-
నేనొకడిని ఉన్నానని గుర్తుందా..?
అనంతపురం సిటీ: ‘‘అధికారులపై వచ్చిన ఆరోపణలకు సంజాయిషీ ఇవ్వమంటే ఇవ్వరు... జెడ్పీ చైర్మన్గా నా దృష్టికి తీసుకురాకుండానే ఓ అధికారి జెడ్పీ ఆవరణలోని కార్యాలయాన్ని తనకు నచ్చిన చోటుకు మార్చుకుంటాడు... ఇక అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీల వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయని ఫిర్యాదులొస్తే పట్టించుకోరు... అసలు మీరు ఏమనుకుంటున్నారు...జెడ్పీ చైర్మన్గా నేనొకడిని ఉన్నానని మీకు గుర్తుందా..?’’ అంటూ చైర్మన్ బోయ నాగరాజు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జెడ్పీలోని సమావేశ భవనంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. పద్ధతులు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పలు అంశాలపై చర్చ స్థాయీ సంఘం సమావేశాలకు చైర్మన్ బోయ నాగరాజుతో పాటు మూడు అంశాలపై అధ్యక్ష స్థానంలో లక్ష్మీనారాయణరెడ్డి కొనసాగారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, జల వనరుల శాఖలకు సంబంధించిన ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం, వేసవిలో సురక్షిత నీటిని అందించే విషయంలో పలు తీర్మానాలు చేశారు. తాజాగా రూ.9 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎస్ఈ హరేరామ్నాయక్ తెలిపారు. త్వరలో ఈ పనులకు సంబంధించిన టెండర్లకు పిలుస్తామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇంకా రూ.12 కోట్లు నిధులు అడిగామన్నారు. రహదారుల నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదన్న విషయం వాస్తవమేనని ఎస్ఈ సుబ్బరావు అన్నారు. గతేడాది మిగులు నిధులను ఈ ఏడాదికి వినియోగించుకునే విషయాన్ని కలెక్టర్ని అడిగామన్నారు. అనుమతి రాగానే సర్దుబాట్లు చేస్తామన్నారు. స్థాయీ సంఘం సమావేశాల్లో సీఈఓ శోభాస్వరూపారాణి, డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ, పలువురు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. పర్సెంటేజీల పట్టికలను ఏర్పాటు చేయండి సార్.. ‘‘పంచాయతీరాజ్ శాఖలో ప్రతిపనికీ అధికారులు పర్సెంటేజీలు అడుగుతున్నారు..ఇకపై మీ కార్యాలయాల్లో ఏయే అధికారికి, ఏఏ పనికి ఎంత వాటా ఇవ్వాలో పట్టికలో రాసి ఉంచండి సార్...అప్పుడు మాకూ ఇబ్బంది ఉండదు’’ అంటూ అధికార పార్టీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రవూఫ్ అధికారుల తీరును తూర్పారబట్టారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పనులు చేస్తే కనీసం రూ.10 వేలు కూడా మిగలడం లేదన్నారు. ఇందులో కూడా ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి కూడా వాటాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని వాపోయారు. రహదారులు, అంగన్ వాడీ భవనాలు, గిడ్డంగుల నిర్మాణాల్లో జరుగుతున్న, జరిగిన అవినీతి గురించి కనీస విచారణ జరిపేందుకు కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు జంకడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీంతో అధికారుల మాట నోట రాలేదు. పైపెచ్చు సర్దుకుంటామని చెప్పి తప్పుకున్నారు. -
మేకపోతును చంపిన చిరుత
రాయదుర్గం రూరల్ : మల్లాపురం బోయ నాగన్నకు చెందిన మేకపోతునుకకొండ సమీపంలో చిరుత దాడి చేసి చంపింది. వెంటనే బాధితుడు అటవీ అధికారులకు సమాచారమందించాడు. వారు వచ్చి చిరుతే దాడి చేసి చంపినట్లు ఆనవాళ్లను బట్టి ధ్రువీకరించారు. మల్లాపురం పరిసర ప్రాంతాలలో చిరుతలు సంచరిస్తున్నాయని, ఇప్పటికే పది మేకలను పొట్టన పెట్టుకున్నాయని పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పక చదవండి
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement