-
ఇండియాలో టార్గెట్ ఫిక్స్,స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ ప్రారంభం అప్పుడే
న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి భారత్లో బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ప్రారంభించే యోచనలో ఎలాన్ మస్క్ ఉన్నారని ఇండియా స్టార్లింక్ కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో వీటిని ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. భారత్లో ప్రీ–ఆర్డర్ల సంఖ్య 5,000 స్థాయిని దాటేసిందని సోషల్ మీడియా పోస్ట్లో ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలను విస్తరించడంపై తమ సంస్థ ఆసక్తిగా ఉందని భార్గవ వివరించారు. బీటా దశలో 50 నుంచి 150 మెగాబిట్ పర్ సెకన్ స్థాయిలో డేటా స్పీడ్ అందిస్తామని స్టార్లింక్ చెబుతోంది. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్నకు చెందిన వన్వెబ్తో స్టార్లింక్ నేరుగా పోటీపడనుంది. అంతర్జాతీయంగా స్టార్లింక్ కనెక్షన్లకు ప్రీ–ఆర్డర్లు 5,00,000 స్థాయిని దాటేసిందని భార్గవ చెప్పారు. దేశీయంగా రాబోయే నెలల్లో ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీకండక్టర్ల కొరత కారణంగా స్టార్లింక్ కిట్లను తయారు చేసే వేగం మందగించిందని ఆయన వివరించారు. చదవండి: ‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా ! -
ఇంటర్నెట్ స్పీడ్.. మినిమమ్ 2 ఎంబీపీఎస్!
TRAI Recommandations On Internet Speed: ఇంటర్నెట్ మినిమమ్ స్పీడ్ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లకు, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది టెల్కామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్). ప్రస్తుతం ఉన్న మినిమ్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ను 2 ఎంబీపీఎస్కు పెంచాలని తెలిపింది. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో ట్రాయ్ కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం ఉన్న 512 కేబీపీఎస్ స్పీడ్ బేసిక్ అప్లికేషన్స్ కూడా తెరవడానికి సరిపోవని అభిప్రాయపడింది. మినిమమ్ డౌన్లోడ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్(megabits per second) ఉండేటా చేసుకోవాలని సూచించింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సర్వీసుల వేగాన్ని పెంచాలని, అందుకోసం మంత్లీ సబ్ సబ్ స్క్రిప్ట్షన్ ఫీజులో 50 శాతం రీయంబర్స్మెంట్ రూరల్ కనెక్షన్దారులకు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది ట్రాయ్. గతంలో 256 కేబీపీఎస్ స్పీడ్ను 2014లో 512 కేబీపీఎస్కు అప్గ్రేడ్ చేయించింది ట్రాయ్. ఇప్పుడు ఆ స్పీడ్ను నాలుగు రెట్లు పెంచాలని చెబుతోంది. అంతేకాదు ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ ఆధారంగా బ్రాడ్బ్యాండ్ సర్వీసులను యూకే, యూరప్ తరహాలో కేటగిరీలుగా విభజించాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి దేశాల్లో బేసిక్ బ్రాడ్బ్యాండ్.. 2-50 ఎంబీపీఎస్ స్పీడ్, ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్.. 50-300 ఎంబీపీఎస్ స్పీడ్, సూపర్-ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్.. 300 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ స్పీడ్తో కేటగిరీలుగా విభజించారు. ఈ సూచనలతో పాటు దేశంలో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను పెంచేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేంద్రానికి తెలిపింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద కేవలం 9.1 శాతం ఇళ్లకు మాత్రమే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. చాలా మంది మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. కేబులింగ్ వ్యవస్థ ద్వారా లైన్ సర్వీసులను పొడిగించే ప్రయత్నం చేయాలని తెలిపింది. అలాగే రూ. 200 కంటే తక్కువ ఛార్జీల నెలవారీ ప్యాక్.. సగం రీయంబర్స్మెంట్ దిశగా ప్రణాళిక అమలు చేయాలని కేంద్రానికి తెలిపింది. ఈ-రూపీ ద్వారా ఆ డబ్బును కనెక్షన్దారుడికి జమ చేయాలని సూచించింది. అయితే ట్రాయ్ చేసిన ఈ సూచనల్ని సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా పాటించాలన్న రూల్ లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం పరిగణనలోకి తీసుకుని చట్టం చేయొచ్చు. చదవండి: 2022కల్లా ఏపీలో ప్రతి పల్లెకు బ్రాడ్బ్యాండ్ -
బ్రాడ్బాండ్ ఇంటర్నెట్ సర్వీసులు బంద్
శ్రీనగర్: కశ్మీర్ లోయలో బ్రాడ్బాండ్ ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేశారు. శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా భారీగా హింస చెలరేగడం, 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్కు ఈసీ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎలాంటి కారణం చెప్పకుండా గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. వేర్పాటువాదులు ఎన్నికలకు ఆటంక కలిగిస్తారని భావించి.. శ్రీనగర ఉప ఎన్నికకు కొన్ని గంటల ముందు ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు ఆపివేశారు. ఎన్నికలు ముగిశాక మంగళవారం పునరుద్ధరించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారు. చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement