-
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఆ పన్నుల్లో పదిశాతం రాయితీ
సాక్షి, అమరావతి: గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో పేదలు కొనుగోలుచేసే అవకాశం ఉండేలా 45, 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టుకు చెల్లించాల్సిన పన్నుల్లో పదిశాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఇళ్లు నిర్మిస్తే సంబంధిత గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన దానికంటే మరో అంతస్తు అదనంగా నిర్మించుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ మేరకు ఏపీ బిల్డింగ్ రూల్స్–2017ను సవరిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: (అది డైవర్ట్ చేయడానికే చిలక, గోరింక రుషికొండ వెళ్లాయి: మంత్రి అమర్నాథ్) -
కొత్త ఇంట్లో ఇంకుడుగుంత తప్పనిసరి!
గ్రేటర్తో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో అమలుకు రాష్ట్రప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: మీరు కొత్త ఇంటిని నిర్మిస్తున్నారా? ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లు, అంతకు మించి ఉంటుందా? అయితే.. మీరు నిర్మించుకునే ఇంట్లో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాల్సిందే. 300 చదరపు మీటర్లకు మించిన ప్లాట్లలో ఇంటిని నిర్మిస్తేనే ఇంకుడుగుంతను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అమలులో ఉన్న భవన నిర్మాణ నిబంధనలు పేర్కొంటున్నాయి. తాజాగా ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లు, అంతకు మించినా ఇంకుడుగుంత నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు భవన నిర్మాణ నియమావళి (జీవో 168)కి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోను పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర 73 నగర, పురపాలక సంస్థల పరిధిలో ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంత లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు ప్లాట్ విస్తీర్ణం 100-300 చదరపు మీటర్ల మధ్య ఉంటే కనీసం 1 మీటర్ ఁ1 మీటర్ వైశాల్యంలో ఇంకుడుగుంతను నిర్మించుకోవాల్సిందే. ప్లాట్ విస్తీర్ణం 300 మీటర్లకు మించితే జీవో 168లో నిర్దేశించిన వైశాల్యంతో ఇంకుడుగుంతలను నిర్మించాలని ప్రభుత్వం కోరింది. ఇంకుడుగుంత లేకుండా ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని ఆంక్షలు విధించింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో జనాభా శరవేగంగా పెరిగిపోతోంది. దీంతో భూగర్భ జలాల వినియోగం పెరిగిపోతుండగా.. వర్షపు నీటి సంరక్షణ చర్యలు లేక భూగర్భ జలాలు వృద్ధి కావడం లేదు. ఈ నేపథ్యంలో 100 చదరపు మీటర్లు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లలో ఇంకుడుగుంతను తప్పనిసరి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రతిపాదనలు సమర్పించగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
- రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
Advertisement