-
సెబీ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: మార్కెట్ రెగ్యులేటరీ సెబీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించుకునే అనుమతిని మంజూరు చేసింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.55 వరకూ ట్రేడింగ్ నిర్వహించుకోవచ్చని శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్న3.30 వరకు ట్రేడింగ్ అనుమతి ఉండగా,తాజానిర్ణయంతో మరో ఎనిమిది గంటలకుపాటు ట్రేడింగ్ సమయాన్నిపొడిగించింది. అంటే దాదాపు రోజంతా ట్రేడింగ్ చేసుకునే అవకాశమన్నమాట. ఈ ఆదేశాలు, 2018, అక్టోబర్ 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయంతో బిఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అక్టోబర్ నుంచి దాదాపు 14 గంటల పాటు డెరివేటివ్స్ ట్రేడింగ్ కొనసాగనుంది. ఈమేరకు జారీ చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలు సెబీ నుండి ముందుగా అనుమతి పొందాలి. రిస్క్ మేనేజ్మెంట్, సెటిల్మెంటు ప్రాసెస్ తదితర అంశాలకు లోబడి ఈ అనుమతి ఉంటుంది. స్టాక్స్, వస్తువుల వ్యాపారాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యను చేపట్టినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పేర్కొంది. ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్లో అక్టోబరు 1 నుంచి 11.55 గంటలవరకు ఎక్స్ఛేంజ్ వర్తకాన్ని పొడిగించింది. ప్రస్తుతం కమోడిటీ మార్కెట్ లో ఉదయం 10గంటలనుంచి రాత్రి 11.55నిమిషాల దాకా ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉన్నసంగతి తెలిసిందే. -
జీఎంఆర్ ఎనర్జీ ఐపీవో ఉపసంహరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రాకి చెందిన అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూను ఉపసంహరించుకుంది. రూ.1,800 కోట్ల పబ్లిక్ ఇష్యూకి సంబంధించి సెబీకి దాఖలు చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పి)ను వివిధ వ్యాపార కారణాలతో ఉపసంహరించకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియచేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తంలో రుణ భారం తగ్గించుకోవాలని జీఎంఆర్ ఇన్ఫ్రా భావించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
మూడో దశలో 63.53% పోలింగ్
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement