-
మైనర్పై సోదరుల గ్యాంగ్ రేప్.. అడ్డొచ్చిన బామ్మపైనా..!
భోపాల్: దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసినవారే రాక్షసుల్లా మారి దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లాలో వెలుగు చూసింది. వరుసకు సోదరులయ్యే ఇద్దరు యువకులు ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు వచ్చిన ఆమె బామ్మపైనా నిందితుల్లో ఒకడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తన తండ్రితో కలిసి ముంబైలో నివాసం ఉంటోంది. ఆగస్టు 11న జబల్పూర్లోని తన పెదనాన్న వాళ్ల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 13న బాలికపై ఆమె ఇద్దరు కజిన్ సోదరులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రోజుల తరబడి అఘాయిత్యానికి పాల్పడుతూ తీవ్రంగా కొట్టారు. బాధితురాలిని గమనించిన కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. జబల్పూర్లోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. తన కూతురిపై ఇద్దరు సోదరులు గ్యాంగ్ రేప్కు పాల్పడి తీవ్రంగా కొట్టటం వల్ల ప్రాణాలు కోల్పోయిందని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దుశ్చర్యను ఆపేందుకు వెళ్లిన తన తల్లిపైనా అత్యాచారం చేశారని, ఆమె చెబితేనే తనకు అసలు విషయం తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఎస్పీ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. ఆగస్టు 23న బాధితురాలి మృతదేహాన్ని పరీక్షించామని, వృద్ధురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. పోక్సోతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నిందితుల్లో ఒకరని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి చికిత్స అందించిన వైద్యులను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై.. -
సోదరులే కీచకులైతే..!
న్యూఢిల్లీ: సోదరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 17 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఢిల్లీ శివార్లలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కుటుంబంలో చిచ్చు పెట్టడానికే తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. కానీ, వరుసకు సోదరులైన(పినతల్లి కుమారులు) ఇద్దరు గత కొన్ని వారాలుగా తనపై అత్యాచారం చేశారని బాలిక అంటోంది. అంతేకాక ఈ సంఘటనంతా చిన్న సోదరుడు మొబైల్ ఫోన్లో చిత్రీకరించి, బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు చెస్తోంది. దీంతో జరిగిందంతా ఆమె తన తల్లికి చెప్పడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విజయ్విహార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని డీసీపీ విక్రమ్జిత్ చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement