-
సయోధ్యకు వెళ్తే చంపేశారు
రాజమహేంద్రవరం రూరల్: సయోధ్య కెళ్లితే ప్రత్యర్థుల దాడిలో రాజమహేంద్రవరం హౌసింగ్ బోర్డుకాలనీకి చెందిన పరిమి నందకిశోర్ (34) మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన తొర్రేడులో శుక్రవారం రాత్రి 11.20 గంటల సమయంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పశివేదలకు చెందిన పరిమి నందకిశోర్(34) తండ్రి చనిపోవడంతో ఎనిమిదేళ్ల క్రితం తల్లితో కలిసి రాజమహేంద్రవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్నారు. నందకిశోర్ తొర్రేడుకు చెందిన చిట్టూరి సుధీర్కు స్నేహితుడు. అప్పుడప్పుడూ ఆ గ్రామానికి వెళ్లి సుధీర్తో అతని స్నేహితులతో కలసి తిరుగుతుంటాడు. ఈ ఏడాది జనవరిలో చిట్టూరి సుధీర్, ఉప్పులూరి రాముకు వచ్చిన గొడవల నేపథ్యంలో ఉప్పులూరి రాము స్నేహితుడు ఉప్పులూరి బూమేష్ తండ్రి రామకృష్ణ తలపై పరిమి నందకిశోర్ దాడి చేశాడు. ఈ దాడిలో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో చిట్టూరి సుధీర్, పరిమి నందకిశోర్పై రాజానగరం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం ఇరువురి మధ్య రాజీ అవ్వడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇటీవల కాలంలో చిట్టూరి సుధీర్, ఉప్పులూరి రాములు మరి కొంతమంది కొంతమూరులో కల్చ రల్ క్లబ్ నిర్వహించేందుకు రూ.15 లక్షల పెట్టుబడితో ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి నష్టం వచ్చిందని సుధీర్, రాముల మధ్య వివాదం నెలకొంది. ఇరువురు మధ్య సయోధ్య కుదుర్చుతానని పరిమి నందకిశోర్, రాజమహేంద్రవరం ఆవ ప్రాంతానికి చెందిన వరుణ్కుమార్, మరి కొంతమంది రాజమహేంద్రవరంలోని ఒక ప్రముఖ హోటల్లో మద్యం సేవించి శుక్రవారం రాత్రి తొర్రేడు గ్రామానికి చేరుకున్నారు. ఇరు వర్గాలు మాట్లాడుకునే సమయంలో మాటామాటా పెరిగి ఉప్పులూరి రాము మరి కొంతమంది పరిమి నందకిశోర్, వరుణ్కుమార్ తదితరులపై పదునైన కత్తులతో దాడి చేయబోగా పరుగులు తీశారు. తొర్రేడు సొసైటీ కార్యాలయానికి ఎదురుగా వచ్చేసరికి నందకిశోర్ తలపై, ఒంటిపైన విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పరుగులు తీసిన వరుణ్కుమార్ గాయాలపాలు కావడంతో అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సంఘటన స్థలాన్ని అర్బన్ పోలీస్ జిల్లా ఏఎస్పీ(లా అండ్ ఆర్డర్) లతా మాధురి, తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు, రాజానగరం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్రెడ్డి తదితరులు పరిశీలించారు. అలాగే డాగ్ స్క్వాడ్ను తీసుకువచ్చారు. పాతకక్షలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే పరిమి నందకిశోర్ హత్యకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలన తొర్రేడు సొసైటీ కార్యాలయం ఎదురుగా పరిమి నందకిశోర్ హత్యకు గురికావడంతో కార్యాలయం ఆవరణలోని సీసీ ఫుటేజీ హార్డ్కాపీ తీసుకుని వెళ్లి ఏఎస్పీ, డీఎస్పీలు పరిశీలిస్తున్నారు. అయితే రాత్రి సమయం కావడంతో సరిగా కనిపించడం లేదు. వరుణ్కుమార్ ఫిర్యాదు మేరకు రాజానగరం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ మోహన్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మేనకోడల్ని చూడాలని ఉంది అక్కా... మేనకోడల్ని చూడాలని ఉంది అక్కా అని చెప్పిన తమ్ముడు ఇలా మృత్యువాత పడతాడని అనుకోలేదని పరిమి నందకిషోర్ అక్క విజయలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. అమ్మా ఉమాదేవి, తమ్ముడు ఇద్దరూ కలిసి ఉంటారని, ఇప్పుడు అమ్మకు పుత్రశోకం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసింది. తొర్రేడులో నందకిషోర్ నిర్జీవంగా పడి ఉండడాన్ని అతని తల్లి ఉమాదేవి తట్టుకోలేక పోయింది. తన కుమారుడును ఈ విధంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. -
యువకుని దారుణ హత్య
గిద్దలూరు రూరల్ : కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్ను గుర్తుతెలియని వ్యక్తులు మడత బ్లేడుతో గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని కేఎస్ పల్లె రోడ్డులో ఉన్న ఫారమ్ సమీపంలో మంగళవారం వేకువజామున జరిగింది. ఆ వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన టంకం జాకీర్హుస్సేన్ (25) టాటా ఏస్ లగేజీ ఆటోకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎక్కువగా నంద్యాల, మహానంది ప్రాంతాల నుంచి అరటిలోడులు వేసుకుని గిద్దలూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంటాడు. ఈ నేపథ్యంలో గిద్దలూరు మండలం నరవ గ్రామంలో బియ్యం లోడు ఉందని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో గోపవరం గ్రామంలోని ఇంటి నుంచి బయలుదేరిన జాకీర్హుస్సేన్.. మంగళవారం ఉదయం స్థానిక కేఎస్ పల్లె రోడ్డులోని ఫారమ్ సమీపంలో శవమై కనిపించాడు. అతని ఆటో అక్కడే రోడ్డు మార్జిన్లో నిలిపి ఉంది. ఆ వాహనానికి కొంతదూరంలో ఉన్న రైల్వే పట్టాలు, రోడ్డుకు మధ్య చిల్లచెట్లలో శవమై పడిఉన్నాడు. అతని గొంతుపై బ్లేడుతో కోసినట్లు గాయమై ఉంది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న వారి ద్వారా సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ శ్రీహరిరావు, సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై ఎం.రాజేష్లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాకీర్ను ఆటోలో నుంచి హంతకులు బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లి అదే ఆటోలో ఉన్న అరటి గెలలు కోసేందుకు ఉపయోగించే మడత బ్లేడ్లతో గొంతుకోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన బ్లేడ్లలో ఎరుపు రంగు బ్లేడు ఒకటి హత్య జరిగిన స్థలంలోనే పడి ఉండగా, పసుపురంగు బ్లేడు రక్తపు మరకలతో ఆటోలోనే ఉంది. మరో బ్లేడు విరిగి ఆటో టైర్లవద్ద పడి ఉంది. ఆటోలో మరో వ్యక్తికి సంబంధించిన చెప్పులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు జాకీర్కు ఏప్రిల్ నెలలో వివాహం కుదిరినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు పోలీసులు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement