-
రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వచేయండి
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల వేగం అనూహ్యంగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చేరికలు పెరిగే ప్రమాదం మరింతకానుంది. దీంతో ఆస్పత్రుల్లో కనీసం 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. ప్రైవేట్ వైద్య కేంద్రాల్లోనూ ఆక్సిజన్ సేవలు అందుబాటులో ఉన్నందున డిమాండ్ ఒక్కసారిగా పెరిగితే అందుకు అనుగుణంగా సరఫరా ఉండేలా కార్యాచరణను అమలుచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ఇన్–పేషెంట్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సేవలందించే కేంద్రాల వద్ద ఆక్సిజన్ బఫర్ స్టాక్ను సిద్ధంగా ఉంచాలన్నారు. ద్రవ ఆక్సిజన్ ట్యాంక్లను నింపాలని, రీఫిల్లింగ్ కోసం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద అదనపు ఆక్సిజన్ సిలిండర్లు, నిండుకుంటే వెంటనే తెప్పించే ఏర్పాట్లూ చేయాలని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ తాజా పరిస్థితిపై గురువారం సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోదీ సీఎంలతో వర్చువల్ సమీక్ష నిర్వహిస్తారు. కరోనా కేసుల ఉధృతి ఆగటం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ను జలుబుగా లెక్కకట్టొద్దు కరోనా కేసుల్లో వారపు పాజిటివిటీ మూడొందలకుపైగా జిల్లాల్లో ఐదు శాతాన్ని మించడంతో ఒమిక్రాన్ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని, తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ చెప్పారు. -
‘బఫర్స్టాక్’ భద్రమా?
గోదావరి నది ఉప్పొంగితే దాదాపు పది మండలాల్లో జనజీవనం అతలాకుత లమవుతుంది. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తాయి. ఇలాంటి సమయాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు మూడు నెలలకు సరిపడా సరుకులు ‘బఫర్స్టాక్’ పేరిట నిల్వ చేస్తారు. అయితే విపత్తుల సమయంలో బాధిత ప్రజానీకానికి అవసరమైన నిత్యావసర సరుకులను భద్రపరిచే విషయంలో సంబంధిత శాఖల అధికారులు పెద్దగా పట్టించుకోకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలంలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. * భద్రాచలం గోదాములో తడిసి ముద్దయిన బియ్యం * వాటినే ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలింపు * నిల్వలపై పూర్తి పర్యవేక్షణ కరువు భద్రాచలం : గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో ప్రజలకు అందజేసే బఫర్ స్టాక్ నిల్వలపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే ఆరోపణలున్నాయి. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసిన బియ్యం ఇటీవల కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించే క్రమంలో తడిసిన బియ్యం బస్తాలు వెలుగుచూశాయి. సుమారు వంద బస్తాల వరకూ బియ్యం తడిసిపోయి, బూజు పట్టింది. వీటిలో కొన్ని బస్తాలు పూర్తిగా గడ్డలు కట్టగా, మరికొన్నింటిలో బియ్యం బయటకు రావటంతో వాటిని అక్కడి సిబ్బంది గోదాం కాంపౌండ్ వాల్కు సమీపంలో పడేశారు. ఇలా పడేసిన బియ్యం పందులు, పశువులకు మేతగా మారింది. వీటిని గుర్తించిన సంబంధిత అధికారులు బియ్యాన్ని హడావిడిగా సోమవారం వివిధ మండలాల్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించారు. తడిసిపోయిన బియ్యం బస్తాలను కూడా వాటితో పాటుగా తరలించినట్టు సమాచారం. బాగా పాడై బూజు పట్టిన బియ్యాన్ని మహిళా కూలీలతో బాగుచేయించి వాటినే తిరిగి బస్తాల్లో పోశారు. గోదాముల్లో నిల్వ చేసిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఇలా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో బాధిత ప్రజానీకాన్ని ఆదుకునేందుకు గాను ముందుగానే నిత్యావసర సరుకులు నిల్వ చేస్తారు. గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని పది మండలాలతో పాటు, వాగులు పొంగి, దారీతెన్నూ లేని గిరిజన గ్రామాలను ముందుగానే గుర్తించటంతో ఆయా ప్రాంతాల్లో అప్రమత్తత కావాలని కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. భద్రాచలం గోదాములో బియ్యం తడిసిన విషయమై సంబంధిత గోదాం ఇన్చార్జ్ నరసింహారావు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా తడిసిపోయిన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. భద్రతపై అనుమానాలు ! గోదావరి నదికి వరదల వచ్చే సమయంలో పంపిణీ చేసేందుకని సిద్ధం చేసిన బఫర్ స్టాక్ భద్రంగానే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలంలోని ఏఎమ్సీ గోదాములో నిల్వ చేసిన బియ్యం తడిసిపోగా, మిగతా గోదాముల్లో ఉన్నవాటి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గోదావరి వరదల సమయంలో ప్రజల కోసం మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ముందుగానే ఆయా ప్రాంతాల్లో నిల్వ చేస్తారు. దమ్మపేటలో 46.077 టన్నులు, పాల్వంచలో 61.596 టన్నులు, ఇల్లెందులో 409.815 టన్నులు, వెంకటాపురంలో 829.983 టన్నులను నిల్వ చేశారు. వీటితో పాటు అదనంగా స్టేజ్ ఒన్ గోదామలుగా ఉన్న భద్రాచలంలో 200 టన్నులు, వెంకటాపురంలో 460 టన్నులు, బూర్గంపాడులో 10 టన్నులను అందుబాటులో ఉంచారు. కానీ భద్రాచలం ఏఎమ్సీ గోదాములో ఉన్న బియ్యం బస్తాలు ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే తడిసిపోగా, మిగతా ప్రాంతాల్లో ఉన్న బియ్యం పరిస్థితి ఏంటనే దానిపై అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విపత్తుల సమయంలో ఇంత నిర్లక్ష్యమా..? గోదావరి వరదలు ఈ ప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకండా చేస్తాయి. అధికారులు సైతం వారికి అందుబాటులో ఉండి రేయింబవళ్లు పనిచేస్తారు. కానీ విపత్తుల సమయంలో బాధిత ప్రజానీకానికి అవసరమైన నిత్యావసర సరుకులను భద్రపరిచే విషయంలో మాత్రం సంబంధిత శాఖల అధికారులు పెద్దగా పట్టించుకోకపోవటంపై సర్వ త్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను ఉద్యోగులను నియమించినప్పటికీ, వారు విధుల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్నట్లుగా భద్రాచలం ఘటన నిద ర్శనంగా నిలుస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ తగిన రీతిలో స్పందించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. గోదాములకు బాధ్యులను నియమించాం బఫర్ స్టాక్ నిల్వలు ఉంచిన గోదాములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకుగాను బాధ్యులను నియమించాం. భద్రాచలం గోదాములో బియ్యం తడి సిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై వివరాలు తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటాను. - వాణి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ తడిసిన బియ్యం తీసుకోం స్టేజ్ వన్గా ఉన్న గోదాములతో మాకు సంబంధం లేదు. ఆయా గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన వాటికే మేమే రక్షణగా ఉంటాము. తడిసిన బియ్యం వస్తే తీసుకోం. తమకు సరఫరా అయిన బియ్యాన్ని డిపోలకు చేరవేస్తున్నాము. - శంకర్, జీసీసీ బ్రాంచ్మేనేజర్ వాటితో మాకు సంబంధం లేదు భద్రాచలం గోదాములో ఉన్న బియ్యం నిల్వలతో మాకెటువంటి సంబంధం లేదు. రేషన్డిపోలకు వచ్చినవి భద్రంగా ఉన్నాయా లేదా అనే దానిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. - సైదులు , సివిల్ సప్లై డీటీ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement