-
అసోంలో భారీ వర్షాలు.. 11 జిల్లాలను ముంచెత్తిన వరదలు..
వర్షాకాలం పూర్తిగా మొదలు కాకముందే అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు 11 జిల్లాలను ముంచెత్తాయి. దీని కారణంగా 34 వేల మంది ప్రభావితులయ్యారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోంలో ఈ ఏడాది తొలి వరదలు నమోదయ్యాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ASDMA) ప్రకారం బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు నీటిమట్టం పెరుగుతుండటంతో వరద నీరు వందలాది గ్రామాలను ముంచెత్తింది. అయితే ఏ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదని పేర్కొంది. అసోం అంతటా 209.67 హెక్టార్ల పంట ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపింది. వరదల వల్ల బిశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగఢ్, లఖింపూర్, తముల్పూర్, ఉదల్గురి జిల్లాలు ప్రభావితమయ్యాయయని.. 34 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4, 675 మంది మహిళలు, 3,787 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు.. లఖింపూర్లో అత్యధికంగా 23,516 మంది ప్రభావితమయ్యారు, దిబ్రూగర్లో 3,857 మంది, దర్రాంగ్లో 2231 మంది, బిశ్వనాథ్లో 2231 మంది, ధేమాజీలో 1,085 మంది ఉన్నారు. వరదల బారిన పడిన లఖింపూర్లో ఎనిమిది, ఉదల్గురిలో రెండు మొత్తం 11 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 77 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. లఖింపూర్, ఉదల్గురిలో రెండు చొప్పున నాలుగు చెరువుల కట్టలు తెగిపోయాయి. బిస్వనాథ్, బొంగైగావ్, దిబ్రూఘర్, గోలాఘాట్, జోర్హాట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, లఖింపూర్, మోరిగావ్, నల్బరీ, సోనిత్పూర్, తముల్పూర్ ఉదల్గురి జిల్లాల్లో రోడ్లు భారీ కోతకు గురయ్యాయని ఏఎస్డీఎమ్ఏ తెలిపింది. భారీ వర్షాల కారణంగా దిమా హసావో కమ్రూప్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొంది. కాగా భారతదేశంలో ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఈ రాష్ట్రానికి వరద సమస్య వార్షిక విపత్తుగా మారింది. అత్యధిక జనాభా కలిగిన ఈ ఈశాన్య రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలు, వరదలతో ప్రతి వర్షాకాలం ప్రభావితం అవుతుంటారు. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులవుతారు. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. కోట్లాది రూపాయల ఖరీదైన పంటలకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతోంది. ఇక ఆస్తి నష్టం కూడా అదే రేంజ్లో వాటిల్లుతోంది. 34,000 people affected as #AssamFlood worsens and incessant rain continues Total 34,189 people, comprising 14, 675 women & 3,787 children reeling under the impact of the deluge#Assam #Flood #AssamRain #FloodUpdate #AssamFloods #Guwahati #GuwahatiFlood pic.twitter.com/oOKd4cg2L1 — Ritam English (@EnglishRitam) June 17, 2023 -
బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్లో ప్రజలు
బ్రహ్మపుత్ర నది మీదుగా ఈదుకుంటూ వస్తోంది ఒక రాయల్ బెంగాల్ టెంగర్. అది గౌహతిలో పేరుగాంచిన ఉమానంద ఆలయానికి సమీపంలోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఆ పులిని చూసిన ఆ ఆలయ భక్తులు, పూజారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బహుశా ఈ పులి సమీపంలోని ద్వీపకల్పం వద్ద ఉన్న ఒరంగా నేషనల్ పార్క్ నుంచి తప్పిపోయి ఉండవచ్చని భావించారు. బహుశా నీళ్లు తాగడానికి వచ్చి బహ్మపుత్ర నది ప్రవాహానికి కొట్టుకోపోయి ఉండవచ్చని అనుమానించారు అధికారులు. ఈమేరకు ఆ పులిని రక్షించేందుకు జాతీయ విపత్తు బృందం, అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఐతే ఆపులిని కాపాడటం అటవీ శాఖ రెస్క్యూ టీంకి, జాతీయ విపత్తు బృందానికి అత్యంత క్లిష్టమైన టాస్క్గా అనిపించింది. ఎందుకంటే ఆ పులిని కాపాడాలంటే ముందు అది ప్రశాంతంగా ఉండాలి. అదీగాక ఒకవేళ ఆ రెస్క్యూ టీం ఆపరేషన్ ఫెలయితే ఆ పులి నీటిలో మునిగిపోతుంది లేదా ఆ పులి ఆ రెస్క్యూ బృందంపై ఎటాక్ చేసే ప్రమాదము ఉంది. దీంతో రెస్య్కూ టీంకి ఆ పులిని రక్షించడం సుమారు 10 గంటలు పైనే పట్టింది. మొదటగా రెస్క్యూ టీం బోట్లతో ఆ పులి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అది సహకరిస్తుంది అని నిర్ధారించుకున్నాక దాన్ని రక్షించి బోనులో ఉంచారు. ఈ పులిని రక్షించేంతవరకు ఆ ఆలయాన్ని మూసివేయడమే గాక సమీపంలోని దుకాణాలను సైతం మూసేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A full grown Royal Bengal tiger is found swimming in middle of Brahmaputra River in Guwahati. Tiger is now taking shelter in a rock gap in Umananda Temple in middle of the river. To my surprise, if he came swimming from Kaziranga in Assam, then he has crossed 160 km! 🐯 🐅 pic.twitter.com/OhwIkq5T9H — Inpatient Unit Khanapara (@Inpatient_Unit) December 20, 2022 (చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్) -
Purnima Devi Barman: ఆ కళ్లకు వెన్నెల తెచ్చింది
పక్షి ప్రేమికులకు సుపరిచితమైన పేరు పూర్ణిమా దేవి బర్మన్. చిన్నప్పుడు తాత తనను పొలానికి తీసుకువెళ్లి ఆకాశంలోని పక్షులను చూపిస్తూ ‘అవి స్వర్గం నుంచి వస్తున్నాయి తెలుసా’ అనేవాడు. పెద్దయ్యాక పూర్ణిమకు అర్థమైంది ఏమిటంటే భూమి మీద వాటి పరిస్థితి నరకప్రాయంగా ఉంది అని. ఈ నేపథ్యంలో పక్షుల సంరక్షణ కోసం ‘హర్గిల ఆర్మీ’ అనే సైన్యం తయారు చేసింది. ‘ఆశావాదం మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్న పూర్ణిమ ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక అవార్డ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్కు’ ఎంపికైన వారిలో ఒకరు... అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలో పెరిగింది పూర్ణిమ. అక్కడ పక్షుల సందడి నేత్రపర్వంగా ఉండేది. తాత తనను పొలానికి తీసుకువెళుతూ ఎన్నో పక్షులను చూపిస్తూ వాటి గురించి ఎంతో మురిపెంగా చెప్పేవాడు. అలా తనకు చిన్నప్పటి నుంచి పక్షులను అభిమానించడం మొదలైంది. జంతుశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న పూర్ణిమ గ్రేటర్ ఆజిటెంట్ స్టార్క్ (కొంగల) గురించి పీహెచ్డీ చేసే సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకుంది. అరుదైన జాతికి చెందిన గ్రేటర్ ఆజిటెంట్ జాతి కొంగలు ప్రమాదం అంచున ఉన్నాయనే విషయం తనను భయపెట్టింది. వాటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీన్ని నివారించడానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. పరిశోధనకు విరామం ఇచ్చి గ్రేటర్ ఆజిటెంట్ రక్షణకు నడుం బిగించింది. పట్టణీకరణ, బిల్డింగ్లు, రోడ్లు, మొబైల్ టవర్లు... మొదలైన ఎన్నో కారణాల వల్ల పక్షుల సంఖ్య తగ్గుతూ పోతుంది. దీనికి తోడు అసోంలోని చాలాగ్రామాల్లో పక్షులను దుశ్శకునంగా భావిస్తారు. వ్యాధులను సంక్రమింపజేస్తాయని భయపడుతుంటారు. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకురావాలనుకుంది పూర్ణిమ. ఎన్నో గ్రామాలకు తిరిగి, మహిళలను సమీకరించి పక్షులపై ఉన్న మూఢనమ్మకాలు పోయేలా వాటి విలువ గురించి ఓపిగ్గా చెప్పేది. చిన్నగా మార్పు మొదలైంది. అలా గ్రామీణ మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారుచేసింది. అస్సామీయులు కొంగను ‘హర్గిల’ అని పిలుస్తారు. తమ కార్యాచరణలో భాగంగా ఈ ఆర్మీలోని సభ్యులు ఎల్తైన వెదురు బొంగులపై గూళ్లు నిర్మించారు. మెల్లమెల్లగా ఈ గూళ్లలోనికి కొంగలు రావడం మొదలైంది. గుడ్లు పెట్టేవి. గూళ్లు నిర్మించి పక్షులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, నదులు, చిత్తడి నేలల శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేది ఆర్మీ. తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లపై పక్షిగూడు నిర్మించేవారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. ‘హర్గిల లెర్నింగ్ సెంటర్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పక్షుల విలువ తెలియజేస్తున్నారు. ‘పక్షుల వల్ల జరిగే మేలు ఏమిటో అర్థమయ్యేలా చెప్పారు. అవి ప్రమాదంలో ఉన్నాయనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించింది. నా వంతుగా ఏదైనా చేయాలనిపించి హర్గిల ఆర్మీలో చేరాను’ అంటుంది దాదర గ్రామానికి చెందిన వింధ్య. ‘ఇల్లుదాటి బయటికి రాగానే పక్షిని చూడడం అరిష్టమని నేను కూడా నమ్మేదాన్ని. కానీ అది ఎంత తప్పో తరువాత తెలిసింది’ అంటుంది ‘హర్గిల ఆర్మీ’ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే పచారియా గ్రామానికి చెందిన గంగ. ఒకప్పుడు ‘హర్గిల ఆర్మీ’లో తక్కువ మందు ఉండేవారు. ఇప్పుడు పదివేల మందికి పైగా ఉన్నారు! ‘నేను స్వాభావికంగా ఆశావాదిని. అలాంటి నేను కొన్ని సందర్భాలలో నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని. దీనికి కారణం పట్టణీకరణ వల్ల చెట్లను కొట్టి వేయడం. ఒకచోట ఇల్లు కడుతున్నారంటే చెట్లు కొట్టేసేవారు. వారి దృష్టిలో చెట్లకు విలువ లేదు. అయితే విస్తృత ప్రచారం వల్ల పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. చెట్లను నరికివేయడానికి చాలామంది విముఖంగా ఉన్నారు. ఇవి మా భవిష్యత్ తరానికి మేము ఇచ్చే ఆస్తి... అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పక్షులకు అనువైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుకుంటే వాటికి మేలు చేసినట్లవుతుంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మన్. -
అయ్యో గజరాజా! పాపం ఆకలికి తట్టుకోలేక..
వైరల్: ఆకలి.. ఏ కడుపుకైనా ఒక్కటే!. గుప్పెడు పొట్ట ఉండే మనిషికే అంత ఆకలి ఉంటే.. భారీ కాయం ఉన్న ఆ జీవి మాత్రం తట్టుకోగలదా?. ఇక్కడ ఓ ఏనుగుకు వెన్ను ఎముకలు బాధాకరంగా పొడుచుకు వచ్చాయి. బక్కచిక్కిపోయి.. బలహీనంగా మారిపోయి ఆహారం కోసం అటు ఇటు తిరుగాడింది. దీనికితోడు జనాలు చేసే ఆ గోల దానిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పాపం.. ఈ విశాల ప్రపంచంలో ఆకలి తీర్చుకోలేక బాధతో అలమటించింది ఆ గజరాజు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా.. మూగజీవాలు జనవాసాల్లోకి రావడం పెద్ద విశేషం ఏం కాదు. కానీ, ఇక్కడ ఈ గజరాజు మాత్రం ఆకలికి తట్టుకోలేక వచ్చింది. అది అలా ఇలా కాదు. అందుకోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఆకలిగొన్న ఆ అడవి ఏనుగు.. అస్సాం కజిరంగ నేషనల్ పార్క్ నుంచి బ్రహ్మపుత్ర నది గుండా ఈదుకుంటూ ముందుకు సాగింది. చివరకు తేజ్పూజ్ నగరానికి ఆదివారం సాయంత్రం చేరుకుంది. ఏనుగు రాకతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రావడం రావడంతోనే నగరంలో అలజడి సృష్టించింది ఆ గజం. near govt. boys, tezpur pic.twitter.com/k5LQ2IW02n — vishal junak das (@junaaaak) August 27, 2022 వీధుల్లో తిరుగుతూ.. తిండి కోసం చాలా చోట్లకు వెళ్లింది. లాభం లేదు. చన్మరీ ప్రాంతంలో ఓ ఇంటి వంట గదిలోకి వెళ్లింది కూడా. అక్కడ ఏం దొరకలేదు. దీంతో తేజ్పూర్ షిప్ పోర్ట్ గుండా చిత్రలేఖ పార్క్లోకి వెళ్లింది. అక్కడ వందల మంది దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఆపై అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్టాండ్కు చేరుకుని.. జనాల గోల నడుమ చిరాకుతో రెండు బైకులను నాశనం చేసేంది. జిల్లా రవాణా విభాగపు కార్యాలయం గుండా నిర్జన ప్రాంతంలోకి ప్రవేశించింది. Dear mama, I am from tezpur & this elephant passes away just in front of my house last night. I just want you to interfere in this matter and make a close watch to the animals, just see the health condition of a wild animal. Shame on every human being. Save our nature pic.twitter.com/9hZoqvK9MX — Bikash Adhikari (@BikashA03668793) August 28, 2022 తిండి కోసం అది పడే తాపత్రయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా దానిని భయపెడుతూ మరింత అలజడికి కారణం అయ్యారు. చివరికి.. ఫారెస్ట్ సిబ్బంది దానిని బలవంతంగా అర్ధరాత్రి సమయంలో తిరిగి బ్రహ్మపుత్ర తీరం వైపే తరలించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. 🐘wild elephant enters tezpur. scene from chandmari-railgate area. pic.twitter.com/N5Gnt8HioK — vishal junak das (@junaaaak) August 27, 2022 అయితే.. ఏనుగు సృష్టించిన అలజడి.. విధ్వంసం వెనుక హృదయవిదారకమైన, కఠోర వాస్తవాలు ఉన్నాయి. వాటినే పలువురు నెటిజన్లు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. పాపం.. ప్రకృతిని నాశనం చేస్తూ.. అడవులనే వాటి ఆవాసాలను దెబ్బ తీస్తూ.. ఆకలికి దూరం చేస్తున్న మనిషి.. ఇప్పుడు దాని ఆకలి తీర్చలేకపోవడం దుర్మార్గమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సోషల్ మీడియాలో!. ఇదీ చదవండి: రైల్వే ట్రాక్ దగ్గర బైక్ స్టంట్.. వాడికలా అవ్వాల్సిందే! -
Assam Floods: తగ్గని వరద.. ఒక్కరోజులోనే పది మంది మృతి
గువాహతి: బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని అధికారులు తెలిపారు. అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఇదే ప్రథమంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు ఇంకా పేరుకుపోయే ఉంది. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న చచార్ జిల్లాలోని సిల్చార్ చాలా భాగం వరద నీటిలోనే ఉంది. బాధితుల కోసం ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. సిల్చార్లో 3 లక్షల మంది నీరు, ఆహారం, అవసరమైన మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. #AidToCivilAdministration In response to extensive floods in Assam & Meghalaya,#IAF heptr & transport aircraft have been deployed across the region to deliver relief material & provide succour to the locals. During the floods, 13 tons of relief material has been airlifted so far. pic.twitter.com/ylOgSOTGsz — Indian Air Force (@IAF_MCC) June 24, 2022
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement