-
బోనాలకు సర్వం సిద్ధం
నేడు జాతర హాజరు కానున్న మంత్రులు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు చార్మినార్: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు పాతబస్తీలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం ఉదయం జాతరకు పలువురు మంత్రులు హాజరవుతున్నట్టు మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు పొటేల్ రాము యాదవ్, కార్యదర్శి దత్తాత్రేయ, మాజీ అధ్యక్షుడు అంజయ్య తెలిపారు. పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంతో పాటు, మీరాలంమండి, ఉప్పుగూడ, సుల్తాన్షాహి, గౌలిపురా, మురాద్మహాల్, అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయాలు.. బేలా ముత్యాలమ్మ ఆలయం, బంగారు మైసమ్మ, రాంబక్షి బండ తదితర ఆలయాలను సిద్ధం చేసినట్టు వారు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారన్నారు. బోనాలకు గట్టి పోలీసు బందోబస్తు సిటీబ్యూరో: గొల్కొండ, లష్కర్ బోనాలను శాంతియుతంగా నిర్వహించిన నగర పోలీసులు నేడు పాతబస్తీలో జరిగే బోనాల ఉత్సవాలపై దృష్టి సారించారు. ఈ మేరకు పాతబస్తీలో పోలీసు బలగాలను మోహరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పికె ట్లను ఏర్పాటు చేశారు. గస్తీ పోలీసులను, శాంతి కమిటీలను అప్రమత్తం చేశారు. లాల్దర్వాజ బోనాలకు వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసు కమిషనర్ ఎమ్.మహేందర్రెడ్డి ఈ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. బందోబస్తు చర్యలపై ఆయన అన్ని జోన్ల డీసీపీలతో చర్చించారు. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ చాంద్రాయణగుట్ట: లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవి ప్రసాద్ శనివారం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
బోనాల పండుగకు రూ.10 కోట్లేనా?
ఎంపీ దత్తాత్రేయ అసంతృప్తి రాంగోపాల్పేట్: నగరంలోని బోనాల ఉత్సవాలకు రూ.100కోట్లు విడుదల చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే కేవలం రూ.10 కోట్లు కేటాయించడం దారుణమని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఆయన ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిధుల మంజూరులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. చివరకు ఆ నిధులను సైతం ఆయా శాఖల నుంచే కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరిన్ని నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు శ్యాంసుందర్గౌడ్, భవర్లాల్వర్మ, పిల్లి శ్రీనివాస్, పెద్ది రవీందర్, బీరం నర్సింగ్రావు తదితరులు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement