-
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడి గట్టి, హత్య చేశాడో కామాంధుడు. హోలీ సంబరాల్లో ఉన్న చిన్నారిని నమ్మించి ఎత్తుకెళ్లి ఈ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత అత్యంత క్రూరంగా హత్య చేశాడు. దారుణమైన ఈ ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నారి ప్రవళ్లిక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఛేదించారు. శుక్రవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజారెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. చిన్నారి ఇంటి పక్కనే ఉండే ధర్మేంద్ర, అతని స్నేహితులు రోషన్, రాజేష్కుమార్, సురేంద్ర, సుబ్రహ్మణ్యం కలసి హోలీ ఆటలో మునిగారు. అప్పటికే మద్యం సేవించిన వీరితో ఓ బాబు, చిన్నారి ప్రవళ్లిక సైతం ఆడుకున్నారు. చిన్నారి అదృశ్యం కావడంపై ధర్మేంద్రను పోలీసులు వివరాలు అడిగారు. ఈ క్రమంలో రాజేష్కుమార్ కూడా కనిపించడంలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్కు 20 ఫీట్ల దూరంలో ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదృశ్యమైన చిన్నారి తల్లిదండ్రులకు మృతదేహాన్ని చూపించగా అది తమ బిడ్డదే అని గుర్తించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన డీసీపీ పద్మజారెడ్డి నిందితుడు తప్పించుకోకుండా 3 బృందాలను నియమించారు. ఈ క్రమంలో బొల్లారం సమీపంలోని కృష్ణనగర్లో ఓ గది ఉన్న రాజేష్ను శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మించి ఎత్తుకెళ్లాడు.. స్నేహితులతో హోలీ సంబరాల్లో ఉన్న రాజేష్కుమార్ వారితో ఉన్న బాబును తీసుకెళ్లి రంగులు కొనిచ్చాడు. చిన్నారి ప్రవళ్లికను ఇలాగే నమ్మించి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఉన్న నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. భయంతో బోరున విలపిస్తున్న చిన్నారి మెడపై ఇనుప రాడ్డుతో కోశాడు. లైంగిక దాడి, మెడపై గాటుతో తీవ్ర రక్తస్రావం జరిగి చిన్నారి అక్కడే మృతి చెందింది. అనంతరం రాజేష్కుమార్ ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. బిహార్కు చెందిన రాజేష్కుమార్ 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చాడు. బొల్లారంలోని నందిని టెంట్ హౌస్లో పని చేస్తూ వాల్మీకి నగర్లో ఉంటున్నాడు. గురువారం సాయంత్రం గదికి వచ్చిన రాజేష్కుమార్ శుక్రవారం బిహార్ పారిపోవాలని అనుకున్నాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఆలోపే చిక్కాడు. మీడియా సమావేశంలో ఏసీపీ నర్సింహరావు, సీఐ మట్టయ్య, డీఐ ఎన్.శంకర్, ఎస్సై వరప్రసాద్ పాల్గొన్నారు. మరణశిక్ష విధించాలి: అచ్యుతరావు అల్వాల్ పీఎస్ పరిధిలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి, దారుణహత్య ఘటనపై స్పందించిన బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు దుండగుడికి మరణశిక్ష విధించాలన్నారు. నగరం, పరిసరాల్లో ఆడ పిల్లలపై జరుగుతున్న దారుణాలకు ఈ ఉదంతం ఓ పరాకాష్ట అని అన్నారు. కేవలం ఫిబ్రవరి, మార్చి.. 2 నెలల వ్యవధిలో 42 మంది బాలికలపై లైంగిక దాడులు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అధికారులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. -
పాపం నందిని
చిన్నారిని హత్య చేసిన కర్కోటకుడు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడో కర్కోటకుడు. హత్య చేసి హౌస్లో పడేశాడు. పాప హౌస్లో పడి చనిపోరుుందని తల్లిని నమ్మించాడు. పోలీసులు తమదైన శైలిలో విచా రించగా.. హత్యచేసి వాగులో పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో చిట్యాల మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది. - నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన కర్కోటకుడు - అంకుషాపూర్లో విషాదం చిట్యాల: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడో కర్కోటకుడు. హృదయూలను కలిచివేసిన ఈ ఘటన చిట్యాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్, ఎస్సై వెంకట్రావు కథనం.. మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన జీడి పైడయ్యకు ఇదే మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన రాధతో ఇరువై ఏళ్ల క్రితం వివాహామైంది. ఆలస్యంగా కాన్పు కాగ నందిని (4) జన్మించింది. ఈ క్రమంలో కాలనీకి చెందిన వరుసకు మరిది అయిన జీడి రవి వదిన రాధతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నెల రోజుల క్రితం రాధ, ఆమె కుమార్తె నందినిని తీసుకెళ్లి కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజ్పల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఇద్దరు కూలీపనికి వెళ్తూ బతుకుతున్నారు. గత నెల 19న రాధ పొలం పనికి వెళ్లగా రవి ఇంటివద్దే ఉన్నాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఇంట్లో ఉన్న నందినిని హత్య చేసి ఇంట్లోని నీటిహౌస్లో పడేశాడు. పాప హౌస్లోపడి చనిపొయిందని తల్లి రాధను నమ్మించాడు. అదే రాత్రి పక్కనే గల మల్యాల చలివాగులో పాపను పూడ్చిపెట్టాడు. అయితే గత నెల 27న అంతకుముందే తన భార్య రాధ, కుమార్తె నందిని అదృశ్యమయ్యూరని, కాలనీకి చెందిన జీడి రవిపై అనుమానం ఉందని పైడయ్య ఫిర్యాదు చేశాడు. విచారణ కోసం రంగలంలోకి దిగిన పోలీసులు మంగళవారం కమలాపూర్లోని రవి, రాధలను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలీలో విచారించగా నందినిని హత్యచేసి వాగులో పూడ్చిపెట్టినట్లు రవి ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వాగువద్దకు వెళ్లి నందిని మృతదేహాన్ని వెలికితీశారు. జమ్మికుంట తహశీల్దార్ రజిని, ఆర్ఐ సందీప్ల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టంనకు తరలించారు. నిందితులు రవి, రాధలపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్, ఎస్సై వెంకట్రావు వివరించారు. చిన్నారిని హత్య చేసిన ఘటన మండలంలో సంచలనం సృష్టించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement