ కొన్నందుకు దావత్ ఇచ్చేందుకు తమ మిత్రులు అదే గ్రామానికి చెందిన బొల్లి రాజు(18), కొంకట శ్రీకాంత్(22), మాచమల్ల రఘు(22), పిల్లి సంతోష్(24)ను తీసుకుని శుక్రవారం ట్రాక్టర్పై సైదాపూర్కు వెళ్లాడు. అక్కడి వైన్షాపులో అందరూ కలిసి మద్యం తాగారు. రాత్రి 10 గంటల వరకూ అక్కడే ఉన్నారు. బయల్దేరే ముందు మరో మద్యం బాటిల్ కొనుక్కున్నారు. మత్తులోనే ట్రాక్టర్పై స్వగ్రామానికి బయల్దేరారు. దుద్దెనపల్లి వద్ద బ్రిడ్జి దాటిన తర్వాత కోహెడ ఏఎస్సై రాజేందర్, మరో కానిస్టేబుల్ వెళ్తున్న బైక్ను ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఏఎస్సై, కానిస్టేబుల్ కిందపడ్డారు. భయంతో వారిని గమనిస్తూనే అంతే వేగంగా ట్రాక్టర్ ముందుకు పోనిచ్చాడు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన ట్రాక్టర్ యజమాని శివకుమార్ కిందకు దూకాడు. ట్రాక్టర్ నలుగురు యువకులతో సహా రెప్పపాటులో చెట్లపొదల్లో ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దీంతో శివకుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదానికి గురైన ఏఎస్సై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీధర్కు సంఘటన వివరాలన్నీ రాజేందర్ వివరించాడు. ఎస్సై క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తన సిబ్బందితో ప్రమాద స్థలంలో రాత్రంతా బందోబస్తు ఏర్పాటు చేశారు. బావిలో పడిన ట్రాక్టర్, యువకుల కోసం లైట్లు వేసి వెతికినా కనిపించలేదు. దీంతో ఫైరింజన్ను రప్పించారు. బావిలోని నీళ్లు తోడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మరో మోటార్ బిగించి బావిలోని నీళ్లు తోడేశారు. దీంతో ట్రాక్టర్, పిల్లి సంతోష్ మృతదేహం బయటపడింది. ప్రొక్లెయిన్తో శవాన్ని బయటకు తీశారు. ఈలోగా కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, కరీంనగర్ డీఎస్పీ రామారావు, హుజూరాబాద్ రూరల్ సీఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆర్డీవో టెలిస్కోపిక్ క్రేన్ తెప్పించి ట్రాక్టర్తోపాటు బొల్లి రాజు,కొంకట శ్రీకాంత్, మాచమల్ల రఘు మృతదేహాలను పైకి తీశారు. కత్తుల శివకుమార్ కోసం బావిలో మరోసారి వెతికినా కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకుని ఉంటాడని భావించారు. మృతదేహాలను హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ట్రాక్టర్ యజమాని కనిపించకపోవడంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ రూరల్, హుస్నాబాద్ సీఐలు ఎండీ.గౌస్బాబా, దాసరి భూమయ్య వారికి నచ్చజెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం – మంత్రి ఈటల సంఘటన స్థలానికి మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీశ్కుమార్ వచ్చారు. మృతదేహాలను పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. శోకసంద్రమైన బొమ్మనపల్లి.. సైదాపూర మండలంలో జరిగిన ప్రమాదంతో బొమ్మనపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. మృతులందరూ 25 ఏళ్లలోపే కావడంతో ఎదిగిన తమ కొడుకులు దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఖఃసారగంలో మునిగిపోయారు. డిగ్రీ చదివిన పిల్లి సంతోష్కుమార్.. పిల్లి నీలమ్మ–లక్ష్మీనారాయణ దంపతులకు మూడో సంతానం పిల్లి సంతోష్కుమార్. డిగ్రీవరకు చదివాడు. జీవనోపాధి నిమిత్తం నాలుగేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అన్న, అక్క ఉన్నారు. వీరిది సామాన్య రైతుకుటుంబం. ఎనిమిది నెలల క్రితం శ్రీకాంత్ వివాహం కొంకట శ్రీకాంత్ హుస్నాబాద్ మండలం అంతకపేట్కు చెందిన హరిణిని ప్రేమించాడు. ఎనిమిది నెలల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. హరిణి ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. 9వ తరగతి వరకే చదువుకున్న శ్రీకాంత్ కూడా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి నలుగురు సోదరులు, ఒక అక్క ఉంది. నానమ్మ వద్ద ఉంటున్న బొల్లి రాజు.. బొల్లి రాజు తల్లిదండ్రులు బొల్లి స్వరూప, బొల్లి శ్రీనివాస్ జీవనోపాధి నిమిత్తం సైదాపూర్ మండలం చింతపల్లిలో ఉంటున్నారు. రాజు బొమ్మనపల్లిలోని తన నానమ్మ వద్ద ఉంటూ కూలీపనులకు వెళ్తున్నాడు. ఇతడు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. రాజుకు ఒక చెల్లి ఉంది. వీరిది కూడా సామాన్య కుటుంబమే. స్నేహానికి ప్రాణం ఇచ్చే రఘు.. బొమ్మనపల్లికి చెందిన మాచమల్ల పద్మ, మల్లేశం దంపతులకు రెండో కుమారుడు మాచమల్ల రఘు. పదో తరగతి వరకు చదువుకున్నాడు. బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్నాడు. ఆటోను కూడా బ్యాంకులో రుణం తీసుకుని కొనుగోలు చేశాడు. స్నేహితుడు కత్తుల శివకుమార్ పిలవడంతో వెళ్లి మత్యువాతపడ్డాడు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement